Oil Prices: లీటర్ పెట్రోల్పై రూ.10 లాభం.. డీజిల్పై రూ.6.5 నష్టం!
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ.. దేశీయ చమురు విక్రయ సంస్థలు మాత్రం పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్ని సవరించడం లేదు. ధరలు గరిష్ఠంగా ఉన్నప్పుడు సంభవించిన నష్టాలను పూడ్చుకోవడం కోసమే ఈ వైఖరిని అవలంభిస్తున్నాయని ప్రముఖ నివేదిక తెలిపింది.
దిల్లీ: చమురు విక్రయ సంస్థలు లీటర్ పెట్రోల్ (Petrol)పై ప్రస్తుతం రూ. 10 లాభం పొందుతున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. అదే సమయంలో లీటర్ డీజిల్ (Diesel)పై రూ.6.50 నష్టాన్ని భరిస్తున్నట్లు పేర్కొంది. పెట్రోల్ (Petrol)పై లాభం వస్తున్నప్పటికీ రిటైల్ ధరల్ని మాత్రం కంపెనీలు తగ్గించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిల్లిన నష్టాలను.. ప్రస్తుతం వస్తున్న లాభాలతో భర్తీ చేసుకోవడానికే కంపెనీలు ధరల్ని తగ్గించడం లేదని నివేదిక తెలిపింది.
ప్రభుత్వ రంగ సంస్థలైన ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC)’, ‘భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL)’, ‘హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL)’ గత 15 నెలలుగా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) రిటైల్ ధరలను సవరించడం లేదు. ఈ వ్యవధిలో అంతర్జాతీయ విపణిలో ఓ దశలో ధరలు బాగా తగ్గిన సందర్భాలూ ఉన్నాయి. 2022 జూన్ 24తో ముగిసిన వారంలో కంపెనీలు లీటర్ పెట్రోల్ (Petrol)పై రూ. 17.4, లీటర్ డీజిల్ (Diesel)పై రూ. 27.7 నష్టాన్ని చవిచూసినట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ధరలు క్రమంగా తగ్గడంతో అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో లీటర్ పెట్రోల్పై రూ. 10 లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది. లీటర్ డీజిల్ (Diesel)పై నష్టం సైతం రూ. 6.5కు తగ్గినట్లు తెలిపింది.
ఈ మూడు కంపెనీలు 2022 ఏప్రిల్ 6 నుంచి ధరల్ని సవరించడం పూర్తిగా నిలిపివేశాయి. అదే నెలలో అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ చమురు ధర 102.97 డాలర్ల నుంచి 116.01 డాలర్లకు పెరిగింది. తర్వాత జూన్లో అది 78.09 డాలర్లకు పడిపోయింది. ధరలు గరిష్ఠానికి చేరినా.. రిటైల్ ధరల్ని మార్చకపోవడంతో సంస్థలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఏప్రిల్- సెప్టెంబరు త్రైమాసికంలో మూడు కంపెనీలు కలిపి రూ. 21,201.18 కోట్ల నష్టాలను నివేదించాయి. ప్రభుత్వం రూ.22,000 కోట్ల సాయం అందించినా.. ఈ నష్టాలు తప్పలేదు.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గత కొన్నేళ్లుగా తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య చలిస్తున్నాయి. 2020 కరోనా వ్యాప్తి తీవ్రమైన సమయంలో ధరలు భారీగా పడిపోయాయి. 2022లో తిరిగి వాణిజ్య కార్యకలాపాలు పుంజుకోవడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ధరలు ఒక్కసారిగా ఎగబాకి మార్చి నెలలో 140 డాలర్ల వద్ద 14 ఏళ్ల గరిష్ఠానికి చేరాయి. అయితే, చమురును భారీ ఎత్తున దిగుమతి చేసుకునే చైనాలో గిరాకీ మందగించడంతో ఎగువ స్థాయిల నుంచి దిగొచ్చాయి. భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడుతున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్