మొబైల్ ఫోన్ కు బీమా తీసుకున్నారా?
ఫోన్ పోగొట్టుకున్న తర్వాత బాధపడటం కంటే సరైన విలువకు బీమా తీసుకోవడం ఉత్తమం. మార్కెట్ లో నిరంతరం కొత్త మోడళ్ల ఫోన్లు విడుదలవుతూనే ఉంటాయి.
ఫోన్ పోగొట్టుకున్న తర్వాత బాధపడటం కంటే సరైన విలువకు బీమా తీసుకోవడం ఉత్తమం. మార్కెట్ లో నిరంతరం కొత్త మోడళ్ల ఫోన్లు విడుదలవుతూనే ఉంటాయి. ఇప్పటికే మన దేశంలో ఫోన్లను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్త ఫ్యూచర్లతో ఫోన్లను కొనుగోలు చేసేందుకు వినియోగదార్లు ఆసక్తి చూపుతుంటారు. అధునాతనమైన సౌకర్యాలు కలిగిన ఈ ఫోన్ల ధరలు ఎక్కువగానే ఉంటాయి. ప్రమాదవశాత్తూ కిందపడటం, నీళ్లలోపడటం లాంటివి జరిగితే ఫోన్ పాక్షికంగా లేదా పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థిక నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్లకు బీమా చేసుకునే అంశాన్ని పరిశీలించొచ్చు. పలు రకాల సంస్థలు ఈ గాడ్జెట్ బీమా పథకాలను అందింస్తున్నాయి. స్మార్ట్ ఫోన్, ట్యాబ్ లాంటి గాడ్జెట్లకు బీమా చేసుకోవడం ద్వారా ప్రమాదవశాత్తు దెబ్బతిన్నా మరమ్మత్తు లేదా కొత్త ఫోను పొందే అవకాశం ఉంటుంది. ప్రముఖ మొబైల్ కంపెనీలు, మొబైల్ విక్రయ సంస్థలు బీమా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని మొబైల్ కొన్నప్పుడే బీమా సౌకర్యాన్నిఅందిస్తున్నాయి. అయితే పథకం తీసుకునేముందు బీమా వర్తించే సందర్భాలేవో, వర్తించని సందర్భాలేవో తెలుసుకోవాలి. బీమా సంస్థలు వివిధ రకాల పథకాలను అందుబాటులో ఉంచుతాయి.
సాధారణంగా బీమా వర్తించే సందర్భాలు: అగ్ని ప్రమాదాలు, అల్లర్లు, ఉగ్రదాడులు జరిగినప్పుడు, దొంగతనానికి గురైనప్పుడు, నీళ్లలో పడి పాడైనప్పుడు బీమా వర్తిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులకు బీమా వర్తించదని కంపెనీలు షరతులు పెడతాయి.
అనుమానాస్పద స్థితిలో మొబైల్ పోగొట్టుకున్నప్పుడు, దేశం వెలుపల మొబైల్ పోగొట్టుకున్నప్పుడు వర్తించదు. బీమా చేయించని వ్యక్తి వద్ద ఉన్నప్పుడు కాకుండా మరో వ్యక్తి ఉపయోగిస్తున్నప్పుడు ఫోన్ పాడైనా లేదా పోగొట్టుకున్నా సరే వర్తించదు. అధీకృత సంస్థల వద్ద కాకుండా వేరే ఎక్కడైనా మరమ్మతు చేయించినప్పుడు ఫోన్కు ఏదైనా అయితే బీమా వర్తించకపోవడం ఉంటుంది. బీమా కంపెనీ బట్టి పాలసీలో షరతులు, లక్షణాలు వేరుగా ఉంటాయి. కాబట్టి బీమా తీసుకునే ముందు ఆ బీమా పథకం షరతులను పూర్తిగా చదవాలి.
మొబైల్ కొన్న ఒకటి, రెండు రోజుల్లోపే బీమా తీసుకోవాలి. ఆన్లైన్ విధానంలో అయితే ఇంటర్నెట్ ద్వారా ప్రాథమిక సమాచారాన్ని పూరించాల్సి ఉంటుంది. తర్వాత బీమా కంపెనీలు మొబైల్ కొనుగోలు బిల్లు, వ్యక్తిగత గుర్తింపు పత్రం లాంటి వివరాలను పోస్ట్లో పంపాల్సిందిగా కోరతాయి. కొన్ని కంపెనీలు వాట్సప్లో డాక్యుమెంట్ల ఫోటోలు తీసి పంపేందుకు అవకాశమిస్తున్నాయి.
క్లెయిం చేయాలంటే మొబైల్ ఫోన్ పోయినట్లుగా గుర్తించిన వెంటనే 24 గంటల్లోగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు 48 గంటల్లోగా బీమా కంపెనీకి సమాచారం అందించాలి. క్లెయిం ఫారం, మొబైల్ కొనుగోలు బిల్లు, క్లెయిం వివరాలను తెలియజేసే పత్రం , మొబైల్ దొంగతనమైనట్లు స్థానిక పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు కాపీ దగ్గర ఉంచుకోవాలి. అదే ప్రమాదవశాత్తు పగిలిన వాటికి ఫోన్ స్క్రీన్ ఫోటోతో పాటు ఐఎమ్ఈఐ నంబరుతో కూడిన ఫోటోతో పాటుగా అధీకృత సేవా కేంద్రం అందించే అంచనా బిల్లు అవసమవుతాయి. క్లెయిం పొందేందుకు బీమా కంపెనీ సూచించిన విధంగా పాటించాలి.
దేశంలో రోజురోజుకూ స్మార్ట్ఫోన్ల విస్తృతి కారణంగా మొబైల్ ఇన్సూరెన్స్ చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఖరీదైన ఫోన్ పోగొట్టుకున్న తర్వాత బాధపడటం కంటే సరైన విలువకు బీమా తీసుకోవడం ఉత్తమం. ఎటువంటి ఆందోళన లేకుండా ఫోన్ను బ్లాక్ చేయించడంతో పాటు జరిగిన నష్టానికి క్లెయిం చేసుకోవడం మొబైల్ ఇన్స్యూరెన్స్ ద్వారా సాధ్యమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ