Meta Layoffs: భారత్లో ఉన్నతోద్యోగులకూ మెటా ఉద్వాసన!
Meta Layoffs: 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మార్చిలో మెటా ప్రకటించింది. అందులో భాగంగా గత నెలలో 4 వేల మందిని, తాజాగా మరో 6 వేల మందిని ఇంటికి పంపింది.
Meta Layoffs | న్యూయార్క్: ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్ఫామ్స్ ఉద్యోగుల తొలగింపు (Meta Layoffs) ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా మరో 6,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా ఉద్యోగులను తీసివేయనున్నట్లు మార్చిలో సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
దాదాపు 10 వేల మందికి ఉద్వాసన (Meta Layoffs) పలుకుతామని మార్చిలోనే మెటా ప్రకటించింది. వీటిని ఏప్రిల్, మేలో రెండు విడతలుగా చేపడతామని వెల్లడించింది. అందుకనుగుణంగానే ఏప్రిల్లో నాలుగు వేల మందిని ఇంటికి పంపింది. మిగిలిన ఆరు వేల మందిని తాజాగా తొలగించింది. మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ ఇంజినీరింగ్, ప్రోగ్రాం మేనేజ్మెంట్ సహా చాలా విభాగాల్లో తొలగింపులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇంజీనిరింగ్యేతర విభాగాల్లో అత్యధిక తొలగింపులు ఉన్నట్లు సమాచారం. ఉద్వాసనకు గురైన ఉద్యోగులు లింక్డిన్ వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
తొలగింపుల్లో భాగంగా భారత్లో పనిచేస్తున్న ఉద్యోగులనూ మెటా (Meta Layoffs) ఇంటికి పంపింది. పింక్ స్లిప్స్ అందుకున్న వారిలో భారత్లో పలువురు ఉన్నతోద్యోగులు ఉన్నట్లు సమాచారం. మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ అవినాశ్ పంత్, మీడియా పార్ట్నర్షిప్స్ డైరెక్టర్ సాకేత్ ఝా సౌరభ్ సైతం ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇలా భారత్లో మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, మానవ వనరుల విభాగాల్లో పలువురు ఉద్యోగాలు కోల్పోయారు.
ఫస్ట్ రిపబ్లిక్లో 1000 మందికి జేపీ మోర్గాన్ ఉద్వాసన..
ఇటీవల దివాలా తీసిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్లో 15 శాతానికి సమానమైన 1,000 మందిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు జేపీ మోర్గాన్ చేజ్ ప్రకటించింది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు 60 రోజుల వేతనంతో పాటు ఏకమొత్తంలో కొంత నగదును పరిహారంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ దివాలా తీయడంతో దాన్ని జేపీ మోర్గాన్ చేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
అలీబాబాలో 15 వేల నియామకాలు..
ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే చైనాకు చెందిన ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా మాత్రం భారీ ఎత్తున కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. మొత్తం ఆరు విభాగాల్లో 15 వేల మందిని విధుల్లోకి తీసుకోనున్నట్లు తెలిపింది. వీరిలో 3,000 మంది ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నవారిని తీసుకుంటామని పేర్కొంది. మరోవైపు అలీబాబా ఉద్యోగులను తొలగించనున్నట్లు వస్తున్న వార్తలను కంపెనీ ఖండించింది. అయితే, అలీబాబా క్లౌడ్ డివిజన్ మాత్రం 7 శాతం ఉద్యోగులను తొలగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.