Elon Musk: మస్క్ అలిగాడు.. మార్పులు చేశారు..ట్వీట్లకు ఎంగేజ్మెంట్ వచ్చింది..
Elon Musk: బైడెన్ చేసిన ట్వీట్ కంటే తన ట్వీట్కు తక్కువ ఆదరణ రావడాన్ని మస్క్ జీర్ణించుకోలేపోయారట! వెంటనే తన ట్వీట్లకు ఎక్కువ ఎంగేజ్మెంట్లు వచ్చేలా మార్పులు చేయించారని సమాచారం.
శాన్ఫ్రాన్సిస్కో: తన ట్వీట్లకు పెద్దగా ఆదరణ దక్కడం లేదని ట్విటర్ (Twitter) అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk) గుర్రుగా ఉన్నారట! ఈ మేరకు తన ట్వీట్లకు ప్రాధాన్యం దక్కేలా ఏకంగా కోడింగ్, ఆల్గరిథమ్లో మార్పు చేయాలని ట్విటర్ (Twitter) ఇంజినీర్లను కోరారని కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ ‘ప్లాట్ఫార్మర్’ వెబ్సైట్ పేర్కొంది.
అసలేం జరిగిందంటే..
ఆదివారం ఫిలడెల్ఫియా ఈగిల్స్, కాన్సాస్ సిటీ చీఫ్స్ ఫుట్బాల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మస్క్ (Elon Musk) ఈగిల్స్ను సపోర్ట్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ (Biden) సైతం ఈగిల్స్ జట్టుకే మద్దతు పలుకుతూ ట్వీట్ చేశారు. మస్క్ (Elon Musk) ట్వీట్కు 90 లక్షల ఎంగేజ్మెంట్లు రాగా.. బైడెన్ (Biden) ట్వీట్కు ఏకంగా 2.90 కోట్ల ఎంగేజ్మెంట్లు వచ్చాయి. దీన్ని మస్క్ (Elon Musk) జీర్ణించుకోలేకపోయారట!
ఏం చేశారంటే..
వెంటనే శాన్ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఇంజినీర్లతో మస్క్ మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ ప్లాట్ఫార్మర్ తెలిపింది. తన ట్వీట్లకు ఎక్కువ ఎంగేజ్మెంట్లు వచ్చేలా వెంటనే మార్పులు చేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. లేదంటే ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని హెచ్చరించారట! దీంతో ఎలాన్ మస్క్కు వరుసకు సోదరుడైన జేమ్స్ మస్క్ ఆదివారం- సోమవారం మధ్యరాత్రి 2:36 గంటలకు ఇంజినీర్లను అలర్ట్ చేశారని ప్లాట్ఫార్మర్ తెలిపింది. వెంటనే మస్క్ ట్వీట్లకు తక్కువ ఎంగేజ్మెంట్ రావడమనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారని సమాచారం.
చివరకు ఎలాన్ మస్క్ ట్వీట్లకు అందరి కంటే ఎక్కువ ఎంగేజ్మెంట్ వచ్చేలా సోమవారం మధ్యాహ్నానికి కోడింగ్, ఆల్గరిథమ్లో తగు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై దాదాపు 80 మంది ఇంజినీర్లు పనిచేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మస్క్ ట్వీట్లు ఈ మధ్య ట్విటర్లో అధికంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త సీఈఓ అప్పుడే..
ట్విటర్ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలాన్ మస్కే సంస్థను ముందుండి నడిపిస్తున్నారు. దీనిపై ఓ దశలో విమర్శలొచ్చాయి. ఆయన దృష్టి మొత్తం ట్విటర్పైనే కేంద్రీకరిస్తున్నారని టెస్లా ఇన్వెస్టర్లు గగ్గోలు పెట్టారు. దీంతో ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి కూడా. మరోవైపు మస్క్ తన విధానాలతో ట్విటర్ను పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలూ వచ్చాయి. దీంతో కొన్ని కంపెనీలు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడానికి వెనుకాడాయి. ట్విటర్కు కొత్త సీఈఓను నియమిస్తే సమస్యలు సద్దుమణగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ.. మస్కే ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. తాజాగా ట్విటర్కు కొత్త అధిపతిని ఎప్పుడు తీసుకురానున్నారో మస్క్ చెప్పారు.
ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్విటర్లో 2023 చివరకు పరిస్థితులు చక్కబడతాయని మస్క్ అంచనా వేశారు. కొత్త సీఈఓకు బాధ్యతలు అప్పగించడానికి అదే సరైన సమయమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అప్పటికి కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను సైతం సిద్ధంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. గత డిసెంబరులో ట్విటర్ను నడిపే తెలివితక్కువ వ్యక్తి దొరికే వరకు తానే సీఈఓ పదవిలో కొనసాగుతానని మస్క్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే తాను ట్విటర్ సీఈఓగా వైదొలగాలా? అని ట్విటర్ పోల్ కూడా నిర్వహించారు. దీనికి మెజారిటీ యూజర్లు వైదొలగాలని సమాధానం ఇవ్వడం గమనార్హం.
★ మరోవైపు కుర్చీలో కూర్చున్న ఓ శునకం ఫొటోను పోస్ట్ చేస్తూ ట్విటర్ కొత్త సీఈఓ ఇదేనని మస్క్ బుధవారం ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది. -
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
Wipro Q4 results: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. -
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు