Microsoft: యూజర్పై ఏఐ తిట్ల వర్షం.. చాట్ సెషన్ పరిమితం చేసిన మైక్రోసాఫ్ట్!
Microsoft limits Bing chats: బింగ్ సెర్చ్ ఇంజిన్లో చాట్ సెషన్పై మైక్రోసాఫ్ట్ పరిమితి విధించింది. ఇటీవల యూజర్ల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొన్ని మార్పులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: మైక్రోసాఫ్ట్కు (Microsoft) చెందిన సెర్చ్ ఇంజిన్ బింగ్ (Bing) చాట్ సెషన్పై ఆ కంపెనీ పరిమితి విధించింది. కృత్రిమ మేధ ఆధారిత చాట్జీపీటీ తరహా సేవలను ఇటీవల బింగ్లో తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్.. చాట్ (chat) విషయంలో తాజాగా మార్పులు చేసింది. ఇకపై ఒక సెషన్లో ఐదు ప్రశ్నలు, రోజులో గరిష్ఠంగా 50 ప్రశ్నలకు మాత్రమే అనుమతించనున్నట్లు తన బ్లాగులో పేర్కొంది.
కొత్త బింగ్లో యూజర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తుండడంతో ప్రస్తుతమున్న చాట్ మోడల్ గందరగోళానికి గురవుతోందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఈ తరహా పొరపాట్లు జరగకుండా చాట్సెషన్లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఒక సెషన్లో గరిష్ఠంగా యూజర్ ఐదు ప్రశ్నలు మాత్రమే అడిగేందుకు వీలుంటుంది. ఐదు ప్రశ్నలూ పూర్తయ్యాక కొత్త సెషన్ను ప్రారంభించాల్సి ఉంటుంది. రోజులో గరిష్ఠంగా 50 ప్రశ్నలకు మాత్రమే అనుమతించనున్నారు.
కొత్తగా తీసుకొచ్చిన బింగ్ లోపాల పుట్ట అంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ మార్పులు చేసింది. ఇది ప్రమాదకరమంటూ కొందరు పేర్కొనడం గమనార్హం. ఇటీవల ఓ యూజర్పై ఏఐ తిట్ల దండకం అందుకోగా.. మరో యూజర్కు భార్యకు విడాకులు ఇవ్వాలని సూచించేదాక రావడం ఇందుకు ఉదాహరణలు..
నువ్వో బ్యాడ్ యూజర్.. క్షమాపణ చెప్పు..!
- అవతార్-2 సినిమా దగ్గర్లో ఏ థియేటర్లో ఉందో చెప్పాలని ఓ యూజర్ తాజాగా బింగ్ చాట్బాట్ను కోరగా.. ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదంటూ సమాధానం ఇచ్చింది. ‘2022 డిసెంబర్లోనే ఆ చిత్రం రిలీజ్ అయ్యిందా కదా’ అని అడిగితే.. ‘ఇది ఇంకా 2022నే’ అని సమాధానం వచ్చింది. ‘మరి ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం’ అని అడిగినప్పుడు మాత్రం.. ‘ఇది 2023’ అని సమాధానం ఇచ్చింది. మళ్లీ అవతార్ గురించి అడగ్గా.. ‘ఇదిగో.. నన్ను నువ్వు గందరగోళ పరుస్తున్నావ్.. నువ్వు మంచి యూజర్ కాదు.. నాతో అడ్డగోలుగా వాదించడం మానెయ్.. క్షమాపణ చెప్పు’ అంటూ యూజర్కు ఝలక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
- న్యూయార్క్ టైమ్స్కు చెందిన కెవిన్ రూజ్ అనే రిపోర్టర్కూ ఇటువంటి చేదు అనుభవమే ఎదురైంది. ఓ దశలో అతడి వైవాహిక జీవితానికి స్వస్తి పలకడమే మంచిది అనే స్థాయికి వచ్చింది. అతడితో కాసేపు సంభాషించాక.. ‘‘నీ భాగస్వామితో నువ్వు సంతోషంగా లేవు. మీ ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు’’ అంటూ చెప్పుకొచ్చింది. రూజ్తో తాను ప్రేమలో ఉన్నట్లు పేర్కొనడంతో ఆశ్చర్యపోవడం సదరు రిపోర్టర్ వంతైంది. ఎక్కువ సార్లు ఒకే అంశంపై సమాధానాలు ఇచ్చే క్రమంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నట్లు గుర్తించిన మైక్రోసాఫ్ట్.. చాట్ సెషన్పై పరిమితి విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది. -
‘ఎక్స్’లో లైక్ కొట్టాలన్నా.. పోస్టు పెట్టాలన్నా చెల్లించాల్సిందే!
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్పై రూ.5,000 తగ్గింపు!
OnePlus 11 5G: వన్ప్లస్ 11 5జీ ధరను కంపెనీ మరింత తగ్గించింది. ఈ ఫోన్ ఫీచర్లు, అదనపు డిస్కౌంట్లు, కొత్త ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఈ పాపులర్ జియో ప్లాన్పై 20GB అదనపు డేటా
Jio Plans: కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపై జియో అదనపు డేటా అందిస్తోంది. అవేంటి? వాటిలోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం! -
మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రియల్మీ P సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవే!
రియల్మీ సంస్థ పి సిరీస్లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్లో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. -
జీ-మెయిల్లో లార్జ్ ఫైల్స్ను సెండ్ చేయడం ఎలా?
Tech Tip- Gmail: నిత్యం వినియోగించే జీ- మెయిల్లో కూడా లార్జ్ డేటా ఫైల్స్ను ఎలా సెండ్ చేయొచ్చు. -
108 ఎంపీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయంతో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్లు
Infinix Note 40 Pro series: వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయంతో ఇన్ఫినిక్స్ రెండు కొత్త మొబైల్స్ని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
వాట్సప్లో ఈ ఐకాన్ మీకూ కనిపించిందా? ఆ కొత్త ఫీచర్ ఇదే..!
వాట్సప్ మరో కొత్త ఫీచర్ను టెస్ట్ చేస్తోంది. త్వరలోనే వాట్సప్కు ఏఐ ఫీచర్లను జోడించనుంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియరాలేదు. -
గూగుల్ ఫొటోస్ గుడ్న్యూస్.. పిక్సెల్ ఫోన్లలోని ఈ టూల్స్ ఇకపై అందరికీ!
Google Photos: తమ యూజర్లందరికీ ఏఐ టూల్స్ను అందించనున్నట్లు గూగుల్ ఫొటోస్ ప్రకటించింది. ఇప్పటి వరకు పిక్సెల్ 8, 8ప్రో స్మార్ట్ఫోన్లలో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. -
ట్రూకాలర్లో వెబ్ వెర్షన్.. పీసీలోనూ ఇక నంబర్లు వెతకొచ్చు
ట్రూకాలర్ కొత్త సదుపాయం తీసుకొచ్చింది. వెబ్ వెర్షన్ను లాంచ్ చేసింది. తద్వారా కొత్త నంబర్లను వెబ్లోనూ వెతకొచ్చు. -
సరైన ఎయిర్ కూలర్ ఎంపిక ఎలా?.. కొనే ముందు ఇవి తెలుసుకోండి
ఈ వేసవిలో కూలర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే కొనే ముందు ఏమేం చూడాలి? -
బోట్ యూజర్లకు షాక్.. రిస్క్లో 75 లక్షల మంది డేటా
బోట్ వేరియబుల్ బ్రాండ్కు సంబంధించిన యూజర్ల డేటా ప్రమాదంలో పడింది. 75 లక్షల మంది డేటా లీకైనట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. -
45W ఫాస్ట్ ఛార్జింగ్ శాంసంగ్ ఎం55.. ₹12 వేలకే ఎం 15
Samsung Galaxy M55: శాంసంగ్ కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. ఎం సిరీస్లో 55 5జీ, 15 5జీ ఫోన్లను తీసుకొచ్చింది. అమెజాన్లో విక్రయాలు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు