LIC Listing: ఎల్ఐసీ లిస్టింగ్కు ఏడాది.. మదుపర్లకు ₹2.4 లక్షల కోట్ల నష్టం!
One Year for LIC Listing: స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ లిస్టయ్యి సరిగ్గా మే 17కు ఏడాది పూర్తయ్యింది. ఏడాదిలో ఏ రోజూ ఇష్యూ ధరను ఎల్ఐసీ తాకకపోవడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: ఏడాది క్రితం భారీ అంచనాలతో ఐపీఓకు వచ్చిన ఎల్ఐసీ (LIC).. స్టాక్ మార్కెట్లో లిస్టయ్యి సరిగ్గా నేటికి ఏడాది (One Year for LIC) పూర్తయ్యింది. గతేడాది మే 17న లిస్టైన ఎల్ఐసీ.. తొలి రోజే మదుపరులను నిరాశ పరిచింది. ఆ తర్వాత సైతం కోలుకున్న దాఖలాల్లేవు. ఈ ఏడాదిలో ఏ ఒక్క రోజూ ఇష్యూ ధరను తాకిన సందర్భం లేదు. మొత్తానికి లాభాల మాట అటుంచితే.. ఎన్నో ఆశలు రేపిన ఎల్ఐసీ మదుపరులకు రూ.2.4 లక్షల కోట్ల నష్టాన్ని మాత్రం మిగిల్చింది!
ప్రభుత్వ రంగ బీమా కంపెనీ అయిన ఎల్ఐసీలో 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను ప్రభుత్వం జారీ చేసింది. ఇష్యూ ధరను రూ.949గా ప్రభుత్వం పేర్కొంది. సరిగ్గా ఇదే రోజు లిస్టయిన ఎల్ఐసీ.. 8 శాతం డిస్కౌంట్తో మార్కెట్లో అడుగుపెట్టింది. బీఎస్ఈలో రూ.867.20 వద్ద, ఎన్ఎస్ఈలో రూ.872 వద్ద లిస్టయ్యింది. ఆ తర్వాత కూడా షేరు విలువ పడుతూనే ఉంది. బుధవారం (మే 17) రూ.568.25 వద్ద ట్రేడవుతోంది. అంటే ఇష్యూ ధరతో పోలిస్తే 40 శాతం నష్టపోయింది. ఈ ఏడాదిలో ఏ ఒక్క రోజూ ఇష్యూ ధరకు దరిదాపుల్లోకి ఎల్ఐసీ రాకపోవడం గమనార్హం.
ఐపీఓ సమయంలో ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ.6లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ప్రస్తుతం ఆ విలువ రూ.3.6 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్లకు రాబడి ఇవ్వకపోగా.. రూ.2.4 లక్షల కోట్ల నష్టాన్ని ఎల్ఐసీ మిగిల్చింది. నవంబర్-జనవరి మధ్య ఓ దశలో రూ.600-700 స్థాయికి ఎల్ఐసీ షేరు ధర చేరినప్పటికీ.. అదానీ వ్యవహారం తర్వాత మళ్లీ పూర్వ స్థితికి చేరడం గమనార్హం. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా రూ.550 స్థాయికి అటూఇటుగా ట్రేడవుతోంది. అయితే, ఎల్ఐసీ లిస్టయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ స్థాయికి చేరకపోవడానికి పలు కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
- జీవిత బీమా రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీనే మార్కెట్ లీడర్. అయితే, లాభాల పరంగా మాత్రం ఎల్ఐసీ అంత గొప్ప ఫలితాలను ప్రకటించకపోవడం మదుపరులు ఆసక్తి చూపకపోవడానికి కారణమని విశ్లేషకులు చెప్తున్నారు.
- ఎల్ఐసీ ఐపీఓ ద్వారా రూ.21 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఐపీఓ సబ్స్క్రిప్షన్కు ఆరు రోజులు గడువు ఇచ్చారు. అయితే, ఐపీఓకు కేవలం మూడు రెట్లు మాత్రమే స్పందన వచ్చింది. దీనికితోడు లిస్టయిన తొలిరోజే నష్టాలు చవిచూడడం సెంటిమెంట్ను దెబ్బతీసిందని చెప్తున్నారు. దీనివల్ల కరెక్షన్కు గురైన ప్రతిసారీ ఈ తరహా కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి సహజం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
- అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారం ఎఫెక్ట్ కూడా ఎల్ఐసీ షేరు ధర పెరగకపోవడానికి కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. హిండెన్బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎల్ఐసీ పెట్టుబడుల విలువ సైతం పడిపోయింది. ఆ ప్రభావం ఎల్ఐసీ స్టాక్ ధరపై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత