IPO: నెట్వెబ్ టెక్.. ఎస్పీసీ లైఫ్ ఐపీఓకి దరఖాస్తు
IPO: సర్వర్ల తయారీ సంస్థ నెట్వెబ్ టెక్నాలజీస్ సహా ఫార్మా కంపెనీలకు అవసరమయ్యే పదార్థాలను అందించే ఎస్పీసీ లైఫ్సైనెన్స్ ఐపీఓకి దరఖాస్తు చేసుకున్నాయి.
దిల్లీ: సర్వర్ల తయారీ సంస్థ నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ (IPO)కి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ మేరకు ప్రాథమిక పత్రాలను సమర్పించి సెబీ వద్ద దరఖాస్తు చేసుకుంది. మొత్తం రూ.700 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పబ్లిక్ ఇష్యూ (IPO)లో రూ.257 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 85 లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తున్నారు.
రూ.51 కోట్లు విలువ చేసే షేర్లను ముందస్తు ఐపీఓ (IPO) ప్లేస్మెంట్లో విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది. అదే జరిగితే మొత్తం ఐపీఓ (IPO) పరిమాణం తగ్గుతుంది. సమకూరిన నిధుల్లో రూ.32.77 కోట్లను మూలధన వ్యయాలకు, రూ.128.02 కోట్లు నిర్వహణ మూలధనానికి, రూ.22.5 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనున్నట్లు కంపెనీ తెలిపింది. మిగిలిన నిధులను జనరల్ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు పేర్కొంది. దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న నెట్వెబ్.. దేశీయంగా హైఎండ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ను అందిస్తున్న కంపెనీల్లో ఒకటి. ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు ఈ కంపెనీ ఎంపికైంది.
ఎస్పీసీ లైఫ్సైనెన్స్..
ఫార్మా కంపెనీలకు అవసరమయ్యే పదార్థాలను అందించే ఎస్పీసీ లైఫ్సైనెన్స్ లిమిటెడ్ ఐపీఓ (IPO)కి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు బుధవారం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. రూ.300 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 89.39 లక్షల ప్రమోటర్ల ఈక్విటీ షేర్లను ఐపీఓలో విక్రయానికి ఉంచారు. ప్రీ-ఐపీఓ ప్లేస్మెంట్లో రూ.60 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించే అవకాశం ఉంది. ఐపీఓలో సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, మూలధన వ్యయాలు, నిర్వహణ మూలధన ఖర్చులు, ఇతర కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనున్నారు. కార్డియోవాస్కులార్, యాంటీ-ప్లేట్లెట్, యాంటీ సైకోటిక్, యాంటీ డిప్రెసెంట్స్లో వినియోగించే పలు కీలక పదార్ధాలను ఎస్పీసీ వవిధ ఔషధ కంపెనీలకు అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)