EV chargers: విద్యుత్ స్కూటర్ కొన్నారా? ఛార్జర్ సొమ్ము వెనక్కి!
Ola- Ather- TVS: విద్యుత్ వాహనం కొనుగోలు సమయంలో ఛార్జర్ కోసం అదనపు మొత్తం చెల్లించిన వారికి ఆ మొత్తాన్ని కంపెనీలు తిరిగి చెల్లించనున్నాయి. దీనిపై ఆయా కంపెనీలు అధికారిక ప్రకటన మాత్రం వెలువరించలేదు.
ఇంటర్నెట్ డెస్క్: విద్యుత్ స్కూటర్ (Electric Scooter) కొనుగోలు చేశారా? ఛార్జర్ కోసం (Charger) అదనంగా చెల్లించారా? అయితే మీ సొమ్ము త్వరలో వెనక్కి వచ్చే అవకాశం ఉంది. గతంలో ఛార్జర్కు గానూ అదనంగా వసూలు చేసిన మొత్తాలను వాహన కంపెనీలు వినియోగదారులకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఓలా (OLA), ఏథర్ ఎనర్జీ (Ather), టీవీఎస్ మోటార్ (TVS) వంటి సంస్థలు తిరిగి చెల్లింపులు చేయడానికి సిద్ధమైనట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఫేమ్-2 సబ్సిడీ (FAME-2) విషయంలో నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఆయా సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
విద్యుత్ వాహనాల విక్రయ సమయంలో ఈవీ హోమ్ ఛార్జర్ కోసం కంపెనీలు అదనంగా వసూలు చేసినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఫేమ్-2 సబ్సిడీ పొందేందుకు రూ.1.5 లక్షలకు మించకూడదన్న నిబంధనను ఉల్లంఘించి మరీ ఛార్జర్కు అదనంగా వసూలు చేసినట్లు తెలిసింది. దీంతో రాయితీ కింద చెల్లించాల్సిన రూ.800 కోట్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఆయా సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వాహన సంస్థలు తమ ధరలను సవరించాయి. ప్రస్తుతం ఛార్జర్ను వాహన ఇన్వాయిస్తో పాటే అందించేందుకు సిద్ధమయ్యాయి.
ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోకుండా ఛార్జర్కు వసూలు చేసిన మొత్తాలను తిరిగి వినియోగదారులకు చెల్లించాలని నిర్ణయించిట్లు తెలిసింది. విద్యుత్ వాహన దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ ఈ విధంగా సుమారు రూ.130 కోట్లు వినియోగదారులకు ఇవ్వనుందని తెలిసింది. ఇదే తరహాలో ఏథర్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్ సైతం చెల్లింపులు చేయనున్నాయని సమాచారం. దీనిపై ఆయా సంస్థలేవీ అధికారికంగా ప్రకటన వెలువరించలేదు.
ఇదీ పథకం..
భారత్లో హైబ్రిడ్, ఎలెక్ట్రిక్ వాహనాల సత్వర స్వీకరణ-ఉత్పత్తి (ఫేమ్) పథకం కింద విద్యుత్ వాహన (ఈవీ) ఉత్పత్తిదారులు స్థానికంగా తయారైన ఈవీలను 40 శాతం తగ్గింపు ధరకు విక్రయించాలి. ఆ తగ్గించిన మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రాయితీగా పొందవచ్చు. ఇదే రాయితీతో ఎలెక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను (ఈ2డబ్ల్యూ) ప్రోత్సహించడానికి ఫేమ్-2 పథకం తీసుకొచ్చారు. 2019-2022 మధ్య కాలంలో అమలులో ఉండే ఈ పథకం ద్వారా దేశంలో 10 లక్షల ఈ2డబ్ల్యూలను, 7000 విద్యుత్ బస్సుల తయారీని సాధించాలని కేంద్రం టార్గెట్గా పెట్టుకుంది. తరవాత ఈ పథకాన్ని 2024 మార్చి 31 వరకు పొడిగించి, ఫేమ్-2 కింద 10 లక్షల ఈ2డబ్ల్యూలకు అంతిమ ధరపై రూ.20,000 రాయితీ ఇస్తోంది. దేశమంతటా 2,700 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడమూ పథకంలో భాగమే. కానీ, ఫేమ్-2 మార్గదర్శక సూత్రాలను తయారీదారులు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు రావడంతో సంవత్సర కాలంగా అనేక ఈ2డబ్ల్యూ ఉత్పత్తిదారులకు సబ్సిడీని నిలిపేసింది. తాజాగా ఈ అంశంపై టీవీఎస్, ఓలా ఎలెక్ట్రిక్, హీరో మోటోకార్ప్, ఏథర్ ఎనర్జీ వంటి అనేక కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. భారతీయ ఈ2డబ్ల్యూ మార్కెట్లో పై నాలుగు కంపెనీలకు 40-45 శాతం వాటా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. -
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) క్రెటా ఎన్లైన్ను హ్యుందాయ్ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించారు. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
Automobile Sales: ఫిబ్రవరి వాహన విక్రయాల్లో 13% వృద్ధి
Automobile Sales: ఫిబ్రవరిలో వాహన విక్రయ గణాంకాలను ఫాడా గురువారం వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన గత నెలలో 13 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది.