Mukesh Ambani: వారసులకు ముకేశ్ అంబానీ ఇచ్చిన టార్గెట్లు ఇవే..!
తన వారసులకు వ్యాపార బాధ్యతలను అప్పగించిన ముకేశ్ అంబానీ.. తాజాగా ఆయా రంగాల్లోని లక్ష్యాలు, అవకాశాలను వారికి గుర్తుచేశారు.
దిల్లీ: దేశవ్యాప్తంగా 2023 చివరినాటికి జియో 5జీ నెట్వర్క్ను విస్తరించనున్నట్లు రిలయన్స్ (Reliance) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తెలిపారు. అలాగే రిటైల్ రంగంలో వస్తున్న అవకాశాల్ని అందింపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛ ఇంధన రంగంలోనూ గణనీయ పురోగతి సాధించాలని నిర్దేశించుకున్నారు. ఇలా ముకేశ్ (Mukesh Ambani) తన ముగ్గురు వారసులకు లక్ష్యాలను నిర్దేశించారు. ధీరూభాయ్ జయంతి సందర్భంగా బుధవారం జరిగిన ‘రిలయన్స్ ఫ్యామిలీ డే’లో ముకేశ్ (Mukesh Ambani) ఈ వ్యాఖ్యలు చేశారు.
‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ సమగ్ర స్వీయ-పరివర్తన ప్రయాణం ప్రారంభమైందని ముకేశ్ అన్నారు. 2021లో జరిగిన ‘ఫ్యామిలీ డే’లో ముకేశ్ తొలిసారి తన వారసత్వ ప్రణాళిక గురించి ప్రస్తావించారు. తన వ్యాపారాన్ని మూడు భాగాలుగా గుర్తించి.. టెలికాం, డిజిటల్ను పెద్ద కొడుకు ఆకాశ్కు; రిటైల్ను కూతురు ఈశాకు; స్వచ్ఛ ఇంధన వ్యాపారాన్ని చిన్న కొడుకు అనంత్కు అప్పగించిన విషయం తెలిసిందే. తాజా ఫ్యామిలీ డే సందర్భంగా ఈ మూడు విభాగాల్లో సాధించాల్సిన లక్ష్యాలను ముకేశ్ తన వారసుల ముందుంచారు.
‘‘సంవత్సరాలు వెళ్లిపోతాయి. దశాబ్దాలు గడిచిపోతాయి. మర్రి చెట్టు లాగా రిలయన్స్ ఇంకా పెరిగి పెద్దదవుతూనే ఉంటుంది. దాని కొమ్మలు విశాలంగా విస్తరిస్తాయి. వేర్లు మరింత లోతుకు వెళ్తాయి. నానాటికీ పెరుగుతున్న భారతీయుల జీవితాలను స్పృశిస్తూ, సుసంపన్నం చేస్తూ రిలయన్స్ వారిని మరింత శక్తిమంతంగా మారుస్తుంది’’ అని ముకేశ్ అన్నారు. వచ్చే ఐదేళ్లలో రిలయన్స్ 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోనుందని గుర్తుచేశారు.
ఆకాశ్కు గొప్ప అవకాశం..
‘‘ఆకాశ్ నేతృత్వంలో జియో ప్రపంచంలోని అత్యుత్తమ 5G నెట్వర్క్ను భారతదేశం అంతటా విస్తరిస్తోంది. ఈ కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేనంత వేగంగా అమలవుతోంది. 2023లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే, భారత్లో రాబోతున్న మరో అతిపెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి జియో ప్లాట్ఫామ్స్ సిద్ధం కావాల్సి ఉంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ప్రత్యేకమైన డిజిటల్ ఉత్పత్తులు, పరిష్కారాలను అందించాల్సిన అవసరం ఉంది’’ అని టెలికాం, డిజిటల్ విభాగం సాధించాల్సిన లక్ష్యాలను ముకేశ్ నిర్దేశించారు. దేశంలో ప్రతి గ్రామం 5జీ నెట్వర్క్తో అనుసంధానం కానుంనదని పేర్కొన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఆర్థిక సేవల్ని అందించాలన్నారు. తద్వారా పట్టణ- గ్రామీణ ప్రాంతాల మధ్యనున్న అంతరాన్ని తగ్గించడానికి ఇదే గొప్ప అవకాశం అన్నారు. ఈ రకంగా భారత్ సమగ్రాభివృద్ధిని మరింత వేగంగా సాధించడంలో జియో భాగమయ్యే అవకాశం ఉందన్నారు.
ఈశా టార్గెట్ ఇదే..
మరోవైపు ఈశా నేతృత్వంలో రిటైల్ బిజినెస్ దేశవ్యాప్తంగా తన ఉనికిని చాటుకుంటోందన్నారు. ఈ రంగంలో ఉన్న మరిన్ని అవకాశాల్ని అందిపుచ్చుకోగల సామర్థ్యం, సమర్థత రిలయన్స్ రిటైల్ బృందానికి ఉందని చెప్పారు. జియో తరహాలోనే రిటైల్ వ్యాపార వృద్ధి సైతం భారతదేశ సమగ్ర అభివృద్ధిపై ప్రభావాన్ని చూపుతుందన్నారు. మరిన్ని ఉద్యోగాలను సృష్టించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, సూక్ష్మ చిన్న పరిశ్రమల ఉత్పాదకతను పెంచడం సహా వ్యాపారులను సుభిక్షంగా మార్చగలదన్నారు.
అనంత్కు ‘హరిత’ లక్ష్యం..
పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం గిగా ఫ్యాక్టరీలను నిర్మించడంతోపాటు హైడ్రోజన్ వ్యాపారంలోకి ప్రవేశించడం వరకు విస్తరించిన ‘కొత్త ఇంధన’ వ్యాపారానికి.. రిలయన్స్ రూపురేఖలనే మార్చగల సామర్థ్యం ఉందని ముకేశ్ అన్నారు. అనంత్ నేతృత్వంలోని ఈ కొత్త తరం వ్యాపారం.. జామ్నగర్ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుతో వేగంగా విస్తరించనుదన్నారు. భారత్లో అతిపెద్ద, అత్యంత విలువైన కంపెనీగా ఉన్న రిలయన్స్.. రానున్న రోజుల్లో ‘గ్రీనెస్ట్ కార్పొరేట్’గా అవతరించే దిశగా దూసుకెళ్తోంద్నారు. భారత్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను అందుకోవడం, స్వయం సమృద్ధిని సాధించేలా చూడడమే రిలయన్స్ న్యూ ఎనర్జీ బినిసెస్ ముందున్న స్పష్టమైన లక్ష్యమని తెలిపారు. చురుగ్గా ఉంటూ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటేనే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
టీమ్వర్క్, నాయకత్వంతోనే వ్యాపారంలో విజయం సాధ్యమవుతుందని అంబానీ అన్నారు. అందుకు ఇటీవల అర్జెంటీనా ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలిచిన ఉదంతాన్ని ప్రస్తావించారు. జట్టు సహకారం లేకపోతే మెస్సి ఒక్కడే కప్ను గెలవడం సాధ్యమయ్యేది కాదన్నారు. అలాగే మెస్సి స్ఫూర్తిమంతమైన నాయకత్వం లేకుండా అర్జెంటీనాకు విజయం అంత సులభమై ఉండేది కాదన్నారు. తొలి మ్యాచ్లో తడబడినా.. విజయాన్ని ముద్దాడే వరకు అర్జెంటీనా పోరాటం ఆపలేదన్నారు. చివరి పెనాల్టీ షాట్ వరకు వారి దృష్టంతా విజయంపైనే ఉందని కొనియాడారు. రిలయన్స్ను సైతం ధీరూభాయ్ అంబానీ అదే తరహాలో నిర్మించారని తెలిపారు. తన తండ్రితో పాటు స్వామి వివేకానంద కూడా తనలో ఎంతో స్ఫూర్తి నింపారని ముకేశ్ తెలిపారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. నిరంతరం దానికోసమే తపించాలన్న స్వామీజీ మాటల్ని గుర్తుచేశారు. అందరూ దీన్ని పాటించాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ