Mukesh Ambani: నమ్మిన బంటుకు ముకేశ్ అంబానీ ₹1,500 కోట్ల గిఫ్ట్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మరోసారి వార్తల్లో నిలిచారు. తన చిన్ననాటి స్నేహితుడు, కంపెనీలో తన కుడిభుజం అయిన ఓ సీనియర్ ఉద్యోగికి కళ్లు చెదిరే కానుక ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఏది చేసినా సంచలనమే. తాజాగా ఈయన తన కంపెనీలో కొన్ని దశాబ్దాల పాటు పనిచేస్తూ నమ్మిన బంటుగా ఉన్న ఓ ఉద్యోగికి కళ్లు చెదిరే కానుక ఇచ్చారు. ఏ ఖరీదైన వాచో.. లగ్జరీ కారో ఇచ్చి ఉంటారనుకుంటున్నారా..? అంతకు మించేనండోయ్..! ఏకంగా రూ.1500 కోట్ల విలువైన 22 అంతస్తుల భవంతిని బహుమతిగా ఇచ్చినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. అత్యంత ఖరీదైన ఆ కానుకను అందుకున్న ఆ ఉద్యోగి ఎవరంటే..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries)లో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న మనోజ్ మోదీకి (Manoj Modi) అంబానీ ఈ గిఫ్ట్ (Gift) ఇచ్చారు. రిలయన్స్ ఇతర కంపెనీలతో చేసుకున్న వందల కోట్ల ఒప్పందాల్లో మనోజ్ అత్యంత కీలక పాత్ర పోషించాడు. వ్యాపార వర్గాల్లో ఈయనను ముకేశ్ అంబానీ కుడి భుజంగా పేర్కొంటారు. ప్రస్తుతం రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. కొన్ని దశాబ్దాల పాటు కంపెనీకి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా అంబానీ (Mukesh Ambani) కొన్ని నెలల క్రితం ఈ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అంబానీ డ్రైవర్ జీతం.. తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!
మనోజ్ (Manoj Modi)కు కానుకగా ఇచ్చిన ఈ 22 అంతస్తుల భవంతి ముంబయిలోని నేపియన్ సీ రోడ్డు ప్రాంతంలో ఉంది. ‘బృందావన్’ పేరుతో మొత్తం 1.7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. ఇందులో ఒక్కో అంతస్తు 8వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. పార్కింగ్ కోసమే 7 అంతస్తులను నిర్మించారు. ఇందులో కొన్ని అంతస్తుల్లో మనోజ్ మోదీ కుటుంబంతో నివసించనుండగా.. మరికొన్నింట్లో ఆయన ఇద్దరు కుమార్తెలు తమ అత్తింటి కుటుంబాలతో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులోని కొంత ఫర్నిచర్ను ఇటలీ నుంచి తెప్పించారట. మార్కెట్ వర్గాల ప్రకారం, ఈ ప్రాంతంలో చదరపు అడుగు ధర రూ.45,100 నుంచి రూ.70,600 వరకు పలుకుతోంది. దీన్ని బట్టి చూస్తే ఈ 22 అంతస్తుల భవంతి ధర రూ.1500కోట్ల వరకు ఉంటుందట.
చిన్ననాటి స్నేహితుడే..
మనోజ్ మోదీ.. ముకేశ్ అంబానీ (Mukesh Ambani)కి చిన్ననాటి స్నేహితుడు. ముంబయిలోని యూనివర్శిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నప్పుడే 1980ల్లో మనోజ్ మోదీ సంస్థలో ఉద్యోగిగా చేరారు. 2020లో ఫేస్బుక్తో కుదిరిన రూ.43వేల కోట్ల డీల్ సహా అనేక భారీ ఒప్పందాలను ఈయనే మధ్యవర్తిగా ఉండి ఖరారు చేయించినట్లు వ్యాపార వర్గాల సమాచారం. మనోజ్ తండ్రి హరిజీవన్దాస్ కూడా ధీరూభాయ్తో కలిసి పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ మార్గాల్లో జాగ్రత్త
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా, నష్టభయాలను సొంతంగా మదింపు చేసుకుని అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలని దేశీయ విమానయాన సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది. -
2024లో వృద్ధి రేటు 6.8%
ప్రస్తుత సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పెంచింది. -
రూ.లక్ష కోట్లకు పైగా ఐఫోన్ ఎగుమతులు
మన దేశం నుంచి యాపిల్ ఐఫోన్ల ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2022-23లో 6.27 బిలియన్ డాలర్ల (సుమారు రూ.52000 కోట్ల) విలువైన ఐఫోన్లు ఎగుమతి కాగా, 2023-24లో ఈ మొత్తం రెట్టింపై 12.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1,00,430 కోట్ల) విలువైనవి ఎగుమతి అయ్యాయి. -
ఈ కంపెనీల్లో పనిచేయడం ఇష్టం
మన దేశంలో పనిచేయడానికి అనువైన కంపెనీల్లో అగ్రస్థానాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) దక్కించుకుంది. -
3 రోజుల్లో రూ.7.93 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఐటీ షేర్లకు భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో మూడో రోజూ సూచీలు నష్టపోయాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగానే ఉన్నాయి. -
ఫండ్లలోకి 35% పెరిగిన పెట్టుబడులు
ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా రాణించడానికి తోడు చిన్న మదుపరుల భాగస్వామ్యం అధికంగా ఉండడంతో.. మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ గత ఆర్థిక సంవత్సరం రూ.14 లక్షల కోట్లు పెరిగి (35% వృద్ధి) రూ.53.40 లక్షల కోట్లకు చేరింది. -
‘ఎక్స్’ నూతన వినియోగదార్లు పోస్ట్, లైక్కు రుసుము చెల్లించాలి
ఎక్స్ (గతంలో ట్విటర్) ఫ్లాట్ఫామ్పై కొత్తగా నమోదయ్యే వినియోగదార్లు ఇకపై లైక్, పోస్ట్, బుక్మార్క్, రిప్లయ్ కోసం తక్కువ మొత్తంలో వార్షిక రుసుము చెల్లించాల్సి రావొచ్చని కంపెనీ తెలిపింది. -
పెద్ద ఆర్డర్ల డెలివరీకి జొమాటో ప్రత్యేక వాహనం
50 మంది వరకు స్నేహితులు/ కుటుంబ సభ్యులు/ సహోద్యోగులతో జరుపుకునే వేడుకలు, ఫంక్షన్లు, కార్యక్రమాల కోసం ఆహార పదార్థాలను డెలివరీ చేస్తామని జొమాటో తెలిపింది. -
రెండేళ్లలో రూ.1000 కోట్ల విక్రయాలు!
ఆధునిక సాంకేతికతతో పరుపులను తయారు చేస్తున్న ద స్లీప్ కంపెనీ, రానున్న రెండేళ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంతో ఉంది. -
రైతులకు నేరుగా రుణాలు ఇవ్వం: నాబార్డ్
తాము రైతులకు నేరుగా రుణాలు అందించబోమని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) మంగళవారం స్పష్టం చేసింది. -
‘కంటెక్చువల్ డిస్కవరీ టెక్నాలజీ’కి భారత పేటెంట్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కీపాయింట్ టెక్నాలజీస్ ఆవిష్కరించిన ‘కంటెక్చువల్ డిస్కవరీ టెక్నాలజీ’కి ఇండియా పేటెంట్ ఆఫీస్ (ఐపీఓ) పేటెంట్ మంజూరు చేసింది. -
ఫ్లిప్కార్ట్ వేసవి విక్రయాలు నేటి నుంచి
ఫ్లిప్కార్ట్ వార్షిక వేసవి విక్రయాలు ఈనెల 17న ప్రారంభమై 23 వరకు కొనసాగనున్నాయి. ఈ విక్రయాల్లో ఏసీలు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు లాంటి గృహోపకరణాలను ఆకర్షణీయ ధరల్లో వినియోగదార్లు పొందొచ్చని సంస్థ పేర్కొంది. -
సోనీతో విలీనానికి ఎన్సీఎల్టీ వద్ద దరఖాస్తు ఉపసంహరణ: జీ
సోనీ కంపెనీతో విలీనాన్ని అమలు చేయాలని కోరుతూ జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) వద్ద దాఖలు చేసిన దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జెడ్ఈఈఎల్) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్, తన శీతల పానీయాలను.. ప్యాకేజింగ్ టెక్నాలజీ సంస్థ ఎస్ఐజీ అందించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, ఎసెప్టిక్ కార్టన్ ప్యాక్లలో అందుబాటులోకి తెచ్చింది. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది.