Twitter: అయ్యో.. తప్పు దొర్లింది.. తిరిగి ఆఫీసుకి రండి!
Twitter: ట్విటర్లో ఇటీవల ఎలాన్ మస్క్ చాలా మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. అయితే, వీరిలో కొంతమందిని పొరపాటున తొలగించినట్లు తర్వాత గుర్తించారట. వారిని తిరిగి ఆఫీసుకు రమ్మని తాజాగా సందేశం పంపుతున్నట్లు తెలుస్తోంది.
శాన్ఫ్రాన్సిస్కో: తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందిని తిరిగి ఆఫీసుకు రమ్మంటూ ట్విటర్ (Twitter) సందేశాలు పంపిస్తోందట! జాబితాలో కొన్ని తప్పులు దొర్లాయని దీంతో పొరపాటున కొంతమందిని ఇంటికి పంపించాల్సి వచ్చిందని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు బ్లూమ్బెర్గ్ పేర్కొంది. అలాగే మరికొంత మంది నైపుణ్యాన్ని, అనుభవాన్ని గుర్తించడంలోనూ విఫలమైనట్లు ట్విటర్ (Twitter) భావిస్తున్నట్లు సదరు వ్యక్తులు తెలిపారు.
ట్విటర్ (Twitter)లో మస్క్ (Elon Musk) లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం తొలగించిన ఉద్యోగుల్లో కొంతమంది సేవలు తప్పనిసరని సంస్థ భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. అందుకే వారిని తిరిగి ఆఫీసుకు రావాలని కోరిందట. దీనిపై ట్విటర్ (Twitter) యాజమాన్యంగానీ, అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk)గానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
ట్విటర్ను 44 బి.డాలర్లతో కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ (Elon Musk).. కంపెనీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ కోతలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సగానికి పైగా ఉద్యోగుల్ని తొలగిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. కంపెనీకి ఒక రోజులో మిలియన్ డాలర్ల కొద్దీ నష్టాలు వస్తున్నప్పుడు.. ఉద్యోగులను తొలగించడం మినహా తమకు వేరే దారి లేదని మస్క్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇంటికి పంపించేసిన ఉద్యోగులందరికీ మూడు నెలల వేతన పరిహారాన్ని ఇస్తున్నామన్నారు.
నకిలీ ఖాతాల మాటేంటి?
ట్విటర్లో నకిలీ ఖాతాల సంఖ్య ఎక్కువనే కారణం చెప్పి కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుంటున్నట్లు ఎలాన్ మస్క్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ట్విటర్ ఆయన సొంతమైంది. ఇటీవల ఏకంగా ఆయన పేరిటే చాలా నకిలీ ఖాతాలు పుట్టుకొచ్చాయి. దీంతో మరి వాటి సంగతేంటని చాలా మంది యూజర్లు ట్విటర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీనిపై మస్క్ తమ విధానాన్ని ప్రకటించారు.
ఎలాంటి హెచ్చరిక కూడా జారీ చేయకుండానే నకిలీ ఖాతాల్ని శాశ్వతంగా రద్దు చేస్తామని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. అయితే, నకిలీ ఖాతా అని సూచించేలా ప్రత్యేకంగా ‘పేరడీ’ అని పేర్కొన్న ఖాతాల్ని మాత్రం వదిలేస్తామని తెలిపారు. నకిలీ ఖాతాలకు సైతం బ్లూ టిక్ ఉండడంపై స్పందిస్తూ.. ఇప్పటి నుంచి పక్కా వెరిఫికేషన్ తర్వాతే బ్లూ చెక్ మార్క్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ట్విటర్ బ్లూ కింద ఈ సేవల్ని అందించనున్న విషయాన్ని గుర్తుచేశారు. దీనికి నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్ బ్లూకి లాగిన్ కావాలంటే కచ్చితంగా బ్లూ టిక్ అవసరమని.. అది పక్కా వెరిఫికేషన్ తర్వాతే ఇస్తామని వివరించారు. ఫలితంగా నకిలీ ఖాతాలకు బ్లూ చెక్ మార్క్ ఉండే అవకాశం లేదని పరోక్షంగా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)