Insurance: కొత్త ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించిన నివా బుపా
నివా బుపా కొత్త ఆరోగ్య పాలసీ ‘రీ అస్యూర్ 2.0’ను ప్రారంభించింది. ‘రీ అస్యూర్ Forever’, బూస్టర్+ అనే ఫీచర్లు దీని ప్రత్యేకత.
ఇంటర్నెట్ డెస్క్: ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థ ‘నివా బుపా’ కొత్త ఆరోగ్య పాలసీ ‘రీ అస్యూర్ 2.0’ను ప్రారంభించింది. పాలసీ వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ ఫ్లోటర్గా అందుబాటులో ఉంటుంది. ‘రీ అస్యూర్ 2.0’ పాలసీ పునరుద్ధరణ ప్రాతిపదికన పొందే ఆరోగ్య పాయింట్లపై 30% వరకు ప్రీమియం తగ్గింపు పొందొచ్చు. ఈ కొత్త పాలసీ ప్లాటినం+, టైటేనియం+ అనే రెండు రకాల్లో అందుబాటులో ఉంది. ప్లాటినం+ వేరియంట్ కింద, రూ.10 లక్షల కవర్ను కొనుగోలు చేసే 40 ఏళ్ల వ్యక్తికి వార్షిక ప్రీమియం రూ.11 వేలు(+జీఎస్టీ) ఉంటుంది.
రీఅస్యూర్ ‘Forever’
ఈ ఫీచర్తో పాలసీదారు తన మొదటి క్లెయిమ్ చేసి తర్వాత బేస్ ఇన్సూర్డ్ మొత్తానికి సమానమైన బీమా మొత్తాన్ని కలిగి ఉంటారు. ఉదా: ఒక వ్యక్తి రూ.10 లక్షల కవర్ కలిగి ఉంటే, మొదటి క్లెయిమ్ మొత్తం రూ.5 లక్షలు అయితే, రీఅష్యూర్ ‘Forever’ ట్రిగ్గర్ చేస్తారు. ఏ సమయంలోనైనా, ఆ వ్యక్తి చేసిన క్లెయిమ్లతో సంబంధం లేకుండా, ఆ సంవత్సరంలో తదుపరి క్లెయిమ్ల కోసం, అలాగే పునరుద్దరణ సమయంలో కూడా పాలసీదారుడు బేస్ బీమా మొత్తాన్ని కలిగి ఉంటారు.
వయసు పెరిగినా ప్రీమియం మారదు
సాధారణంగా ద్రవ్యోల్బణం, పాలసీదారుని వయసు కారణంగా ఆరోగ్య బీమా పునరుద్ధరణ ప్రీమియంలు పెరుగుతాయి. అయితే పాలసీదారులు ఈ పాలసీలోకి ప్రవేశించిన తర్వాత, క్లెయిమ్ చేసే వరకు ‘వయసు’ లాక్ అవుతుంది. ఉదా: ఒక వ్యక్తి 35 సంవత్సరాల వయసులో పాలసీని కొనుగోలు చేస్తే..మొదటి క్లెయిమ్ చేసేవరకు, వయసు పెరిగినా కూడా 35 సంవత్సరాల ఏజ్-బ్యాండ్కు వర్తించే వార్షిక ప్రీమియం కొనసాగుతుంది. అంటే, ఈ వ్యక్తి 45 సంవత్సరాల వయసులో మొదటి క్లెయిమ్ చేస్తే..35 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి చెల్లించే ప్రీమియం 10 ఏళ్ల వరకు కూడా వర్తిస్తుంది.
బూస్టర్+ ప్రయోజనం
ఉపయోగించని బేస్ బీమా మొత్తం తదుపరి పాలసీ సంవత్సరానికి ఫార్వర్డ్ చేయడానికి బూస్టర్+ అనుమతిస్తుంది.
ఈ బీమా మొత్తం ఐదు లేదా పది రెట్ల వరకు ఉండొచ్చు. అయితే, పాలసీదారుడు ప్లాటినం+ లేదా టైటేనియం+ వేరియంట్ను ఎంచుకున్నారా అనేదానిపై ఆధారపడి ఉంటుంది. బీమా మొత్తం 5X, 10X వరకు ప్రతి పునరుద్ధరణకు జమ అవుతూనే ఉంటుంది.
సేఫ్గార్డ్
పాలసీ సంవత్సరంలో క్లెయిమ్ రూ.1 లక్ష లోపు ఉన్నట్లయితే బూస్టర్+ ప్రయోజనాన్ని కాపాడుకోవడంతో అదనపు క్లెయిమ్కు అవకాశం ఉంటుంది. అంటే, క్లెయిమ్ మొత్తం రూ.1 లక్షలోపు ఉన్నట్లయితే, బేస్ బీమా మొత్తాన్ని ఎలాంటి తగ్గింపులు లేకుండా తదుపరి పాలసీ సంవత్సరానికి ఫార్వార్డ్ చేస్తారు. పాలసీదారులు(ఆరోగ్య స్థితిపై ఆధారపడి), పునరుద్ధరణ ప్రీమియంలపై 30 శాతం వరకు తగ్గింపునకు అర్హులు.
ఇతర ప్రయోజనాలు
ఈ ప్లాన్లో గది అద్దె ఉప-పరిమితులు లేవు. 2 గంటలు, అంతకంటే ఎక్కువ సమయం పాటు ఏ ఆసుపత్రిలో చేరినా బీమా కవరేజీ ఉంటుంది. ఈ ప్లాన్ తో స్మార్ట్ హెల్త్+ రైడర్ తీసుకుంటే..అపరిమిత టెలి కన్సల్టేషన్లను పొందొచ్చు. పాలసీ మొదటి రోజు నుంచి మధుమేహం, హైపర్టెన్షన్ను కవర్ చేస్తుంది. 18-65 సంవత్సరాల వయసు వారు రూ.5 లక్షల నుంచి రూ.1 కోటి వరకు బీమా మొత్తాన్ని ఈ పాలసీలో తీసుకోవడానికి వీలుంది. పాలసీ వ్యక్తిగతంగా, ఫ్యామిలీ ఫ్లోటర్గా అందుబాటులో ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!