Recession: వచ్చే ఏడాదే ఆర్థిక మాంద్యం.. సీఈబీఆర్ అంచనా!
Recession: రేట్ల పెంపు మూలంగా వచ్చే ఏడాది ఆర్థికమాంద్యం తప్పదని సీఈబీఆర్ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచం వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం (Recession)లోకి జారుకుంటుందని ‘సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (CEBR)’ తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని (Inflation) అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు రుణాలను మరింత భారం చేస్తున్నాయని పేర్కొంది. దీంతో చాలా దేశాల ఆర్థిక వృద్ధి వచ్చే సంవత్సరం క్షీణిస్తుందని అంచనా వేసింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022లో 100 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటిందని CEBR తెలిపింది. కానీ, పెరుగుతున్న ధరల్ని అదుపు చేసేందుకు చేపడుతున్న చర్యల వల్ల 2023లో వృద్ధి ఆగిపోతుందని వివరించింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఇంకా ఫలించలేదని పేర్కొంది. ఆర్థికంగా కొంత మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినా.. 2023లోనూ రేట్ల పెంపు కొనసాగుతుందని అంచనా వేసింది. ధరల్ని అందుబాటు స్థాయిలోకి తీసుకొచ్చేందుకు చేపట్టే చర్యలకు రానున్న కొన్నేళ్ల పాటు బలహీన వృద్ధిరేటు రూపంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపింది.
సీఈబీఆర్ నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు..
☞ అమెరికాను దాటేసి చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడానికి 2036 వరకు వేచి చూడాల్సిందే. గతంలో అంచనా వేసిన దాని కంటే ఇది ఆరేళ్లు ఆలస్యం. జీరో కొవిడ్ విధానం, పాశ్చాత్య దేశాలతో వాణిజ్య వివాదాలు చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరణకు అడ్డంకిగా మారాయి. ఒకవేళ తైవాన్ ఆక్రమణ వంటి చర్యలకు చైనా దిగితే.. అది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
☞ రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల వచ్చిన ఇబ్బందులతో పోలిస్తే చైనా, పాశ్చాత్య దేశాల మధ్య వాణిజ్య యుద్ధ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగి మాంద్యం మరింత బలంగా ఉంటుంది. ఇదే జరిగితే చైనాకూ తీవ్ర నష్టం తప్పదు. ఆర్థికంగా అగ్రరాజ్యంగా నిలవాలనుకుంటున్న ఆ దేశ ఆశలు ఆవిరయ్యే అవకాశం ఉంది.
☞ ప్రపంచంలో మూడో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ 2035 నాటికి అవతరిస్తుంది. 2032 కల్లా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది.
☞ వచ్చే 15 ఏళ్ల పాటు యూకే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ఫ్రాన్స్ ఏడో స్థానంలో కొనసాగుతుంది. బ్రిటన్లో విధానాల రూపకల్పన, దూరదృష్టిలో లోపాలున్నాయి. ఫలితంగా.. ఇతర ఐరోపా దేశాలతో పోలిస్తే వేగంగా వృద్ధి చెందుతున్న బ్రిటన్.. ఆ స్థానాన్ని కోల్పోతుంది.
☞ యావత్తు ప్రపంచం స్వచ్ఛ ఇంధనం దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో సహజ వనరులు అధికంగా ఉన్న వర్ధమాన దేశాలు వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తాయి.
☞ 80,000 డాలర్ల తలసరి జీడీపీని సాధించడానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా చాలా దూరంలో ఉంది. మరోవైపు పారిశ్రామికీకరణకు ముందు నాటి 1.5 డిగ్రీల భూతాప లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశాలు ఇంకా చాలా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?