Oneplus Mobiles: వన్ప్లస్ నుంచి త్వరలో మరో రెండు ఫోన్లు.. ఎలా ఉండబోతున్నాయ్?
వన్ ప్లస్ 10R బేస్ వేరియంట్ మాత్రం 80W సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానుంది
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్ ప్లస్.. ఏప్రిల్ 28న జరగబోయే ‘మోర్ పవర్ టు యూ’ ఈవెంట్లో తన సరికొత్త వన్ ప్లస్ 10R 5G, వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 Lite 5G మోడల్స్ను ఆవిష్కరించనున్నట్లు ధ్రువీకరించింది. వన్ప్లస్ 10R 5G స్మార్ట్ ఫోన్లో 150W సూపర్ వూక్ ఛార్జింగ్ టెక్నాలజీని అందిస్తోంది. ఇది 0 నుంచి 100 శాతం బ్యాటరీని కేవలం 17 నిమిషాల్లో ఛార్జ్ చేయగలదని కంపెనీ తెలిపింది. అయితే, వన్ ప్లస్ 10R బేస్ వేరియంట్ మాత్రం 80W సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్తో రానుంది.
ఇక వన్ప్లస్ నార్డ్ సీఈ 2 Lite 5G మొబైల్, 5000 mAh బ్యాటరీతో పాటు 33W సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్తో అందుబాటులోకి రానుంది. ఇది బ్యాటరీని 0 నుంచి 50 శాతం వరకు కేవలం 30 నిమిషాల్లో ఛార్జ్ చేయగలదని సంస్థ పేర్కొంది. మిగిలిన ఫీచర్స్పై సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయనప్పటికీ, టెక్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. వన్ ప్లస్ నార్డ్ సీఈ-2 Lite 5G మొబైల్ 90Hz రిఫ్రెష్ రేట్తో 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంటుందని, ఇందులో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ను అమర్చినట్లు, ఇది ఆండ్రాయిడ్ 11తో పాటు ఆక్సిజన్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనున్నట్లు తెలుస్తోంది.
అలాగే, ఇది రెండు వేరియంట్లలో (6GB ర్యామ్ / 64GB ఇంటర్నల్ మెమొరీ, 8GB ర్యామ్ / 128GB ఇంటర్నల్ మెమొరీ) రానున్నట్లు తెలుస్తోంది. ఇక కెమెరా విషయానికి వస్తే, 64MP మెయిన్ కెమెరాతో పాటు 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అలాగే, వెనుకవైపు మరో రెండు మాక్రో, డెప్త్ సెన్సార్లు కూడా ఉండే అవకాశం ఉంది. వన్ ప్లస్ 10 Pro 5G మొబైల్ను మార్చి 31న భారత్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా వన్ ప్లస్ R సిరీస్ లో దాని తదుపరి ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను వన్ప్లస్ ఆవిష్కరించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..