Meta: మెటా ఇండియాకు లేడీ బాస్.. కొత్త సంవత్సరంలో బాధ్యతలు!
మెటా ఇండియా హెడ్గా సంధ్య దేవనాథన్ను సంస్థ నియమించింది. ప్రస్తుతం మెటా ఆసియా-పసిఫిక్ డివిజన్ గేమింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆమె కొత్త సంవత్సరంలో మెటా ఇండియా బాధ్యతలు చేపట్టనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
దిల్లీ: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ మెటా ఇండియా హెడ్గా సంధ్య దేవనాథన్ను నియమించింది. జనవరి 1,2023 నుంచి ఆమె బాధ్యతలు చేపడతారని మెటా ఒక ప్రకటనలో తెలిపింది. సంధ్య దేవనాథన్, ప్రస్తుతం మెటా ఆసియా-పసిఫిక్ డివిజన్ గేమింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు ఆమె మెటా సింగపూర్ ఎండీ, మెటా వియత్నాం బిజినెస్ హెడ్గా బాధ్యతలు నిర్వహించారు.
సంధ్య 2000 సంవత్సరంలో దిల్లీ యూనివర్శిటీ నుంచి ఫ్యాకల్టీ మేనేజ్మెంట్లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. 2016లో ఆమె సింగపూర్, వియత్నాంలలో మెటా బిజినెస్ అభివృద్ధి బాధ్యతలు చేపట్టారు. బ్యాంకింగ్, పేమెంట్స్, టెక్నాలజీ వంటి విభాగాల్లో ఆమెకు 22 ఏళ్ల అనుభవం ఉన్నట్లు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణ, టీమ్ మేనేజ్మెంట్, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలలో సంధ్య దేవనాథన్కు ఉన్న అనుభవం మెటా సంస్థ భారత్లో బలపడేందుకు మరింత తోడ్పడుతుందని మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ అన్నారు.
ఇటీవలే మెటా ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్గా శివనాథ్ తుక్రాల్ను కంపెనీ నియమించింది. గతంలో ఈయన వాట్సాప్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్గా వ్యవహరించారు. కొద్దిరోజుల క్రితం మెటా ఇండియా హెడ్గా ఉన్న అజిత్ మోహన్ తన పదవి నుంచి వైదొలిగారు. తర్వాత మెటా పబ్లిక్ పాలసీ విభాగాధిపతి రాజీవ్ అగర్వాల్, వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ సైతం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వారి స్థానంలో మెటా సంస్థ కొత్తవారిని నియమించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్