PPF: పీపీఎఫ్లో పెట్టుబడి పెడుతున్నారా? ఇవి తెలుసుకోండి..
అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పీపీఎఫ్ ఒకటి. పెట్టుబడులకు ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబడి అందిస్తున్న పథకం ఇది.
ఇంటర్నెట్ డెస్క్: అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పీపీఎఫ్ ఒకటి. పెట్టుబడులకు ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబడి అందిస్తున్న పథకం ఇది. ఇందులో అసలు, వడ్డీ రెండింటిపైనా పన్ను ఆదా చేసుకోవచ్చు. అందువల్ల దీన్ని సేవింగ్స్ కమ్ టాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం వార్షికంగా 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో గరిష్ఠంగా సంవత్సరానికి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఖాతా నిర్వహణ కోసం వార్షికంగా కనీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
వార్షిక పెట్టుబడులు రూ.1.50 లక్షలకు పరిమితం అయినప్పటికీ, సురక్షితమైన స్థిర-ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు, పెట్టుబడి కాలంలో ఆర్జించిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది. కాబట్టి ఈ పథకంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు నిపుణులు. అయితే ఈ పథకంలో ప్రయోజనాలు ఉన్నట్లే లోపాలూ ఉన్నాయి. పీపీఎఫ్ పెట్టుబడులకు 15 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. కాబట్టి మెచ్యూరిటీ కంటే ముందే పూర్తి మొత్తాన్ని విత్డ్రా చేసుకోలేరు. అయితే, మెచ్యూరిటీ సమయం తర్వాత కూడా 5 ఏళ్ల కాలవ్యవధితో ఎటువంటి చెల్లింపులూ చేయకుండా ఖాతాను కొనసాగించొచ్చు. మెచ్యూరిటీ తరువాత కూడా ఖాతా ద్వారా పన్ను రహిత వడ్డీని పొందొచ్చు.
మెచ్యూరిటీ సమయంలో విత్డ్రా చేసుకుంటే?
* పీపీఎఫ్ పథకం ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-మార్చి)ను అనుసరించి పనిచేస్తుంది. అందువల్ల మీరు మార్చి 2019లో పీపీఎఫ్ ఖాతాను తెరిచి ఉంటే ప్రస్తుతం మీరు మూడో సంవత్సరంలో ఉన్నారని అర్థం.
* 15వ సంవత్సరం చివరికి పీపీఎఫ్ ఖాతాను మూసివేసి, మొత్తం నగదును విత్డ్రా చేసుకోవచ్చు. ఇందుకు ఫారం-సిని పూర్తిచేసి పోస్టాఫీసు లేదా మీ పీపీఎఫ్ ఖాతా ఉన్న బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది.
* కాలపరిమితి ముగిసిన అనంతరం తప్పనిసరిగా ఖాతాను మూసివేయాల్సిన పనిలేదు. 5 సంవత్సరాల చొప్పున ఖాతాను కొనసాగించొచ్చు. ఖాతాదారుడు జీవించి ఉన్నంత వరకు ఎన్ని సార్లైనా ఖాతాను పొడిగించుకోవచ్చు. ఖాతాను కొనసాగించేందుకు ఫారం-హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది.
మెచ్యూరిటీకి ముందే విత్డ్రా చేయాలనుకుంటే?
* ఖాతా తెరిచిన ఏడో సంవత్సరం నుంచి పాక్షిక విత్డ్రాలను ప్రభుత్వం అనుమతిస్తుంది. మొదటి ఆరు సంవత్సరాల్లో విత్డ్రాలను అనుమతించరు.
* మీరు ఖాతా తెరిచిన సంవత్సరం నుంచి ఏడో సంవత్సరంలో పాక్షికంగా విత్డ్రా చేసుకోవచ్చు. అయితే సంవత్సరానికి ఒకసారి మాత్రమే పాక్షిక విత్డ్రాలను అనుమతిస్తారు.
* పీపీఎఫ్ ఖాతా నుంచి పాక్షిక నగదు ఉపసంహరణ చేసుకోవాలంటే సొమ్ము ఉపసంహరించుకుంటున్న ఏడాదికి నాలుగేళ్ల ముందు నాటి నగదు నిల్వలో 50 శాతం లేదా సొమ్ము ఉపసంహరించుకుంటున్న ఏడాదికి ముందు సంవత్సరం నాటి నగదు నిల్వలో 50 శాతం, ఇందులో ఏది తక్కువ మొత్తమైతే అంత మేర ఉపసంహరించుకోవచ్చు.
* పీపీఎఫ్ ఖాతాల నుంచి పాక్షికంగా నగదు ఉపసంహరించినట్లయితే వాటిపై ఎలాంటి పన్ను భారమూ పడదు.
* కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఉపసంహరణలు, ముందస్తు మూసివేతకు అనుమతించరు.
రుణం తీసుకోవచ్చు..
* ప్రావిడెండ్ ఫండ్ ఖాతాలో పొదుపు చేసిన మొత్తాన్ని ఖాతా ప్రారంభించిన ఏడో సంవత్సరం నుంచి మాత్రమే పాక్షికంగా ఉపసంహరించేందుకు వీలుంది. అయితే ఖాతా ప్రారంభించిన మూడో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది.
* రుణం తీసుకోబోతున్న సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల ముందు వరకు ఉన్న మొత్తం బ్యాలెన్స్ నుంచి 25 శాతం మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చు.
* ఒకసారి రుణం తీసుకున్న తర్వాత ఆ రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత మాత్రమే మళ్లీ రుణం తీసుకునేందుకు వీలుంటుంది.
* పీపీఎఫ్ ఖాతా నుంచి లభించే వడ్డీ కంటే 2 శాతం ఎక్కువ వడ్డీ వర్తిస్తుంది. ఉదాహరణకు: మీరు పీపీఎఫ్ ఖాతా నుంచి రుణం తీసుకున్నారనుకుందాం. మీకు పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంపై 7.1 శాతం వడ్డీ వస్తుంటే, మీరు తీసుకున్న రుణంపై 9.1 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. తీసుకున్న రుణాన్ని 36 నెలలలోపుగా తిరిగి చెల్లించాలి.
* 7వ సంవత్సరం నుంచి రుణం మంజూరు చేయరు. ఖాతా నుంచి పాక్షిక విత్డ్రాలను అనుమతిస్తారు.
ఒకవేళ ద్రవ్యోల్బణం పెరిగితే ఈ పథకంతో కావలసిన నిధులను సమకూర్చుకోలేకపోవచ్చు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్లు వంటివి మార్కెట్తో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి అధిక రాబడిని అందించగలవు. రిస్క్ తీసుకోగలిగిన మదుపర్లు మంచి రాబడి కోసం స్టాక్స్, ఈక్వీటి లింక్డ్ మ్యూచువల్ ఫండ్లను పరిశీలించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పెట్టుబడులు మార్కెట్ రిస్క్లకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మదుపర్లు తమ రిస్క్ స్థాయిలను తెలుసుకుని, స్కీమ్ గురించి జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM