MS Dhoni: ధోనీ మార్కెటింగ్‌ గిమ్మిక్‌..!

టీమ్‌ఇండియా మాజీ సారథి ఎం.ఎస్‌.ధోని ఎట్టకేలకు అభిమానుల ఉత్కంఠకు తెరదించారు....

Published : 26 Sep 2022 02:02 IST

దిల్లీ: టీమ్‌ఇండియా మాజీ సారథి ఎం.ఎస్‌.ధోని ఎట్టకేలకు అభిమానుల ఉత్కంఠకు తెరదించారు. ఆదివారం కీలక ప్రకటన చేయనున్నానని శనివారం ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఏం చెబుతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. భారత టీ 20 లీగ్‌ నుంచి కూడా తప్పుకుని పూర్తిస్థాయి రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తాడని సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ, వాటన్నింటికీ తెరదించుతూ.. అదంతా ఓ మార్కెటింగ్‌ గిమ్మిక్కుగా తేల్చాడు. ప్రముఖ బిస్కెట్‌ బ్రాండ్‌ ఓరియోకు సంబంధించిన ‘బ్రింగ్‌ బ్యాక్‌ 2011’ అనే ప్రమోషన్‌ను ప్రారంభించారు.

అయితే, ధోనీ ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ‘‘ఏదైతేనేం.. ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించలేదు. అది చాలు..’’ అంటూ కొందరు ఊపిరి  పీల్చుకుంటున్నారు. ఇంకొందరైతే ఒకడుగు ముందుకువేసి ‘‘2011లో ధోనీ ఆ బిస్కెట్‌ ప్రమోషన్‌ లాంఛ్‌ చేశారు. ఆ ఏడాది భారత్‌ ప్రపంచ కప్‌ గెలిచింది. ఇప్పుడు మళ్లీ ప్రకటన ప్రారంభించారు. కప్పు ఖాయం’’ అని సంతోషం వ్యక్తం చేశారు. మరికొందరేమో అభిమానుల భావోద్వేగాలతో ఆడుకోవద్దంటూ కామెంట్‌ చేస్తున్నారు. ‘‘మీకు సమాజంలో ఎంతో గౌరవం ఉంది.. డబ్బుల కోసం దాన్ని పోగొట్టుకోవద్దు’’ అని హితవు పలుకుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని