GST: గుర్రపు పందేలు, క్యాసినోలపై జీఎస్టీ ఎంత వేద్దాం?.. మే 2న మంత్రుల కమిటీ చర్చ
క్యాసినోలు, రేస్ కోర్సులు, ఆన్లైన్ గేమింగ్లపై జీఎస్టీకి సంబంధించిన అంశాలపై మంత్రుల కమిటీ మే 2న చర్చించనుంది.....
దిల్లీ: క్యాసినో (casinos), గుర్రపు పందేలు (race courses), ఆన్లైన్ గేమింగ్ (online gaming)పై జీఎస్టీ (GST) రేట్ల నిర్ధారణకు కేంద్ర ఆర్థిక శాఖ, జీఎస్టీ కౌన్సిల్ (GST Council) ఓ మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలో మే 2న దిల్లీలో సమావేశం కానుంది. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఉత్తర్ప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా సహా మరికొన్ని రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
* భారతదేశంలోని క్యాసినోలు (casinos), రేస్ కోర్సులు (race courses), ఆన్లైన్ గేమింగ్ (online gaming)లపై జీఎస్టీ (GST)కి సంబంధించిన అంశాలపై ఈ కమిటీ చర్చించనుంది. వీటి సేవల విలువను అంచనా వేయనుంది. కాసినోలో నిర్దిష్ట లావాదేవీలపై పన్ను విధించే అంశాన్ని కూడా మంత్రుల బృందం పరిశీలించనుంది.
* సంబంధిత విషయాలపై చట్టపరమైన నిబంధనలు, కోర్టు ఆదేశాలను మంత్రుల బృందం పరిగణనలోకి తీసుకోనుంది. అలాగే కాసినోలు (casinos), రేస్ కోర్సులు (race courses), ఆన్లైన్ గేమింగ్ (online gaming)లకు సంబంధించి రూపొందించే కొత్త మదింపు పద్ధతులను అమలు చేయడానికి ఇప్పటికే ఉన్న చట్టాల్లో సాధ్యమయ్యే మార్పులపై కూడా కమిటీ సిఫార్సులు చేయనుంది.
* కమిటీ అందించబోయే సిఫార్సులపై జీఎస్టీ మండలి (GST Council) తుది నిర్ణయం తీసుకుంటుందని గోవా మంత్రి మౌవిన్ గోడిన్హో తెలిపారు. ఈ నాలుగు కేటగిరీల్లో స్థూల గేమింగ్ రాబడి ప్రకారం పన్ను విధించాలని వచ్చిన పలు ప్రతిపాదనలను కమిటీ పరిశీలిస్తుందని వెల్లడించారు.
* ఈ నాలుగు అంశాల్లో సేవల విలువను లెక్కగట్టే పద్ధతుల నిర్వహణ, వాటి ప్రత్నామ్నాయాలపై మంత్రుల బృందం మే 2న జరిగే సమావేశంలో చర్చించనుంది. దీనివల్ల లాటరీ వంటి ఇతర సేవలపై ఎలాంటి ప్రభావం ఉండనుందో కూడా అంచనా వేయనుంది.
* ఇదే విషయంపై జనవరి 2019లోనూ ఓ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. క్యాసినోలు, గుర్రపు పందేలు, ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ వంటి వాటిపై జీఎస్టీ (GST) రేటు, వాటి సేవల మదింపులో ఉన్న సమస్యలను ‘లా కమిటీ/ఫిట్మెంట్ కమిటీ’కి పంపి ఆపై నిర్ణయం తీసుకోవాలని అప్పట్లో సూచించింది. తర్వాత వారి సూచనలపై నేరుగా జీఎస్టీ మండలి లేదా ఆర్థికశాఖ ఆమోదంతో నిర్ణయం తీసుకోవాలని కోరింది.
* జూన్ 21 2019న జరిగిన 35వ, అదే ఏడాది సెప్టెంబర్ 20న జరిగిన 37వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ అంశాలు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి.
* ఈ నాలుగు కేటగిరీల్లో సేవల విలువను అంచనా వేసే పద్ధతి, ముఖ విలువను నిర్ణయించే విధానం, అలాగే ఎంత మొత్తం పందెంపై పన్ను విధించాలన్న విషయాలను లా కమిటీకి సూచించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఎంత మేర పన్ను విధించాలన్న అంశాన్ని ఫిట్మెంట్ కమిటీకి సిఫార్సు చేయాలని నిర్ణయించారు.
* సెప్టెంబరు 2019లో జరిగిన సమావేశంలో, గుర్రపు పందేలపై పన్ను వేయడాన్ని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించే ప్రతిపాదనను ఫిట్మెంట్ కమిటీ పరిగణించింది. అలాగే గుర్రపు పందెంలో పన్ను విధించదగిన విలువ నుంచి ప్రైజ్ మనీని మినహాయించాలన్న విషయాన్ని పరిశీలించింది.
* మరోవైపు జీఎస్టీ (GST) రేట్ల హేతుబద్ధీకరణ కోసం కేంద్ర ఆర్థికశాఖ మరో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. జీఎస్టీ మండలికి పంపాల్సిన తుది నివేదికను ఇంకా ఇది ఖరారు చేయాల్సి ఉంది. జీఎస్టీ రేట్ల నిర్ధారణపై తుది నిర్ణయం జీఎస్టీ మండలిదే (GST Council) అయినప్పటికీ.. ఏ వస్తువులు ఏ పన్ను పరిధిలో ఉండాలన్నది పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించే రాజకీయపరమైన అంశం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్