Twitter: ట్విటర్లో మరిన్ని తొలగింపులు.. వేలంలో లోగో ప్రతిమకు రూ.81 లక్షలు
Twitter Layoffs: ఇప్పటికే ట్విటర్లో భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించిన ఎలాన్ మస్క్ ఇకపై కోతలు ఉండవని ఆరు వారాల క్రితం ప్రకటించారు. కానీ, ఆర్థిక కష్టాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో మరికొంత మందిని ఉద్యోగాల నుంచి తీసేయాలనుకుంటున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: మరింత మంది ఉద్యోగులను తొలగించేందుకు (Layoffs) ట్విటర్ (Twitter) సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ దాదాపు సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపిన విషయం తెలిసిందే. అప్పట్లో తొలగింపుల (Layoffs) ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇకపై ఎలాంటి ఉద్యోగుల కోతలు ఉండబోవని మస్క్ ప్రకటించారు. సరిగ్గా ఆరు వారాల తర్వాత మరింత మందిని తొలగించాలని (Layoffs) ఆయన ప్రణాళికలు రచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.
మరో 50 మందికి త్వరలోనే మస్క్ ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. ప్రొడక్ట్ విభాగంలో అధిక తొలగింపులు (Layoffs) ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యాలయాలను, అమెరికాలోని చిన్న చిన్న ఆఫీసులను సైతం మూసివేయాలని మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మరిన్ని ఉద్యోగాల కోతలు తప్పవు. రెండు వారాల క్రితమే వాణిజ్య ప్రకటనలు, ట్రస్ట్ అండ్ సేఫ్టీ, మానిటైజేషన్ విభాగాల నుంచి ఉద్యోగులను తొలగించారు. అలాగే సింగపూర్, ఆస్ట్రేలియాలోని కార్యాలయాల్లోనూ కొంతమంది సిబ్బందిని ఇంటికి పంపారు.
తాజా కోతలు కూడా అమల్లోకి వస్తే ట్విటర్ (Twitter) ఉద్యోగుల సంఖ్య 2,000 దిగువకు రానుంది. అంటే, 75 శాతం మందికి ఉద్వాసన పలికినట్లవుతుంది. ఇదే జరిగితే దశాబ్దం క్రితం కంపెనీ ఎంత చిన్నదిగా ఉందో.. తిరిగి ఆ స్థాయికి చేరుకుంటుంది. 2013లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ట్విటర్ (Twitter) తమ వద్ద 2,700 మంది ఉద్యోగులు ఉన్నట్లు అప్పట్లో వెల్లడించింది.
లోగో ప్రతిమకు రూ.81 లక్షలు..
మరోవైపు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఉన్న అన్ని మార్గాలను మస్క్ వాడుకుంటున్నారు. తాజాగా శాన్ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలోని వస్తువులను వేలానికి పెట్టారు. ట్విటర్ (Twitter) లోగో అయిన పక్షి ప్రతిమతోపాటు కాఫీ మెషిన్లు, ఫర్నీచర్, చివరకు కిచెన్ సామగ్రిని కూడా విక్రయానికి ఉంచారు. ఈ వేలాన్ని హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్ కంపెనీ నిర్వహించింది.
ఈ వేలంలో ట్విటర్ (Twitter) లోగో ప్రతిమకు అత్యధిక డబ్బు వచ్చినట్లు హెరిటేజ్ గ్లోబల్ వెల్లడించింది. నాలుగు అడుగుల ఈ ప్రతిమను 1,00,000 డాలర్లకు (దాదాపు రూ.81,25,000) ఒకరు సొంతం చేసుకున్నట్లు తెలిపింది. కొనుగోలు చేసినవారి వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. తర్వాత 10 అడుగుల నియాన్ ట్విటర్ (Twitter) బర్డ్ డిస్ప్లేకు వేలంలో 40,000 డాలర్లు (దాదాపు రూ. 32,18,240) లభించినట్లు తెలిపింది.
మరోవైపు బీర్లను స్టోర్ చేసుకునే మూడు కెగేటర్లు, ఫుడ్ డీహైడ్రేటర్, పిజ్జా ఓవెన్.. ఒక్కో దానికి 10,000 డాలర్లు (దాదాపు రూ.8,15,233) లభించినట్లు ఫోర్బ్స్ ఓ కథనంలో పేర్కొంది. ‘@’ (ఎట్దిరేట్) సింబల్ రూపంలో ఉన్న ప్లాంటర్కు 15,000 డాలర్లు (రూ. 12,21,990) లభించినట్లు సమాచారం. మరోవైపు ఓ కాన్ఫరెన్స్ రూం టేబుల్ 10,500 డాలర్ల (రూ. 8,55,393)కు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఫేస్మాస్క్లు, సౌండ్ప్రూఫ్ ఫోన్ బూత్లకు మరో 4,000 డాలర్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 631 రకాల వస్తువులను వేలానికి ఉంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది. -
సీపీ గుర్నానీ కంపెనీతో ఇంటర్గ్లోబ్ భాగస్వామ్యం
టెక్ దిగ్గజం సీపీ గుర్నానీకి చెందిన అసాగోతో, ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యం కుదుర్చుకుని, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార వెంచర్ ‘అలాన్ఓఎస్’ను ఏర్పాటు చేసింది. -
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ లాభం రూ.212 కోట్లు
కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.212.26 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది -
ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి అడుగులేస్తాం!
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి వ్యవహరిస్తామని, పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మధ్య స్థాయి ఐటీ సేవల కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ సందీప్ కల్రా వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు(8)
ఫోక్స్వ్యాగన్ తన స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్యూవీ) టైగన్లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది?
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్