Kanika Tekriwal: క్యాన్సర్తో పోరాడి.. కంపెనీ పెట్టి.. రూ.420కోట్లు సంపాదించి..!
‘‘చిన్న పట్టణంలో పెద్ద పెద్ద కలలు కనే అమ్మాయి’’.. ఇన్స్టాగ్రామ్లో కనికా టెక్రివాల్ తన గురించి రాసుకున్నారిలా. కానీ, నిజ జీవితంలో ఆమె అంతకంటే ఎక్కువే. రెక్కలు కట్టుకుని ఎగరాలనే కల నెరవేరకపోయినా..
32ఏళ్లకే సంపన్న మహిళగా ఎదిగిన కనికా టెక్రివాల్
ఇంటర్నెట్ డెస్క్: ‘‘చిన్న పట్టణంలో పెద్ద పెద్ద కలలు కనే అమ్మాయి’’.. ఇన్స్టాగ్రామ్లో కనికా టెక్రివాల్ తన గురించి రాసుకున్నారిలా. కానీ, నిజ జీవితంలో ఆమె అంతకంటే ఎక్కువే. రెక్కలు కట్టుకుని ఎగరాలనే కల నెరవేరకపోయినా.. గాల్లో ఎగిరే విమానాల కంపెనీకి అధినేత్రి అయ్యింది. 16 ఏళ్ల వయసులోనే క్యాన్సర్తో పోరాడి.. 22 ఏళ్లకు సొంతంగా కంపెనీ పెట్టింది. స్వశక్తితో 32ఏళ్లకు రూ.420కోట్ల సంపాదించి దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన సంపన్నురాలిగా అరుదైన గుర్తింపు సాధించింది. కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్-హురున్ విడుదల చేసిన టాప్ 100 ధనిక మహిళల్లో తొలిసారి చోటు దక్కించుకున్న కనికా ప్రయాణం గురించి తెలుసుకుందాం..
పైలట్ అవ్వాలనుకుని..
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఓ మార్వాడి కుటుంబంలో కనికా జన్మించారు. ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కువగా పాటించే వారి కుటుంబంలో అమ్మాయిలు ఉద్యోగాలు చేసేందుకు ఒప్పుకునేవారు కాదంట. కానీ, కనికాకు చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలని విపరీతమైన కోరిక. ఇదే విషయం ఇంట్లో చెబితే ససేమిరా అన్నారు. దీంతో చేసేదేం లేక, తన కలను పక్కనబెట్టి డిజైనింగ్ రంగాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం ఇంట్లో వాళ్లని ఒప్పించి ముంబయి చేరుకున్నారు. అక్కడ ఓ కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తున్న సమయంలో విమానయాన రంగంపై తన ఆసక్తి గురించి కనికా తన బాస్కు చెప్పారు. ఆయన ప్రోత్సహించడంతో 16 ఏళ్ల వయసులో లండన్ వెళ్లి ఏవియేషన్ కోర్స్లో చేరారు.
క్యాన్సర్ అని తెలిసినా కుంగిపోలేదు..
కానీ, మనమొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది అంటారు కదా. లండన్లో చదువుకునే సమయంలో కనికా క్యాన్సర్ బారినపడ్డారు. దీంతో అక్కడ ఉండలేక తిరిగి భారత్కు వచ్చేశారు. ఏడాది పాటు ఎన్నో చికిత్సలు తీసుకుని, మనోధైర్యంతో క్యాన్సర్ను జయించారు. ఆ వ్యాధితో పోరాడుతున్న సమయంలోనే ప్రైవేటు విమానయానాలపై ఆమె ఆలోచన పడింది. ప్రైవేటు జెట్లలో ప్రయాణించాలనుకునేవారు బ్రోకర్లు లేదా ఆపరేటర్లను కలిసినప్పుడు వారు భారీ మొత్తంలో డబ్బులు, కమిషన్లు తీసుకుని విమానాలు అద్దెకు ఇచ్చేవారు. అంతేగానీ, ప్రయాణికుల ఇతర అవసరాలతో వారికి పనిలేదు. అంటే.. ప్రైవేటు విమానయానం అనేది లగ్జరీ మాత్రమేగాక, కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని అందరికీ అందుబాటు ధరల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కనికా ఓ కొత్త ఆలోచన చేశారు. దానికి రూపమే ‘జెట్సెట్గో’.
తొలి విమానమే టేకాఫ్ అవలేదు..
ప్రైవేటు జెట్లలో సౌకర్యంగా ప్రయాణించాలనుకునేవారి కోసం కనికా తొలుత 2012లో ‘జెట్సెట్గో’ పేరుతో సొంతంగా ఓ ఏవియేషన్ అగ్రిగేటర్ సర్వీసెస్ సంస్థను ప్రారంభించారు. ప్రైవేటు జెట్ యజమానులు తమ ఆన్లైన్ వేదికపై లిస్ట్ చేసుకుంటే అక్కడి నుంచి కస్టమర్లు విమానాలు బుక్ చేసుకునే సర్వీసు ఇది. అంటే అచ్చంగా ఓలా, ఉబర్ లాంటిదన్నమాట. ఈ కంపెనీ ద్వారా ఎయిర్ టాక్సీ సేవలను అందించాలని ఆమె అనుకున్నారు. అయితే ప్రారంభంలో ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ కంపెనీ నుంచి తొలి విమాన సర్వీసును షెడ్యూల్ చేయగా.. పైలట్ రాకపోవడంతో ఆ విమానం టేకాఫ్ అవలేదు. అలా ఆరంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా ఆమె ఉన్నడూ అధైర్యపడలేదు. ఆ తర్వాత సొంతంగా విమానాలు కొనుగోలు చేసి అద్దెకివ్వడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. అలా 10 ఏళ్లలోనే వ్యాపారాన్ని ఎన్నో రెట్లు వృద్ధి చేశారు. ప్రైవేటు జెట్లు, ఛార్టెడ్ విమానాలను నిర్వహించే తొలి భారత కంపెనీ ఈమెదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ సంస్థకు 10 ప్రైవేటు జెట్లు ఉన్నాయి.
టీ ఇవ్వడానికి వచ్చావా? అని అడిగారు..
కనికా ఈ స్థాయిలో రావడం అంత సులభమేం కాలేదు. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో అవమానాలు, ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ‘‘మేం కంపెనీ కోసం యాప్ ప్రారంభించిన కొత్తలో ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. నాకు ఇప్పటికీ ఓ సంఘటన గుర్తుంది. నా తొలి సేల్స్ మీటింగ్ అది. ఆ రోజు నేను ఓ పెద్ద కాన్ఫరెన్స్ గదిలోకి వెళ్లేసరికి అప్పటికే చాలా మంది పెద్దపెద్ద వాళ్లు అక్కడ కూర్చున్నారు. అందులో ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి.. టీ, కాఫీలు ఇవ్వడానికి వచ్చావా ? అని అడిగారు. ఆ సమయంలో నాకు చాలా ఏడుపొచ్చింది. కానీ ధైర్యాన్ని కూడగట్టుకుని నేను ఎందుకు అక్కడకు వచ్చానో స్పష్టంగా చెప్పాను’’ అని నాటి సంగతులను ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు కనికా.
ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మస్థైర్యం, స్వీయ ప్రేరణతోనే తాను వాటిని అధిగమించానని కనికా చెబుతుంటారు. ఈ సంస్థ ఇప్పుడు లక్ష మందికి పైగా కస్టమర్లకు సేవలందిస్తోంది. వీరిలో ఎక్కువ మంది రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలే. అన్నట్లు ఈ ఏడాదే కనికాకు హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
IndiGo: విమాన ప్రయాణంలో వినోదాన్ని అందించే సేవల్ని మే1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో పేర్కొంది. -
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
Gold price: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా గిరాకీ తగ్గడంతో అంతర్జాతీయంగా వీటి ధరలు దిగివచ్చాయి. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో భారీ పెట్టుబడులు
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ.. వాటి విడిభాగాల ఉత్పత్తి నిమిత్తం రూ.25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది. -
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
OTP frauds: ఓటీపీ స్కామ్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందులోభాగంగానే టెలికాం, ఎస్బీఐ కార్డ్స్తో కలిసి పనిచేస్తోంది. -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 89 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
విమానాల్లో తల్లిదండ్రులకు పక్కనే చిన్నారులకు సీటు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. -
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్