Stock Market: ఆగని లాభాల పరుగు.. 63,000 మైలురాయిని దాటిన సెన్సెక్స్
Stock Market: వరుసగా ఏడోరోజూ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పరుగులు తీశాయి.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం కూడా సరికొత్త గరిష్ఠాలను తాకాయి. దీంతో వరుసగా సూచీలు ఏడోరోజూ లాభాలు నమోదుచేశాయి. రెండు ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా ఐదోరోజూ జీవనకాల గరిష్ఠాలకు చేరాయి. సెన్సెక్స్ 63,000 కీలక మైలురాయిని అధిగమించింది. ఈరోజే తొలిసారి 18,700 మార్క్ను తాకిన నిఫ్టీ తరువాతి 100 పాయింట్లను సైతం సునాయాసంగా దాటేసి 18,800ని అధిగమించింది. ఉదయం నుంచి పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలకు అఖరి అరగంటలో కొనుగోళ్ల వెల్లువతో పంట పండింది. చివరకు సెన్సెక్స్ 417.81 పాయింట్లు లాభపడి 63,099.65 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140.30 పాయింట్లు ఎగబాకి 18,758.35 వద్ద ముగిసింది. రెండు సూచీలకు ఇది రికార్డు ముగింపు కావడం విశేషం. ఇంట్రాడేలో 63,303.01 వద్ద సెన్సెక్స్, 18,765.20 వద్ద నిఫ్టీ జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్గ్రిడ్, హెచ్యూఎల్, భారతీఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.42 వద్ద నిలిచింది.
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీల పరుగుకు దోహదం చేశాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ఈరోజు కీలక సమావేశంలో ప్రసంగించనున్నారు. వడ్డీరేట్ల పెంపుపై ఆయన నుంచి సానుకూల సంకేతాలు వచ్చే అవకాశం ఉందని మదుపర్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ చమురు పీపా ధర ఇంకా 84 డాలర్ల దిగువనే ట్రేడవుతోంది. దేశీయంగా చూస్తే ఒక్క ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాల్లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది.
మార్కెట్లోని మరిన్ని విశేషాలు..
- జొమాటో షేరు ధర ఈరోజు 3.54 శాతం పెరిగి రూ.65.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 66.80 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఈ కంపెనీలో తమకు ఉన్న వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించాలని అలీబాబా గ్రూప్ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే స్టాక్ ధర పెరిగింది.
- ఎన్డీటీవీ బోర్డు నుంచి ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ పూర్తిగా వైదొలగడంతో సంస్థ షేర్లు రాణించాయి. ఈరోజు 5 శాతం పెరిగి రూ.446.30 వద్ద అప్పర్ సర్క్యూట్ని తాకింది. ఇలా అప్పర్ సర్క్యూట్ని తాకడం ఇది వరుసగా మూడోరోజు.
- గ్లాండ్ ఫార్మాలో వాటాను, ఆ సంస్థ ప్రమోటర్గా ఉన్న చైనా సంస్థ ఫోసున్ ఫార్మా విక్రయించనున్నట్లు మార్కెట్ వర్గాల్లో ప్రచారమవడంతో కంపెనీ షేరు విలువ ఈరోజు 5.43 శాతం నష్టపోయి రూ.1,776 వద్ద స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?