Meta: మెటా ఇండియా హెడ్‌ అజిత్‌ మోహన్‌ గుడ్‌బై

మెటా ఇండియా హెడ్‌ అజిత్‌ మోహన్‌ తన బాధ్యతల నుంచి వైదొలిగారు. మరో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం స్నాప్‌లో జాయిన్‌ అయినట్లు తెలుస్తోంది.

Published : 03 Nov 2022 21:53 IST

దిల్లీ: మెటా ఇండియా హెడ్‌ అజిత్‌ మోహన్‌ తన బాధ్యతల నుంచి వైదొలిగారు. మరో అవకాశం రావడంతో మెటాకు రాజీనామా చేసిన్లు మెటా వైస్‌ ప్రెసిడెంట్‌ నికోలా తెలిపారు. అజిత్‌ మోహన్‌ ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం స్నాప్‌లో చేరినట్టు తెలుస్తోంది. 2019 జనవరిలో అజిత్‌ మోహన్‌ ఫేస్‌బుక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా చేరారు. అంతకుముందు హాట్‌స్టార్‌లో సీఈఓగా నాలుగేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని