Mercedes-Benz: మెర్సిడెస్ బెంజ్లో సూపర్ కంప్యూటర్ తరహా పెర్ఫార్మెన్స్
తమ కార్లలో నావిగేషన్ సహా సూపర్ కంప్యూటర్ తరహా పెర్ఫార్మెన్స్ను అందించేందుకు గూగుల్ (Google)తో చేతులు కలిపినట్లు మెర్సిడెస్ బెంజ్ గురువారం ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: రోజురోజుకీ కార్లలో వస్తున్న సాంకేతికత డ్రైవింగ్ను సులభతరం చేస్తోంది. పెద్ద ఎత్తున సమాచారాన్ని విశ్లేషించి ప్రమాదాలను అరికట్టేందుకు దోహదం చేస్తోంది. మానవ ప్రమేయాన్ని తగ్గించి ఆటోమేటిక్ డ్రైవింగ్ దశకు చేరుస్తోంది. ఈ ప్రయాణంలో బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా ముందు వరుసలో ఉంది. చైనాకు చెందిన పలు కంపెనీలు కూడా ఇటీవలి కాలంలో ఎంతో పురోగతి సాధించాయి. తాజాగా మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) వీటికి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది.
తమ కార్లలో నావిగేషన్ సహా సూపర్ కంప్యూటర్ తరహా పనితీరును అందించేందుకు గూగుల్ (Google)తో చేతులు కలిపినట్లు మెర్సిడెస్ బెంజ్ గురువారం ప్రకటించింది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ సెన్సర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఖరీదైన, అత్యంత శక్తిమంతమైన సెమీకండక్టర్ల కొనుగోలు కోసం ఎన్విడియా (Nvidia) కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకొంది. ఖర్చును తగ్గించుకునేందుకు కార్ల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత వాటాను ఆ సంస్థకు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. 2020 నుంచి ఈ కంపెనీ మెర్సిడెస్ బెంజ్కు ఆటోమేటెడ్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్ పార్ట్నర్గా వ్యవహరిస్తోంది.
లెవెల్ 3 ఆటోమేటెడ్ డ్రైవింగ్కు కావాల్సిన లైడార్ సెన్సర్ టెక్నాలజీ కావాల్సిన కస్టమర్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుందని మెర్సిడెస్ బెంజ్ సీఈఓ ఓలా క్యాలెనియస్ తెలిపారు. మరోవైపు సెల్ఫ్ డ్రైవింగ్కు కావాల్సిన సెన్సర్లను తయారు చేసే ల్యూమినార్ టెక్లో మెర్సిడెస్కు వాటాలున్నాయి. తాజాగా బెంజ్ కార్లలో సెన్సర్ల అనుసంధానానికి సంబంధించి మల్టీ- బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరినట్లు ల్యూమినస్ ప్రకటించింది.
గూగుల్తో చేతులు కలపడం వల్ల ట్రాఫిక్ సమాచారం, ఆటోమేటిక్ రీరూటింగ్ వంటి సాంకేతికత తమ కార్లకు అందుతుందని మెర్సిడెస్ తెలిపింది. లెవెల్ 3 అటానమస్ డ్రైవింగ్ మోడ్లో ఉన్నప్పుడు డ్రైవర్లు యూట్యూబ్ ద్వారా ఎంటర్టైన్మెంట్ని కూడా పొందొచ్చని పేర్కొంది. జనరల్ మోటార్స్, రెనో, నిస్సాన్, ఫోర్డ్ వంటి సంస్థలు ఇప్పటికే తమ కార్లలో గూగుల్ సర్వీసెస్ను పొందుపర్చాయి. గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్ సహా ఇతర అప్లికేషన్లు అందుబాటులో ఉంచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. -
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) క్రెటా ఎన్లైన్ను హ్యుందాయ్ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించారు. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
Automobile Sales: ఫిబ్రవరి వాహన విక్రయాల్లో 13% వృద్ధి
Automobile Sales: ఫిబ్రవరిలో వాహన విక్రయ గణాంకాలను ఫాడా గురువారం వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన గత నెలలో 13 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?