Mutual funds: మదుపర్లకు అలర్ట్.. అందుకు మార్చి 31 ఆఖరు తేదీ
Mutual funds: మార్చి 31 పూర్తయ్యే నాటికి మ్యూచువల్ ఫండ్ మదుపర్లు నామినీని తప్పనిసరిగా ఎంపిక చేయాలి. లేదంటే ఖాతాలు స్తంభించిపోతాయి.
దిల్లీ: మార్చి 31 పూర్తయ్యే నాటికి మ్యూచువల్ ఫండ్ మదుపర్లు నామినీని తప్పనిసరిగా ఎంపిక చేయాలి. లేదా నామినీ అవసరం లేదనైనా డిక్లషరేషన్ సమర్పించాలి. లేదంటే వారి ఖాతాలు స్తంభించిపోతాయి. ఫలితంగా అప్పటి వరకు చేసిన పెట్టుబడి, దానిపై వచ్చే రాబడిని తిరిగి పొందడం కుదరదు.
గత ఏడాది జూన్ 15నే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. నామినీని ఎంపిక చేయడం లేదా అవసరం లేదనైనా డిక్లరేషన్ సమర్పించాలని సూచించింది. దీనికి 2022 ఆగస్టు 1వ తేదీని గడువుగా విధించింది. తర్వాత రెండు దఫాల్లో ఈ గడువును 2023 మార్చి 31 వరకు పొడిగించింది.
గతంలో ఎంఎఫ్ ఖాతాలను తెరిచేటప్పుడు చాలా మంది నామినీలను ఎంపిక చేయలేదని ఆనంద్ రాఠీ వెల్త్ లిమిటెడ్ సీఓఓ నిరంజన్ బాబు తెలిపారు. ఫలితంగా వారికి ఏమైనా అయితే, సొమ్మును క్లెయిం చేసుకోవడానికి వారి చట్టబద్ధమైన వారసులకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయని వివరించారు. కొంత మంది అసలు తాము ఎంఎఫ్ ఖాతాలు తెరిచినట్లు కూడా ఇంట్లో చెప్పడం లేదని పేర్కొన్నారు. ఈ కారణాల వల్లే పెద్ద మొత్తంలో నిధులు పేరుకుపోతున్నాయని వివరించారు. దీనికి పరిష్కారంగానే నామినీని తప్పనిసరి చేస్తూ సెబీ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
నామినీలను ఎంపిక లేదా అవసరం లేదని డిక్లరేషన్ సమర్పించడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ కస్టమర్లకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సెబీ ఆదేశించింది. ఆన్లైన్ లేదా నేరుగా వచ్చి సంబంధిత పత్రాలు సమర్పించే వెసులుబాటు కల్పించాలని సూచించింది. ఒకవేళ ఆన్లైన్లో వివరాలు సమర్పించే వారి గోప్యతను రక్షించాల్సిన బాధ్యత కంపెనీలదేనని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Adani group: నష్టాల్లో అదానీ గ్రూప్ స్టాక్స్.. అమెరికా దర్యాప్తు ఎఫెక్ట్
Adani group: అదానీ గ్రూప్ స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దానిపై అమెరికా సంస్థలు దర్యాప్తు చేపట్టాయని వస్తున్న వార్తలే ఇందుకు కారణం. -
Jio - IPL: ఐపీఎల్ సందడి.. జియో యూజర్లకు డేటా ప్యాక్లు
Jio - IPL: ఐపీఎల్ వీక్షించాలనుకునేవారికి జియోలో రెండు అనువైన డేటా ప్యాక్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలేంటో చూద్దాం..! -
Bill Gates: ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను: బిల్ గేట్స్
స్టీవ్ జాబ్స్లా బహిరంగ సమావేశాల్లో సహజంగా వ్యవహరించలేనని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. -
Uber: ఆస్ట్రేలియాలో ట్యాక్సీ డ్రైవర్లకు ఉబర్ రూ.1,475 కోట్ల పరిహారం
Uber: ఉబర్ వల్ల ఉపాధి కోల్పోయామంటూ కోర్టును ఆశ్రయించిన ట్యాక్సీ డ్రైవర్లకు రూ.1,475 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఆ కంపెనీ అంగీకరించింది. -
Stock Market: ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,000
Stock Market Opening bell: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 4 పాయింట్ల స్వల్ప లాభంతో 72,647 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లు కుంగి 22,007 దగ్గర కొనసాగుతోంది. -
స్మాల్క్యాప్ ప్రకంపనలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు స్మాల్క్యాప్ షేర్లు దూసుకెళ్లాయి. గత నెలరోజుల వ్యవధిలో మాత్రం ఇవి మదుపర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 19 వరకు బీఎస్ఈ సెన్సెక్స్ 24% లాభపడితే, స్మాల్క్యాప్ సూచీ 71% దూసుకెళ్లడం గమనార్హం. -
అదానీ గ్రూప్ రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.1.2 లక్షల కోట్లు (దాదాపు 14 బి.డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. ఇంధన, విమానాశ్రయాలు, కమొడిటీస్, సిమెంట్, మీడియా సహా పలు గ్రూప్ కంపెనీల్లో ఈ పెట్టుబడులు పెట్టనుంది. -
ఫెడ్ వ్యాఖ్యలు కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఊగిసలాటకు గురికావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మొత్తం మీద మార్కెట్లు సానుకూలంగానే ఉండొచ్చని అంటున్నారు. జపాన్, అమెరికా, బ్రిటన్ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుండటమే ఇందుకు కారణం. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఏప్రిల్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.66,022 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.66,502; రూ.66,822 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. -
72000- 72590 పాయింట్ల శ్రేణి కీలకం!
జీవనకాల తాజా గరిష్ఠాల నుంచి సూచీలు గతవారంలో వెనక్కి వచ్చాయి. చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల విలువలు బుడగల్లా ఉన్నాయని, మదుపర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సెబీ పేర్కొనడం ప్రతికూల ప్రభావం చూపింది. -
ఈ వారంలో 3 కొత్త ఐపీఓలు
ఈ వారం మూడు కంపెనీల ఐపీఓలు మదుపర్ల ముందుకు రానున్నాయి. ఇవి ప్రధాన విభాగంలోనివి కావు. చిన్న, మధ్య స్థాయి (ఎస్ఎంఈ) విభాగానికి చెందిన 3 కంపెనీలు మొత్తం రూ.86.8 కోట్లు సమీకరించనున్నాయి. -
సంక్షిప్త వార్తలు
ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ విలువ రెండేళ్లలో 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.41,000 కోట్లు) తగ్గింది. 2022 జనవరి 31కి సంస్థ విలువ 40 బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది జనవరి చివరకు సంస్థ విలువ 35 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. -
Flipkart: ఐఫోన్ ఆర్డర్ క్యాన్సిల్.. ఫ్లిప్కార్ట్కు రూ.10,000 జరిమానా!
Flipkart: ఐఫోన్ ఆర్డర్ను ఏకపక్షంగా క్యాన్సిల్ చేయడం వల్ల కస్టమర్ తీవ్ర మనోవేదనకు గురయ్యారని.. అందుకు ఫ్లిప్కార్ట్ రూ.10,000 జరిమానా చెల్లించాలని సెంట్రల్ ముంబయికి చెందిన ‘జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్’ ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ECI: బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ‘ఈసీ’ వేటు
-
Putin: గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు.. 24 ఏళ్లుగా అధికారంలోనే!
-
‘నేను సోనియాగాంధీతో భేటీ కాలేదు.. అది రాహుల్ పొలిటికల్ స్టంట్’: అశోక్ చవాన్
-
RCB: అమ్మాయిలు గెలిచారు.. ఇక వారి వంతు.. ఐపీఎల్లో ఏం చేస్తారో?
-
Satyendar Jain: ఆప్నేత సత్యేందర్ జైన్కు సుప్రీంలో చుక్కెదురు
-
PM Modi: వారి సవాల్ను స్వీకరిస్తున్నా.. రాహుల్ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోదీ ఫైర్