Mukesh Ambani: దేశ ఆర్థిక పునాదుల్ని ఎవరూ ప్రశ్నించలేరు: అంబానీ
Mukesh Ambani: యూపీ ఇన్వెస్టర్ల సదస్సులో ప్రధాని మోదీతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో రిలయన్స్ రూ.75,000 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. మన దేశ ఆర్థిక వ్యవస్థపై ముకేశ్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లఖ్నవూ: భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు తాజా కేంద్ర బడ్జెట్ (Budget 2023) పునాదులు వేసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఛైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) అన్నారు. భారత్ బలమైన వృద్ధి బాటలో పయనిస్తోందని తాను బలంగా విశ్వసిస్తున్నానన్నారు. భారతీయులు అభివృద్ధి చెందిన దేశాల కంటే వేగంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారని చెప్పారు. మన దేశ ఆర్థిక పునాదుల్ని ప్రపంచంలో ఎవరూ ప్రశ్నించలేరని ధీమా వ్యక్తం చేశారు.
4 ఏళ్లలో రూ.75,000 కోట్ల పెట్టుబడులు..
వచ్చే నాలుగేళ్లలో ఉత్తర్ప్రదేశ్లో రూ.75,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. 5జీ మొబైల్ సేవల అమలు, రిటైల్ నెట్వర్క్ విస్తరణ, పునరుత్పాదక ఇంధన వసతుల ఏర్పాటుకు నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. లఖ్నవూలో జరుగుతున్న ‘ఉత్తర్ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు-2023’లో శుక్రవారం అంబానీ పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
జీవఇంధన రంగంలోకి రిలయన్స్..
రిలయన్స్ జీవ ఇంధన రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు అంబానీ ఈ సందర్భంగా ప్రకటించారు. పంట వ్యర్థాలను గ్యాస్గా మార్చి పరిశ్రమలకు ఇంధనంగా అందిస్తామన్నారు. వాహనాలు, వంటగదుల్లోనూ దీన్ని ఉపయోగించొచ్చని తెలిపారు. వచ్చే 10 నెలల్లో యూపీలో 10 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన పునరుత్పాదక ఇంధన వసతులను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 5జీ సేవల్ని సైతం విస్తరిస్తామని తెలిపారు. ఈ కొత్త పెట్టుబడుల ద్వారా అదనంగా మరో 1 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టిన రూ.50,000 కోట్ల పెట్టుబడులకు తాజా రూ.75,000 కోట్లు అదనమని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె