‘నియంత్రణపరమైన లోపాలున్నాయని చెప్పలేం’.. ‘అదానీ’ వ్యవహారంపై నిపుణుల కమిటీ
Adani group: అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికను సమర్పించింది. స్టాక్ ధరల్లో తారుమారు, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలకు సంబంధించి నియంత్రణ పరమైన లోపాలు ఉన్నాయని నిర్ధారణకు రాలేమని తెలిపింది.
దిల్లీ: అదానీ గ్రూప్పై (Adani group) వచ్చిన ఆరోపణలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ సుప్రీంకోర్టుకు కీలక నివేదిక సమర్పించింది. అదానీ గ్రూప్ స్టాక్స్ ధరల ర్యాలీ విషయంలో నియంత్రణ పరమైన లోపాలు జరిగాయని ప్రాథమికంగా అప్పుడే ఓ నిర్ధారణకు రాలేమని తెలిపింది. అయితే, అదానీ గ్రూప్ విషయంలో హిండెన్బర్గ్ రిపోర్ట్కు (Hindenburg) ముందు కొన్ని సంస్థలు షార్ట్ పొజిషన్లు తీసుకోవడం, రిపోర్ట్ తర్వాత స్టాక్ ధరలు పతనం అయినప్పుడు స్క్వేరింగ్ ఆఫ్ చేశారనడానికి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
హిండెన్బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూప్ స్టాక్స్ తీవ్ర ఒత్తిడికి గురైన సంగతి తెలిసిందే. మోసపూరిత లావాదేవీలు, స్టాక్ ధరల తారుమారు వంటి అవకతవకలకు అదానీ గ్రూప్ సంస్థలు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ ఆరోపించింది. అదానీ గ్రూప్ సంస్థలు పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధననూ పాటించడం లేదని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వ వర్గాలుగానీ, స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థలు గానీ జోక్యం చేసుకోలేదని హిండెన్బర్గ్ ఆరోపించింది. ఈ ఆరోపణలను అప్పట్లో అదానీ గ్రూప్ ఖండించింది. ఈ నేపథ్యంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సెబీని సైతం దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సుప్రీంకోర్టుకు తన నివేదికను సమర్పించింది. సెబీ ఇచ్చిన వివరణ, అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. స్టాక్ ధరల తారుమారు విషయంలో నియంత్రణ పరమైన లోపాలు జరిగాయని ఇప్పటికిప్పుడే నిర్ధారణకు రాలేమని తన నివేదికలో కమిటీ పేర్కొంది. అలాగే, కనీస పబ్లిక్ హోల్డింగ్కు సంబంధించి సెబీ వైపు నియంత్రణ పరమైన లోపాలు ఉన్నాయని చెప్పలేమని తెలిపింది. జనవరి 24న వెలువడిన రిపోర్ట్ తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్లో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా పెరిగిందని నివేదిక తెలిపింది. అదానీ గ్రూప్ స్టాక్స్ తీవ్రమైన ఒత్తిడికి గురైన తర్వాత.. మళ్లీ ఆ స్థాయికి చేరనప్పటికీ.. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయని తెలిపింది. మరోవైపు అదానీ గ్రూప్ వ్యవహారంలో సెబీ దర్యాప్తునకు ఆగస్టు 14 వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్