Twitter: అందుకే 5వారాలు దానిపైనే పిచ్చోడిలా పనిచేశా: ఎలాన్ మస్క్
ట్విటర్ ఆర్థిక పరిస్థితి వచ్చే ఏడాది కల్లా గాడిన పడుతుందని ఎలాన్ మస్క్ అన్నారు. దానికి తాను తీసుకుంటున్న చర్యలే దోహదం చేస్తాయని వివరించారు.
శాన్ఫ్రాన్సిస్కో: ట్విటర్ (Twitter) ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు తాను తీసుకుంటున్న చర్యలు ఫలితాలిస్తున్నాయని ఎలాన్ మస్క్ (Elon Musk) అన్నారు. వచ్చే ఏడాది కల్లా కంపెనీ ఆర్థికంగా గాడినపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. వ్యయ నియంత్రణ కోసం తాను చేపట్టిన చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. బుధవారం ట్విటర్ (Twitter) యూజర్లతో జరిపిన చిట్చాట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉద్యోగుల తొలగింపు సహా ఇతర కఠిన నిర్ణయాలను మస్క్ ఈ సందర్భంగా సమర్థించుకున్నారు. ఆ చర్యలే తీసుకోకపోయి ఉంటే ఏటా ట్విటర్ మూడు బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదన్నారు. అందుకే గత ఐదు వారాలుగా ఖర్చులు తగ్గించడంపైనే పిచ్చోడిలా గడిపానని పేర్కొన్నారు. ట్విటర్ పరిస్థితి గతి తప్పి నేలకూలుతున్న విమానం వలే ఉండేదని వ్యాఖ్యానించారు. వ్యయాలను నియంత్రించడం, సబ్స్క్రైబర్ల ఆదాయాన్ని పెంచుకోవాలనే వ్యూహంతోనే ముందుకెళ్లినట్లు వివరించారు.
ప్రకటనదారులు ట్విటర్పై ఖర్చు చేయడానికి వెనకాడుతున్న విషయం తనకు స్పష్టంగా అర్థమైందని మస్క్ అన్నారు. అయితే, వారి ఆందోళనలకు కంటెంట్ పరమైన మార్పులు చేయడం కాదని తెలిపారు. కేవలం కంపెనీ ఆర్థిక పరిస్థితి ఏమైపోతోందననే వారు ఆందోళన చెందినట్లు పేర్కొన్నారు. నెలకు ఎనిమిది డాలర్లతో తీసుకొచ్చిన ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ కచ్చితంగా ఫలితాన్నిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. లేదంటే బిల్లుల్ని చెల్లించడం కష్టమైపోయేదన్నారు. హార్డ్వేర్ కోసమే ట్విటర్ ఏటా 1.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోందన్నారు.
అక్టోబరులో ట్విటర్ను తన చేతుల్లోకి తీసుకున్న ఎలాన్ మస్క్.. అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముందుగా వ్యయ నియంత్రణలో భాగంగా భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించారు. ట్విటర్ బ్లూ సేవలకు ఛార్జీ వసూలు చేయడం ప్రారంభించారు. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి వెరిఫికేషన్ బ్యాడ్జితో పాటు ప్రత్యేక సేవల్ని అందిస్తున్నారు. మరోవైపు ట్విటర్లో నైతిక అంశాలను పర్యవేక్షించే ‘సేఫ్టీ కౌన్సిల్’ అనే స్వతంత్ర వ్యవస్థను పూర్తిగా తొలగించారు. అధికారిక ఖాతాల గుర్తింపు కోసం మూడు రకాల వెరిఫికేషన్ బ్యాడ్జిలను తీసుకొచ్చారు. ప్రభుత్వ సంస్థలకు గ్రే, కంపెనీలకు గోల్డ్, వ్యక్తులకు బ్లూ టిక్లను ఇస్తున్నారు.
సరైన వ్యక్తి దొరికితే, వెంటనే ట్విటర్ సీఈఓ బాధ్యతల నుంచి తాను వైదొలుగుతానని ఎలాన్ మస్క్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ట్విటర్ సీఈఓగా కొనసాగనా? వద్దా?’ అంటూ ఆయనే ట్విటర్లో ఓ పోల్ నిర్వహించగా, ఓటు వేసిన వారిలో 57.5 శాతం మంది మస్క్ ఆ బాధ్యతల నుంచి వైదొలగాలని కోరారు. ఆ ఫలితాన్ని గౌరవిస్తానని చెప్పిన మస్క్, తాజాగా ఇలా ప్రకటించారు. ఆ తర్వాత నుంచి కేవలం ట్విటర్ సాఫ్ట్వేర్, సర్వర్ బృందాలను పర్యవేక్షించే బాధ్యతలకు పరిమితం అవుతానని ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా