Mercedes-Benz: మెర్సిడెస్ బెంజ్లో సూపర్ కంప్యూటర్ తరహా పెర్ఫార్మెన్స్
తమ కార్లలో నావిగేషన్ సహా సూపర్ కంప్యూటర్ తరహా పెర్ఫార్మెన్స్ను అందించేందుకు గూగుల్ (Google)తో చేతులు కలిపినట్లు మెర్సిడెస్ బెంజ్ గురువారం ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: రోజురోజుకీ కార్లలో వస్తున్న సాంకేతికత డ్రైవింగ్ను సులభతరం చేస్తోంది. పెద్ద ఎత్తున సమాచారాన్ని విశ్లేషించి ప్రమాదాలను అరికట్టేందుకు దోహదం చేస్తోంది. మానవ ప్రమేయాన్ని తగ్గించి ఆటోమేటిక్ డ్రైవింగ్ దశకు చేరుస్తోంది. ఈ ప్రయాణంలో బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా ముందు వరుసలో ఉంది. చైనాకు చెందిన పలు కంపెనీలు కూడా ఇటీవలి కాలంలో ఎంతో పురోగతి సాధించాయి. తాజాగా మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) వీటికి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది.
తమ కార్లలో నావిగేషన్ సహా సూపర్ కంప్యూటర్ తరహా పనితీరును అందించేందుకు గూగుల్ (Google)తో చేతులు కలిపినట్లు మెర్సిడెస్ బెంజ్ గురువారం ప్రకటించింది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ సెన్సర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఖరీదైన, అత్యంత శక్తిమంతమైన సెమీకండక్టర్ల కొనుగోలు కోసం ఎన్విడియా (Nvidia) కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకొంది. ఖర్చును తగ్గించుకునేందుకు కార్ల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత వాటాను ఆ సంస్థకు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. 2020 నుంచి ఈ కంపెనీ మెర్సిడెస్ బెంజ్కు ఆటోమేటెడ్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్ పార్ట్నర్గా వ్యవహరిస్తోంది.
లెవెల్ 3 ఆటోమేటెడ్ డ్రైవింగ్కు కావాల్సిన లైడార్ సెన్సర్ టెక్నాలజీ కావాల్సిన కస్టమర్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుందని మెర్సిడెస్ బెంజ్ సీఈఓ ఓలా క్యాలెనియస్ తెలిపారు. మరోవైపు సెల్ఫ్ డ్రైవింగ్కు కావాల్సిన సెన్సర్లను తయారు చేసే ల్యూమినార్ టెక్లో మెర్సిడెస్కు వాటాలున్నాయి. తాజాగా బెంజ్ కార్లలో సెన్సర్ల అనుసంధానానికి సంబంధించి మల్టీ- బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరినట్లు ల్యూమినస్ ప్రకటించింది.
గూగుల్తో చేతులు కలపడం వల్ల ట్రాఫిక్ సమాచారం, ఆటోమేటిక్ రీరూటింగ్ వంటి సాంకేతికత తమ కార్లకు అందుతుందని మెర్సిడెస్ తెలిపింది. లెవెల్ 3 అటానమస్ డ్రైవింగ్ మోడ్లో ఉన్నప్పుడు డ్రైవర్లు యూట్యూబ్ ద్వారా ఎంటర్టైన్మెంట్ని కూడా పొందొచ్చని పేర్కొంది. జనరల్ మోటార్స్, రెనో, నిస్సాన్, ఫోర్డ్ వంటి సంస్థలు ఇప్పటికే తమ కార్లలో గూగుల్ సర్వీసెస్ను పొందుపర్చాయి. గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్ సహా ఇతర అప్లికేషన్లు అందుబాటులో ఉంచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. -
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) క్రెటా ఎన్లైన్ను హ్యుందాయ్ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించారు. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
Automobile Sales: ఫిబ్రవరి వాహన విక్రయాల్లో 13% వృద్ధి
Automobile Sales: ఫిబ్రవరిలో వాహన విక్రయ గణాంకాలను ఫాడా గురువారం వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన గత నెలలో 13 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. -
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ కొత్త మోడళ్లు
బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్ శ్రేణిలో 2024 సంవత్సర మోడళ్లను విపణిలోకి విడుదల చేసింది. -
టాటా ఎస్యూవీల్లో డార్క్ సిరీస్లు
టాటా మోటార్స్ తన నెక్సాన్ ఎస్యూవీ బ్రాండ్లో డార్క్ సిరీస్లను విడుదల చేసింది. సంప్రదాయ ఐసీఈ ఇంజిన్, విద్యుత్తు మోడళ్లలోనూ ఇవి అందుబాటులో ఉంటాయి. -
మార్కెట్లోకి BYD సీల్ EV.. 15 నిమిషాల ఛార్జింగ్తో 200km ప్రయాణం
BYD: చైనా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం BYD.. సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ధర, ఇతర వివరాలు ఇవీ.. -
మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్
సరికొత్త డిజైన్, ప్రీమియం ఫీచర్లతో థార్ ఎర్త్ ఎడిషన్ను మహీంద్రా ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో, కావాల్సిన యాక్సెసరీస్తో ఈ కార్లను కొనుగోలు చేసుకోవచ్చు. -
కొత్త ఫీచర్లతో టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ 150ఎఫ్ బైక్
మోటార్సైకిల్ టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ అమ్మకాలు అంతర్జాతీయంగా 35 లక్షల స్థాయిని అధిగమించిన సందర్భంగా, అదనపు ఫీచర్లతో టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ 150ఎఫ్ను విడుదల చేస్తున్నట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ వెల్లడించింది. -
మహీంద్రా స్కార్పియో-ఎన్ జెడ్8 సెలెక్ట్
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) సంస్థ, ‘స్కార్పియో-ఎన్ జెడ్8 సెలెక్ట్’ వేరియంట్ను గురువారం విడుదల చేసింది. -
భారత్లోకి కొత్త కవాసకి నింజా 500
ఇండియా కవాసకి మోటార్స్, దేశీయ విపణిలోకి 2024 నింజా 500ను తీసుకొచ్చింది. ఈ వాహనాన్ని పూర్తిగా తయారైన స్థితి (సీబీయూ)లో దిగుమతి చేసుకుంటున్నారు. -
kawasaki: కవాసకి నుంచి కొత్త బైక్.. ధర రూ.9.29 లక్షలు
kawasaki z900: ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి జెడ్ 900 పేరుతో కొత్త బైక్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
Hero MotoCorp: వచ్చే ఆర్థిక సంవత్సరం టూవీలర్ పరిశ్రమలో రెండంకెల వృద్ధి: హీరో మోటోకార్ప్
Hero MotoCorp: ప్రీమియం బైక్లకు ఆదరణ పుంజుకుంటోందని హీరోమోటోకార్ప్ సీఈఓ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరాకీ మెరుగవుతోందని చెప్పారు. -
Ola Electric: ఓలా ఆఫర్.. ఈ స్కూటర్లపై ₹25 వేల వరకు తగ్గింపు
Ola Electric: విద్యుత్ స్కూటర్లపై ఓలా ఎలక్ట్రిక్ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.25వేల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. -
ప్రయాణికుల వాహన అమ్మకాల్లో 14% వృద్ధి
ప్రయాణికుల వాహన (పీవీలు) అమ్మకాలు జనవరిలో 14 శాతం పెరిగి 3,93,074 వాహనాలుగా నమోదయ్యాయి. జనవరి నెలకు గాను ఇప్పటివరకు ఇవే అత్యధిక విక్రయాలు కావడం గమనార్హం. -
Vehicle Sales: జనవరిలో రికార్డు స్థాయి గరిష్ఠానికి ప్రయాణికుల వాహన విక్రయాలు
Vehicle Sales: 2023 జనవరిలో 3,47,086 యూనిట్ల పీవీలు అమ్ముడు కాగా.. ఈసారి అవి 13 శాతం పెరిగి 3,93,250కి చేరాయి. -
ఈవీలపై టాటా మోటార్స్ డిస్కౌంట్.. ₹1.2 లక్షల వరకు తగ్గింపు
Tata motors: టాటా మోటార్స్ తన విద్యుత్ కార్లపై డిస్కౌంట్ ప్రకటించింది. నెక్సాన్, టియాగో మోడళ్లపై రూ.1.2 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు