మేనేజర్లు ఇంటికి.. వాళ్లు ఎంపిక చేసిన వారు ఆ స్థానంలోకి.. అట్లుంటది మరి మస్క్తోని!
ట్విటర్(Twitter)లో మేనేజర్ స్థాయి ఉద్యోగుల తీసివేతకు సంబంధించి మస్క్ (Elon Musk) అనుసరించిన విధానంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం.. మస్క్తో పని అంత ఈజీ కాదని కామెంట్ చేస్తున్నారు.
కాలిఫోర్నియా: ట్విటర్ (Twitter) సీఈవోగా ఎలాన్ మస్క్(Elon MUsk) తీసుకుంటున్న నిర్ణయాలు సంస్థ ఉద్యోగులతోపాటు, మార్కెట్ వర్గాలను సైతం షాక్కు గురిచేస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపు నుంచి ట్విటర్ సబ్స్క్రిప్షన్ వరకు ప్రతిదీ సంచలనమే. కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
గతేడాది నవంబరులో ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సంస్థలో మేనేజర్ స్థాయి ఉద్యోగుల తీసివేతకు సంబంధించి మస్క్ అనుసరించిన విధానం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి తెలిసి కొందరు మస్క్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. అంతే మరి మస్క్తో పని అంత ఈజీ కాదని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
గతేడాది నవంబరులో ట్విటర్ను మస్క్ కొనుగోలు చేసిన తర్వాత సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్వో నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్, లీగల్ పాలసీ విభాగాధిపతి విజయ గద్దెతోపాటు సుమారు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. ఆ తర్వాత ట్విటర్ ఉద్యోగాల్లో కోత విధించబోమంటూ చెప్పిన ఎలాన్ మస్క్.. అప్పటి నుంచి గత నెల చివరి వారం వరకు మూడు విడతలుగా ఉద్యోగాల్లో కోత విధించారు.
గత నెల చివర్లో తొలగించిన మేనేజర్లతో ప్రమోషన్ల కోసం ప్రతి టీమ్ నుంచి ఉత్తమ ఉద్యోగిని ఎంపిక చేయాలని మస్క్ చెప్పారట. తర్వాత మేనేజర్లను తొలగించి వారి స్థానంలో ఉత్తమ ఉద్యోగులగా ఎంపికైన వారికి మేనేజర్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అలా సుమారు 50 మందిని మస్క్ తొలగించారట. మేనేజర్ స్థాయిలో ఉండి వారు అందుకుంటున్న జీతం ఎక్కువగా ఉండటంతో.. కంపెనీపై ఆర్థికపరమైన భారం తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారితో చెప్పారని పలువురు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తగా మేనేజర్ బాధ్యతలు అందుకున్న వారు తక్కువ జీతానికి పనిచేసేందుకు అంగీకరించినట్లు మస్క్ వారితో చెప్పినట్లు తెలిపారు. ఇలా తొలగించిన వారిలో ఎస్తేర్ క్రాఫోర్డ్ కూడా ఒకరు. ట్విటర్లో తొలిసారి ఉద్యోగాల కోత సమయంలో.. పనిచేసే ప్రదేశాన్ని ప్రేమించాలంటూ ఆఫీసులో నేలపైనే పడుకున్న ఈమె ఫొటో అప్పట్లో బాగా పాపులర్ అయింది. మరోవైపు ట్విటర్ ఆదాయాన్ని పెంచేందుకు మస్క్ ట్విటర్ బ్లూ (Twitter Blue) సబ్స్క్రైబర్లను పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సబ్స్క్రిప్షన్ రెవెన్యూ లేకుండా ట్విటర్ను కొనసాగించడం సాధ్యం కాదని, ఉద్యోగులతో జరిగిన సమావేశంలో మస్క్ పేర్కొన్నారట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా