8 శాతం రాబడినిచ్చే 5 పెట్టుబడి మార్గాలు
ద్రవ్యోల్బణం పెరిగినా కొద్ది రాబడి ఆవిరైపోతుంటుంది. అందుకే ఎందులో పెట్టుబడులు పెడితే ద్రవ్యోల్బణాన్ని అదిగమించి, ఆశించిన లాభాలను పొందవచ్చో తెలుసుకొని ప్రారంభించడం మంచిది.....
ద్రవ్యోల్బణం పెరిగినా కొద్ది రాబడి ఆవిరైపోతుంటుంది . అందుకే ఎందులో పెట్టుబడులు పెడితే ద్రవ్యోల్బణాన్ని అదిగమించి, ఆశించిన లాభాలను పొందవచ్చో తెలుసుకొని ప్రారంభించడం మంచిది.
1.ఫిక్స్డ్ డిపాజిట్లు
చాలా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లకు (ఎఫ్డీ) 6 నుంచి 7 శాతం వార్షికంగా వడ్డీని అందిస్తున్నప్పటికీ, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైనవి. కచ్చితమైన రాబడులనిస్తాయి. కొన్ని బ్యాంకులు దీర్ఘకాలిక డిపాజిట్లకు 8 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 45 నెలల నుంచి 69 నెలల డిపాజిట్లకు 8 శాతం వడ్డీని ఇస్తోంది.
ఫిక్స్డ్ డిపాజిట్లలో సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్ ,5 సంవత్సరాల కాల పరిమితి కలిగిన కోటి రూపాయల కంటే తక్కువ ఫిక్స్ డ్ డిపాజిట్లకు 7.4 శాతం వడ్డీ ఇస్తుంటే, సీనియర్ సిటిజన్లకు 8.05 శాతం ఆఫర్ చేస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది. మీ మొత్తం ఆదాయానికి, వడ్డీ ఆదాయం కలిపి మీరు ఏ శ్లాబులోకి వస్తారో దాని ప్రకారం పన్ను చెల్లించవలసి ఉంటుంది.
2.కంపెనీ ఫిక్స్డ్ డిపాజట్లు
కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల వంటివే. పరిమిత కాలానికి కచ్చితమైన రాబడిని కోరుకునేవారికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా మంచి లాభాలనిస్తాయి. కంపెనీ డిపాజిట్లు 12 నుంచి 15 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచితే ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మహీంద్రా ఫైనాన్స్ ధన్ వృద్ధి స్కీమ్ 20 నెలలకు 8 శాతం, 27 నెలలకు 8.5 శాతం, 33 నెలలకు 8.75 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది.
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా 8.40 శాతం వరకు వడ్డీ రేట్లను ఇస్తుంది. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 5 కోట్ల లోపు, అయిదేళ్ల రెగ్యులర్ డిపాజిట్లపై 8.1 శాతం నుంచి 8.2 శాతం వరకు ఇస్తుంది అయితే కంపెనీ డిపాజిట్లకు భద్రత ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. అందుకే తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. కంపెనీలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినంత మాత్రాన కంపెనీ ఆర్థికంగా ఒడుదొడుకులకు లోనైతే ఆస్తులపై ఎలాంటి హక్కు ఉండదని గమనించాలి.
3. మార్పిడి-రహిత డిబెంచర్లు (ఎన్సీడీ)
కొంత రిస్క్ తీసుకున్నా ఫరవాలేదు అనుకునేవారికి ఎన్సీడీలు సరైనవి. ఎన్సీడీల వడ్డీ రేట్లు సాధారణంగా 8 నుంచి 9.5 శాతం వరకు ఉంటాయి. అయితే కూపన్ రేట్లను బట్టి నిర్ణయం తీసుకోకూడదు. క్రెడిట్ రేటింగ్, లిక్విడిటీ, కాలపరిమితి వంటివి చూసుకోవాలి. తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్నవాటికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే అవి ఎక్కువ కూపన్ రేట్లను ప్రకటిస్తాయి. లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా మెచ్యూరిటీ ముగిసేంత వరకు ఉంచితేనే ఎన్సీడీలలో పెట్టుబడులు పెట్టడం మంచిది. మ్యూచువల్ పండ్
చాలా వరకు మ్యూచువల్ ఫండ్లు 8 శాతం కంటే ఎక్కువ రాబడినిస్తాయి. అయితే మార్కెట్ల ఒడుదొడుకులను బట్టి లాబాలు ఉంటాయి. కచ్చితమైన లాభాలను అంచనా వేయడం కష్టం. గత దశాబ్ద కాలంగా మ్యూచువల్ ఫండ్లు 11 నుంచి 16 శాతం రాబడినందిస్తున్నాయి. ఎక్కువ ఈక్విటీలలో పెట్టుబడులు కలిగిన హైబ్రిడ్ ఫండ్లు 12 శాతం వరకు లాబాలను తెచ్చిపెట్టాయి. ఈక్విటీ ఫండ్లపై 10 శాతం ఎల్టీసీజీ పడుతుంది. అయినప్పటికీ 8 శాతం కంటే ఎక్కువ లాభాలను అందిస్తాయి. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు మార్కెట్ల ఒడుదొడుకులను తట్టుకొని మంచి లాబాలను ఇస్తాయనే
చెప్పుకోవచ్చు.
5. జాతీయ పింఛను విధానం (ఎన్పీఎస్)
పదవీ విరమణ కోసం నిధిని సమకూర్చుకోవాలనుకునేవారికి ఇదొక మంచి మార్గం. ఎన్పీఎస్లో 8 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే మ్యూచువల్ ఫండ్ల మాదిరిగానే ఇందులో కూడా రాబడులను కచ్చితంగా అంచనా వేయలేం. ఎన్పీఎస్లోకి నిధులు పీఎఫ్ఆర్డీఏ నిర్వహిస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు, ఈక్విటీలలోపెట్టుబడులు పెడుతుంది. ఇందులో విత్డ్రా చేసుకునేందుక మొత్తం నిధిలో 40 శాతం యాన్యుటీకి కేటాయించాలి. 60 శాతం విత్డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. విత్డ్రా సమయంలో నిధులు రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువగా ఉంటే మొత్తం ఒకే సారి తీసుకునే అవకాశం ఉంది.
చివరగా, పెట్టుబడులుకు చాలా రకాల మార్గాలు ఉన్నాయి. కానీ మీ ఆర్థిక స్థితిని, లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులను ఎంచుకోవాలి. రిటర్నులు , కాలపరిమితి, భద్రత, రిస్క్ వంటివి అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చిన్న వయసులో ఉన్నప్పుడు అధిక రిస్క్ తీసుకున్నా ఫర్వాలేదు. క్రమమైన పెట్టుబడులను అలవాటు చేసుకోవాలి. ఎప్పుడూ మార్కెట్లను, దేశ ఆర్థిక వ్యవస్థను గమినిస్తూ అర్థం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు