NHAI: అలాంటి రోడ్డు ప్రమాదాలకు అధికారులదే బాధ్యత: ఎన్హెచ్ఏఐ
రోడ్డు నిర్మాణ నాణ్యతలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఎన్హెచ్ఏఐ సీరియస్గా తీసుకుంది. ఒకవేళ అలాంటి రోడ్లలో ప్రమాదాలు జరిగితే వాటికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
దిల్లీ: రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు తేలితే దానికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ‘భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI)’ తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు ఒప్పందం లేదా పాలసీ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు నిర్మాణ పనుల నాణ్యత విషయంలో రాజీపడి సర్టిఫికెట్ జారీ చేస్తే విధుల ఉల్లంఘనగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలా చేసిన ఎన్హెచ్ఏఐ/ఐఈ/ఏఈ విభాగాలకు చెందిన అధికారులు/ప్రతినిధులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాలసీ నిబంధనలు, కాంట్రాక్టు ఒప్పందంలోని షరతులకు విరుద్ధంగా వ్యవహరించొద్దని తెలిపింది.
రోడ్డుపై మార్కింగ్లు, సూచిక బోర్డులు, క్రాష్ బ్యారియర్ల ఏర్పాటు వంటి తుది మెరుగులు పూర్తి కాకుండానే అధికారులు రోడ్డు నిర్మాణం పూర్తయినట్లుగా సర్టిఫికెట్ జారీ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఉత్తర్వుల్లో ఎన్హెచ్ఏఐ పేర్కొంది. ఇది పూర్తిగా ప్రయాణికుల భద్రతను గాలికొదిలేయడమే అవుతుందని స్పష్టం చేసింది. దీని వల్ల ఎన్హెచ్ఏఐకి చెడ్డ పేరు వస్తుందని తెలిపింది. అన్ని విధాలుగా రోడ్డు పూర్తి కాకుండా సర్టిఫికెట్ ఇస్తే.. ఒకవేళ దానిపై ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా మరణించినా లేదా తీవ్రంగా గాయపడ్డా దానికి రీజినల్ ఆఫీసర్/ప్రాజెక్టు డైరెక్టర్/ఇండిపెండెంట్ ఇంజినీర్ను బాధ్యుల్ని చేస్తామని స్పష్టం చేసింది.
రోడ్డు నిర్మాణంలో ప్రధాన పనులు పూర్తయ్యి.. చిన్న చిన్న తుది మెరుగులు ఇంకా చేయాల్సి ఉన్నప్పుడు వాటిని ‘పంచ్ లిస్ట్’లో చేర్చి సర్టిఫికెట్ జారీ చేస్తుంటారు. అయితే, ఆ పనుల వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనేది నిబంధన. వాటిని సర్టిఫికెట్ జారీ చేసిన 30 రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ, కొన్ని చోట్ల ప్రధాన పనుల్లో భాగమైన కొన్ని కీలక అంశాలను సైతం పంచ్ లిస్ట్లో చేర్చి సర్టిఫికెట్ పొందుతున్నట్లు ఎన్హెచ్ఏఐ దృష్టికి వచ్చింది. దీని వల్ల ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా