ఫార్చ్యూన్‌ ఇండియా: శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్‌, నీతా అంబానీ

దేశంలోని 50 మంది శక్తిమంతమైన మహిళల జాబితాను ఫార్చ్యూన్‌ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అగ్రస్థానంలో

Updated : 01 Dec 2021 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని 50 మంది శక్తిమంతమైన మహిళల జాబితాను ఫార్చ్యూన్‌ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అగ్రస్థానంలో నిలిచారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ ద్వితీయ స్థానంలో నిలిచారు. డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌, బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్ మజూందర్‌ షా, భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకులు, జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్ల టాప్‌-5లో చోటు సంపాదించారు.

కొవిడ్‌ మహమ్మారి వంటి క్లిష్ట సమయంలో దేశ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ కీలకంగా వ్యవహరించారని ఫార్చ్యూన్‌ ఇండియా కొనియాడింది. లాక్‌డౌన్‌ సమయంలో ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఆత్మనిర్భర భారత్‌ ద్వారా ఎంఎస్‌ఎఈలకు చేయూత అందించడం, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వంటి చర్యలు ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టాయ తెలిపింది. కొవిడ్‌ కారణంగా దేశమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిన వేళ రిలయన్స్‌ ఫౌండేషన్ తనవంతు చేయూతనందించిందని ఫార్చ్యూన్‌ ఇండియా పేర్కొంది. కొవిడ్‌ ఆస్పత్రి, కొవిడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు, ఆక్సిజన్‌ సరఫరా, పీపీఈ కిట్స్‌, ఎన్‌-95 మాస్కుల తయారీ వంటి కార్యక్రమాలను ఫౌండేషన్‌ ద్వారా నీతా అంబానీ చేపట్టారని ఫార్య్చూన్‌ ఇండియా కొనియాడింది. కొవాగ్జిన్‌ తీసుకురావడంలో భారత్‌ బయోటెక్‌ జేఎండీ సేవలనూ ఫార్చ్యూన్‌ ఇండియా ప్రశంసించింది.

టాప్‌-10 జాబితా ఇదే...

1. నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

2. నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌

3. సౌమ్య స్వామినాథన్, డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్

4. కిరణ్ మజుందార్ షా, బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌

5. సుచిత్ర ఎల్లా, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ జేఎండీ

6. అరుంధతి భట్టాచార్య, సేల్స్‌ఫోర్స్ ఇండియా ఛైర్‌పర్సన్‌, సీఈవో

7. గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్‌ చీఫ్ ఎకనమిస్ట్

8. టెస్సీ థామస్, డీఆర్‌డీవో శాస్త్రవేత్త

9. రేఖా ఎం.మీనన్, యాక్సెంచర్‌ ఛైర్‌పర్సన్‌, సీనియర్‌ ఎండీ

10. రెడ్డి సిస్టర్స్‌ (సంగీత, సునీత, ప్రీత, శోభన, అపోలో హాస్పిటల్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని