ola scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు సరికొత్త అప్డేట్
హోలీ పండుగ సందర్భంగా సరికొత్త ‘గెరువా’ కలర్ వేరియంట్ను కూడా సంస్థ ఆవిష్కరించింది
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా గతేడాది ఎస్1, ఎస్1ప్రో పేరుతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి కొత్త 2.0 అప్డేట్ను కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ తన ట్విటర్ ద్వారా ప్రకటించారు. 'MoveOS 2.0' పేరిట విడుదల చేసిన ఈ అప్డేట్ రెండు స్కూటర్ల వినియోగదారులకూ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ అప్డేట్లో నావిగేషన్, క్రూజ్ కంట్రోల్, బ్లూటూత్ మొదలైన ఫీచర్స్ మరింత అప్డేట్ కానున్నాయి. అదే విధంగా హోలీ పండుగ సందర్భంగా సరికొత్త ‘గెరువా’ కలర్ వేరియంట్ను కూడా ఓలా ఆవిష్కరించింది. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ ‘గెరువా’ రెండు రోజులు మాత్రమే, అంటే మార్చి 17, 18 తేదీల్లో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!