UPI-RuPay credit cards: త్వరలో క్రెడిట్కార్డు-యూపీఐ చెల్లింపులు..వ్యాపారులపై ఎండీఆర్ భారం!
MDR on UPI-RuPay credit cards: క్రెడిట్కార్డు ద్వారా చేసే యూపీఐ చెల్లింపులపై వ్యాపారులు రెండు శాతం ఎండీఆర్ చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం....
MDR on UPI-RuPay credit cards: డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించడానికి ‘‘ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ - యూపీఐ (UPI)’’ ఖాతాలకు క్రెడిట్ కార్డులను కూడా అనుసంధానించేందుకు అనుమతించనున్నట్లు జూన్, 2022లో ఆర్బీఐ ప్రకటించింది. అయితే, ఇప్పటి వరకు యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. మరి క్రెడిట్ కార్డులతో చేసే యూపీఐ చెల్లింపులకు కూడా ఇదే వర్తిస్తుందా? అనే అనుమానం తలెత్తింది. అదే జరిగితే ‘క్రెడిట్ ప్రొడక్ట్’ అయిన క్రెడిట్ కార్డుపై వచ్చే లాభదాయకతపై ప్రభావం పడుతుందని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనికోసం ప్రత్యేక కమర్షియల్ మోడల్ను రూపొందించాల్సిన అవసరం ఉందని బ్యాంకు వర్గాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ‘‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI)’’తో గతవారం సుదీర్ఘ చర్చలు జరిపాయి. ఎట్టకేలకు ఇరు వర్గాల మధ్య ఓ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
క్రెడిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులపై వ్యాపారులు రెండు శాతం ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)’ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఎన్సీపీఐ నిర్ణయించినట్లు సమాచారం. దీంట్లో 1.5 శాతం కార్డు జారీ సంస్థలకు వెళ్లనుండగా.. మిగిలిన 0.5 శాతం ఛార్జీ పాయింట్ ఆఫ్ సేల్ సదుపాయం కల్పిస్తున్న సంస్థలు- ఉదాహరణకు పేటీఎం, ఎంస్వైప్కు వెళ్లనుంది. వార్షిక టర్నోవర్ రూ.20 లక్షల వరకు మాత్రమే ఉన్న వ్యాపార కేంద్రాల వద్ద రూ.2,000-5,000 విలువ చేసే లావాదేవీలకు మాత్రం ఎలాంటి ఎండీఆర్ ఉండదు. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ఆర్బీఐకి పంపనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు మూడోవారం నుంచి యూపీఐ-క్రెడిట్కార్డు చెల్లింపులు ప్రారంభం కావొచ్చునని అంచనా వేశాయి.
ప్రస్తుతం యూపీఐకి అనుసంధానం చేసిన డెబిట్కార్డు చెల్లింపులు కొనసాగుతున్నాయి. దీంట్లో రూ.2000 విలువ చేసే లావాదేవీల వరకు ఉచితంగా అందిస్తున్నారు. అంటే ఎలాంటి ఎండీఆర్ విధించడం లేదు. కానీ, క్రెడిట్కార్డు-యూపీఐ చెల్లింపులు మాత్రం భిన్నంగా చూడాల్సి ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు వాదిస్తున్నాయి. ఒకరకంగా క్రెడిట్ కార్డు చెల్లింపులను 45 రోజుల వడ్డీరహిత రుణంగా భావించవచ్చు. మరి తమ రుణం ద్వారా లబ్ధిపొందుతున్న వ్యాపారులు ఛార్జీలు చెల్లించడం ‘ధర్మబద్ధమైన కర్తవ్యం’ అన్నది బ్యాంకుల వాదన. లేదంటే క్రెడిట్ కార్డు బిజినెస్ దెబ్బతింటుందని వివరిస్తున్నారు.
వ్యాపారులు బ్యాంకుల చెల్లింపుల వ్యవస్థను వినియోగించుకొన్నందుకు ఎండీఆర్ ఛార్జీలను వసూలు చేస్తారు. భారత ప్రభుత్వం రూపే కార్డు నెట్వర్క్ను ఉపయోగించి చేసే చెల్లింపులపై గతంలో ఛార్జీలను రద్దు చేసింది. అయితే, అది క్రెడిట్ కార్డు చెల్లింపులకు కూడా వర్తింపజేయొద్దన్నది తాజాగా బ్యాంకులు, ఎన్సీపీఐ చర్చలకు దారితీసింది.
యూపీఐ ప్లాట్ఫామ్స్కి క్రెడిట్ కార్డుని అనుసంధానించడం వల్ల కార్డు స్వైప్ చేయకుండానే చెల్లింపులు చేసేయొచ్చు. కేవలం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం లేదా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి క్రెడిట్ కార్డు చెల్లింపులు చేసేయొచ్చు. అయితే, రిజిస్టర్డ్ మొబైల్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి లావాదేవీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జీపే, ఫోన్పే, పేటీఎం వంటి యూపీఐ ఆధారిత యాప్లన్నీ ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులను అనుమతిస్తున్నాయి. అయితే, కేవలం వ్యాపార సంస్థలకు మాత్రమే చెల్లించడానికి ఈ సదుపాయం అందుబాటులో ఉంది. తాజాగా ఆర్బీఐ చేసిన ప్రకటనతో త్వరలో వ్యక్తిగత లావాదేవీలు కూడా చేసేందుకు ఈ వెసులుబాటు అందుబాటులోకి రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి