భారత్లో ఏసీ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్న మిత్సుబిషి
జపాన్కు చెందిన మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇండియాలో తన మొట్టమొదటి ఎయిర్ ఎండిషనర్లు, కంప్రెసర్ల తయారీ కేంద్రాన్ని చెన్నైలో ఏర్పాటు చేయనుంది.
దిల్లీ: మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇండియా.. భారత్లో ఎయిర్ కండిషనర్లు, కంప్రెషర్ల తయారీ కేంద్రాన్ని నిర్మించడానికి 222 మిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఫ్యాక్టరీ చెన్నైలోని ‘మహీంద్రా వరల్డ్ సిటీ డెవలపర్స్ ఇండస్ట్రియల్ పార్కు’లో ఏర్పాటు కానుంది. ఇది ఏడాదికి 3 లక్షల యూనిట్ల రూమ్ ఎయిర్ ఎండిషనర్లు, 6.50 లక్షల యూనిట్ల కంప్రెషర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ఎయిర్ కండీషనర్ డిమాండ్ను తీర్చగలదని, అక్టోబర్ 2025 నాటికి కార్యకలాపాలు ప్రారంభించవచ్చని మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ప్రపంచ అగ్రగామిగా గుర్తింపు పొందిన మిత్సుబిషి ఎలక్ట్రిక్, చెన్నైలోని మహీంద్రా ఆరిజిన్స్లో 52 ఎకరాలలో ఈ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభంలో స్వల్ప క్షీణత.. ఆదాయం 11 శాతం జంప్
రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. నికర లాభం స్వల్పంగా క్షీణించగా.. ఆదాయం మాత్రం 11 శాతం పెరిగింది. -
రాణించిన సూచీలు.. 22,300 ఎగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రాణించాయి. సెన్సెక్స్ 560 పాయింట్లు, నిఫ్టీ 189 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్’ వ్యవస్థ ధరనూ కుదించిన టెస్లా
Tesla: ఇటీవలే చైనా, అమెరికా మార్కెట్లలో కార్ల ధరలను కుదించిన టెస్లా.. తాజాగా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థ ధరను సైతం తగ్గించింది. -
ఏఐకి డేటా కంటే విలువైనది ఇదే.. మార్క్ జుకర్బర్గ్ అంచనా!
Artificial intelligence: ఏఐకి డేటా కంటే విలువైనది మరొకటి ఉందని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. అదేంటి? ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..! -
జొమాటోలో ప్లాట్ఫామ్ ఫీజు పెంపు.. ‘ఇంటర్ సిటీ’ సేవలకు గుడ్బై
జొమాటో ఆహార పదార్థాల డెలివరీకి వసూలు చేసే ప్లాట్ఫామ్ ఫీజును రూ.5 పెంచింది. ఏప్రిల్ 20 నుంచే పెరిగిన ఫీజు అమల్లోకి వచ్చింది. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,252
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 340 పాయింట్లు లాభపడి 73,428 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 22,252 దగ్గర కొనసాగుతోంది. -
ఆరోగ్య బీమాకు వయోపరిమితి రద్దు
ఆరోగ్య బీమా రంగంలో విప్లవాత్మక మార్పులకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ శ్రీకారం చుట్టింది. ఆరోగ్య బీమా పాలసీ కొత్తగా కొనుగోలు చేసేందుకు, ఇప్పటివరకు ఉన్న 65 ఏళ్ల వయోపరిమితిని రద్దు చేసింది. -
అంచనాలు మించిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.7% పెరిగి రూ.19.58 లక్షల కోట్లకు చేరాయని పన్ను విభాగం ఆదివారం వెల్లడించింది. -
పశ్చిమాసియాపైనే కళ్లన్నీ
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య రేగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో సంభవించే మార్పుల ఆధారంగా మార్కెట్లు ఈవారం కదలాడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
73000 దిగువన బలహీనం!
ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ‘జూన్లో వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చన్న’ అంచనాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. -
సహజవాయువు డీలా!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.73,681 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. -
హర్మోజ్ జల సంధిని మూసేస్తే చమురు, ఎల్ఎన్జీ ధరలకు రెక్కలు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం వల్ల ముడిచమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, అంతర్జాతీయ వాణిజ్యంపైనా ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
అల్ట్రాటెక్ సిమెంట్ చేతికి ఇండియా సిమెంట్స్ గ్రైండింగ్ యూనిట్
ఇండియా సిమెంట్స్కు చెందిన 1.1 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యమున్న గ్రైండింగ్ యూనిట్ను రూ.315 కోట్లతో కొనుగోలు చేసినట్లు అల్ట్రాటెక్ సిమెంట్ ప్రకటించింది. -
నాట్కో ఫార్మా తెలంగాణ ప్లాంట్లో లోపాలు
తెలంగాణలోని కొత్తూర్లో ఉన్న నాట్కో ఫార్మా ప్లాంట్లో లోపాలను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ గుర్తించింది. -
యాపిల్ 5 లక్షల ఉద్యోగాలు!
వచ్చే మూడేళ్లలో భారత్లో వెండర్ల ద్వారా 5 లక్షలకు పైగా ఉద్యోగాలను ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానం తెలియదా? డెలాయిట్ హెచ్ఆర్ టిప్స్ ఇవే..
తెలియని విషయం గురించి ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగితే ఏం సమాధానం చెప్పాలోనని చాలా మంది తెగ గాబరా పడుతుంటారు. అలాంటి వారి కోసమే డెలాయిట్ హెచ్ఆర్ మూడు చిట్కాలు తెలిపారు. అవేంటంటే? -
చైనాలో మళ్లీ తగ్గిన టెస్లా కార్ల ధరలు.. కారణాలివే..!
Tesla: అమెరికాలో ఇటీవలే టెస్లా తమ కార్ల ధరలను తగ్గించింది. తాజాగా చైనాలోనూ కుదిస్తున్నట్లు ప్రకటించింది. ఎంత మేర తగ్గించింది? అందుకు కారణాలేంటో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
-
రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపండి: ఏపీ సీఎస్ ఆదేశం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!