Modi: చలామణిలోకి కొత్త నాణేలు.. ప్రత్యేకత ఏంటంటే..?

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కొత్త నాణేల శ్రేణిని ఆవిష్కరించారు. వీటిని అంధులు కూడా సులభంగా గుర్తించేలా రూపొందించారు...

Published : 06 Jun 2022 17:11 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కొత్త నాణేల శ్రేణిని ఆవిష్కరించారు. అంధులు కూడా సులభంగా గుర్తించేలా వీటిని రూపొందించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని నిర్వహిస్తోన్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ (AKAM)’ లోగోను రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 మారకపు విలువ కలిగిన కొత్త నాణేలపై ముద్రించారు. ఇవి కేవలం స్మారక నాణేలు మాత్రమే కాదని.. త్వరలో చలామణిలోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ కొత్త నాణేలు దేశాభివృద్ధి కోసం పనిచేసేలా ప్రజల్లో స్ఫూర్తి నింపుతాయని మోదీ అన్నారు. 12 ప్రభుత్వ పథకాలతో అనుసంధానించిన ‘జన సమ్మర్థ్‌ పోర్టల్‌’ను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు.

అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థల్లో భారత బ్యాంకులు, కరెన్సీని భాగం చేయాల్సిన అవసరం ఉందని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అందుకోసం ఆర్థిక సంస్థలు మెరుగైన ఆర్థిక, కార్పొరేట్‌ పాలనాపద్ధతులను అనుసరించాలని సూచించారు. ఇప్పటికే భారత్‌ అనేక ఆర్థిక పరిష్కార వేదికలను ఆవిష్కరించిందన్నారు. వాటి వినియోగాన్ని పెంచడం కోసం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే వాటన్నింటినీ విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ను ప్రపంచం ఇప్పుడు ఒక పెద్ద వినియోగ మార్కెట్‌గానే కాకుండా అనేక సమస్యలకు పరిష్కార వేదికగా చూస్తోందని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని