Stock Market: ఫ్లాట్‌గా మొదలైన స్టాక్‌ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock Market) స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. అమెరికా ఫెడ్‌ రేట్ల పెంపుతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి.

Published : 04 May 2023 09:45 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అమెరికా ఫెడరల్‌ (Fed) రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను పెంచడంతో అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది. మదుపర్లు అప్రమత్తత పాటిస్తుండటంతో సూచీలు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.35 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ (Sensex) 81 పాయింట్ల లాభంతో 61,274 వద్ద, నిఫ్టీ (Nifty) 28 పాయింట్ల లాభంతో 18,118 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 పైసలు పెరిగి 81.67 వద్ద మొదలైంది.

నిఫ్టీలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్‌, భారత్‌ పెట్రోలియం, టైటాన్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా కన్స్యూమర్స్‌ ప్రోడక్ట్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. షాంఘై, హాంకాంగ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. సియోల్‌, సిడ్నీ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. అటు బుధవారం నాటి ట్రేడింగ్‌లో అమెరికా మార్కెట్లు కూడా నష్టాలను చవిచూశాయి. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.7 శాతం పతనమవ్వగా.. డోజోన్స్‌ 0.8శాతం, నాస్‌డాక్‌ 0.5శాతం కుంగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని