Twitter: 62,000 ట్విటర్ ఖాతాల పునరుద్ధరణకు మస్క్ శ్రీకారం!
Twitter: ట్విటర్లో మస్క్ తాజాగా చేపట్టిన మరో కార్యక్రమం మరింత గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో నిషేధించిన దాదాపు 62 వేల ఖాతాలను పునరుద్ధరించాలని మస్క్ ఆదేశించారు. సిబ్బంది కొరత వల్ల ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని సమాచారం.
శాన్ఫ్రాన్సిస్కో: గతంలో నిషేధించిన ట్విటర్ ఖాతాల పునరుద్ధరణకు మస్క్ శ్రీకారం చుట్టారు. దాదాపు 62 వేల ఖాతాలను ఆయన తిరిగి క్రియాశీలకంగా మార్చనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే, కనీసం 10 వేల ఫాలోయర్లు ఉన్న ఖాతాలను మాత్రమే పునరుద్ధరిస్తున్నారని సమాచారం. వీటిలో ఒక ఖాతాకు 5 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారని తెలుస్తోంది. అలాగే 75 శాతం ఖాతాలకు 1 మిలియన్ కంటే ఎక్కువ ఫాలోయర్లు ఉన్నారట. ఇంత భారీ సంఖ్యలో ఖాతాలను పునరుద్ధరిస్తున్న ఈ ప్రక్రియను ట్విటర్ ఉద్యోగులు ‘బిగ్బ్యాంగ్’గా వ్యవహరిస్తున్నారని సమాచారం.
అయితే, ఈ పునరుద్ధరణ కార్యక్రమంతో ట్విటర్లో మరింత గందరగోళం తలెత్తే అవకాశం ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మస్క్ భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఖాతాలను యాక్టివేట్ చేయడానికి చాలా మంది సిబ్బంది అవసరమవుతారని తెలుస్తోంది. యాక్టివేట్ చేయబోయే ఖాతాలు, వాటిని ఫాలో అవుతున్న ఖాతాలు.. ఇలా అన్నింటిలో సమాచారాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుందని ఉద్యోగులు తెలిపారు. ఉదాహరణకు ఇటీవల ట్రంప్ ఖాతాను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఆయనకు దాదాపు 88 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. అలాంటప్పుడు 88 మిలియన్ల లిస్ట్లను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుందని టెక్ నిపుణులు తెలిపారు. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియన అని.. దీనికి పెద్దఎత్తున మానవ వనరులు అవసరమని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ట్విటర్లో నిషేధానికి గురైన ఖాతాలకు క్షమాభిక్ష మంజూరు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన ఓటింగ్ నిర్వహించగా.. ఎక్కువ మంది ఖాతాల్ని పునరుద్ధరించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి అనుగుణంగానే తాను ఖాతాల్ని తిరిగి యాక్టివేట్ చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఖాతాల పునరుద్ధరణపై ప్రకటనదారులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ట్విటర్కు ముప్పు ఉన్న ఖాతాలనే గతంలో తొలగించారని గుర్తుచేస్తున్నారు. తిరిగి వారిని ఆహ్వానించడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. పైగా ప్రకటనలు సైతం నిలిపివేసేందుకు సిద్ధపడుతున్నారు. ఏటా దాదాపు 100 మిలియన్ డాలర్ల ప్రకటనలు ఇచ్చే యాపిల్ సైతం ట్విటర్కు దూరం జరిగినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.