Recession: లోదుస్తులు.. ఆర్థిక మాంద్యం.. వీటి మధ్య ఉన్న లింకేంటి?
Recession: దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని అంచనా వేయడానికి పురుషుల లోదుస్తుల విక్రయాలు సంకేతాలు ఇస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: ఒకదేశ ఆర్థిక వ్యవస్థ (Economy)ను అంచనా వేయడానికి అనేక కొలమానాలు అందుబాటులో ఉన్నాయి. స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయాదాయం, వృద్ధి రేటు, ప్రజల కొనుగోలు శక్తి.. ఇలా చాలా మార్గాల ద్వారా ఆర్థిక వ్యవస్థ గమనాన్ని అంచనా వేయొచ్చు. ఒక దేశం ఆర్థికంగా పురోగమిస్తుందా లేదా తిరోగమన దిశలో పయనిస్తుందా తెలుసుకోవడానికి ఇది చాలా కీలకం. అయితే, పురుషుల లోదుస్తుల విక్రయాలు కూడా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ (Economy) తీరుతెన్నులను బహిర్గతం చేస్తుందట. వినడానికి కొంత వింతగా ఉన్నా.. ఇది నిజమేనంటున్నారు నిపుణులు!
ఎలాగంటే..
దీన్ని తొలిసారి అమెరికా ఫెడరల్ రిజర్వ్ మాజీ ఛైర్మన్ అలెన్ గ్రీన్స్పాన్ సూత్రీకరించారు. పురుషుల లోదుస్తులు ఆర్థిక వ్యవస్థ (Economy) అంచనాకు చాలా కీలకమైన అంశమని ఆయన పేర్కొన్నారు. డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు పురుషులు తమ లోదుస్తుల కొనుగోలును వాయిదా వేసుకుంటారట! వెంటనే పాతవాటిని మార్చడానికి అంతగా ఇష్టపడరని ఆయన వివరణ ఇచ్చారు. అదే రాబోయే ఆర్థికమాంద్యాన్ని (Recession) సూచిస్తుందని తెలిపారు.
భారత్లో 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం కలవరానికి గురిచేసింది. అయినప్పటికీ.. లోదుస్తుల విక్రయాలు మాత్రం దెబ్బతినలేదు. కానీ, డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం నాటికి పరిస్థితులు మారాయి. జాకీ, లక్స్ పేరిట లోదుస్తులను విక్రయిస్తున్న పేజ్ ఇండస్ట్రీస్ విక్రయాలు 11 శాతం పడిపోయాయి. ఈ కంపెనీ స్టాక్ విలువ ఐదు శాతం కుంగింది. రూప అండ్ కంపెనీ అమ్మకాల్లో 55 శాతం క్షీణత నమోదైంది. గత ఏడాది వ్యవధిలో రూప స్టాక్ విలువ 52 శాతం తగ్గింది. ఇలా వరుసగా పురుషుల లోదుస్తుల విక్రయాలు క్షీణిస్తే అలెన్ థియరీ ప్రకారం.. ఆర్థిక వ్యవస్థ (Economy)లో ఇబ్బందులు ఉన్నాయని అర్థం.
ఈ సూచీలూ అలాంటివే..
ఇదే తరహాలో లిప్స్టిక్ ఇండెక్స్ అని కూడా ఓ సూచీ ఉంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖరీదైన అలంకరణ వస్తువుల కొనుగోలును ఆడవాళ్లు వాయిదా వేసుకుంటారట! వాటి స్థానాన్ని ఆకర్షణీయమైన లిప్స్టిక్ల ద్వారా భర్తీ చేసుకుంటారని ఆర్థిక నిపుణుల భావన! అంటే ఆర్థిక మాంద్యం (Recession) ముంచుకొచ్చే ముందు లిప్స్టిక్ల విక్రయాలు గణనీయంగా పెరుగుతాయట. దీన్ని లియోనార్డ్ లాడర్ అనే వ్యాపారవేత్త సూత్రీకరించారు. 2000లో వచ్చిన ఆర్థిక మందగమన సమయంలో లిప్స్టిక్ విక్రయాలు గణనీయంగా పెరగడం దానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. అయితే, 2008 ఆర్థిక మాంద్యం సమయంలో ఇది తప్పని తేలింది. ఆర్థిక మాంద్యం ముదిరిన కొద్దీ లిప్స్టిక్ విక్రయాలు పడిపోయాయి. దీంతో లిప్స్టిక్ ఇండెక్స్ ఆర్థిక వ్యవస్థ (Economy)ను అంచనా వేయడానికి ఇక ఏమాత్రం ఆధారం కాదని పలువురు నిపుణులు కొట్టిపారేశారు. అయితే, మహిళలు నెయిల్ పాలిష్కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లే లిప్స్టిక్ ఇండెక్స్ అంచనాలు తప్పాయని మరికొందరు వాదించారు. ఆ క్రమంలో ‘నెయిల్ పాలిష్ ఇండెక్స్’ను కూడా తెరపైకి తెచ్చారు. మరోవైపు కరోనా సమయంలో ‘మాస్కారా ఇండెక్స్’ అని కొత్త సూచీ వినిపించింది. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం చాలా మంది మాస్కులు ధరించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో కళ్లు మాత్రమే బయటకు కనిపిస్తుండడంతో వాటికి సంబంధించిన అలంకరణ వస్తువుల విక్రయాలు పెరిగాయట.
తొలి సంకేతాలు..
ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ (Economy)కు సంబంధించిన కచ్చితమైన గణాంకాలను వెలువరించనప్పటికీ.. ప్రాథమిక సంకేతాలు మాత్రం చెబుతాయని నిపుణులు అంటున్నారు. వీటిని ఆధారంగా చేసుకొని లోతైన అధ్యయనం జరపడానికి ఇవి దోహదం చేస్తాయని వివరిస్తున్నారు. అంటే ఇవి ఒక ‘ట్రిగ్గర్ పాయింట్’లా పనిచేస్తాయని వారి విశ్వాసం. 2009 ఆర్థిక మాంద్యం (Recession) సమయంలో అమెరికాలో 2007 నుంచే పురుషుల లోదుస్తుల విక్రయాలు గణనీయంగా పడిపోయాయట. తిరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రారంభం అయ్యాక 2010లో మళ్లీ విక్రయాలు పెరిగాయట. మరోవైపు కరోనాకు ముందు 2019లో అగ్రరాజ్యంలో ఆరు బిలియన్ డాలర్లు విలువ చేసే లోదుస్తులు విక్రయాలు జరిగాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2020 నాటికి అవి 4.5 బిలియన్ డాలర్లకు కుంగాయి. దాదాపు 25 శాతం పడిపోయాయి. అదే 2021లో తిరిగి 22 శాతం పుంజుకొని 5.5 బిలియన్ డాలర్లకు చేరాయి.
ద్రవ్యోల్బణాన్ని నివారించడం కోసం గత ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులన్నీ కీలక వడ్డీరేట్లను పెంచుతున్నాయి. దీంతో ఆర్థిక వృద్ధి కుంటుపడుతూ వస్తోంది. 2023లో మూడోవంతు దేశాలు ఆర్థిక మాంద్యం (Recession)లోకి జారుకుంటాయని ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)’ అంచనా వేసింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తే దాన్ని మాంద్యంగా వ్యవహరిస్తారు. అయితే, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ (Economy) మాత్రం బలంగా ఉంటుందని ఇప్పటికే పలు నివేదికలు ఉద్ఘాటించాయి. కానీ, ఆర్బీఐ అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానాన్ని గమనిస్తే.. భారత్కు సైతం కొన్ని ఇబ్బందులు తప్పవనే విషయం స్పష్టమవుతోంది. మరి ఇటీవల భారత్లో తగ్గిన లోదుస్తుల విక్రయాలు అందుకు సంకేతమా? చూడాల్సి ఉంది!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి