Car Sales: కార్ల కంపెనీల వద్ద ఆర్డర్లే.. ఆర్డర్లు!
Car sales: కార్ల కొనుగోళ్లకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. వివిధ కంపెనీల వద్ద ప్రస్తుతం 6,53,000 యూనిట్లకు ఆర్డర్లు అందాయి. ఇది నెలవారీ సగటు విక్రయాలతో పోలిస్తే 2-2.5 రెట్లు అధికం.
ఇంటర్నెట్ డెస్క్: ఓవైపు ధరలు పెరిగి సామాన్యులు అల్లాడిపోతున్నారు. మరోవైపు రూపాయి పతనమై స్టాక్ మార్కెట్లు, దిగుమతులపై ఆధారపడిన వ్యాపారాలు ఆందోళన చెందుతున్నాయి. కరోనాతో కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు ఇవన్నీ అడ్డంకిగా మారడంతో ప్రభుత్వం ఏం చేయాలో వ్యూహప్రతివ్యూహాలు రచిస్తోంది. మరోవైపు కమొడిటీ ధరలు పెరిగి కంపెనీలు ఉత్పత్తుల ధరల్ని పెంచుతున్నాయి. ఈ క్రమంలో వాహన తయారీ సంస్థలు సైతం 2022 ఆరంభం నుంచి పలుసార్లు వాహనాల ధరల్ని పెంచాయి. అయినా... కార్లకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. వివిధ కంపెనీల వద్ద ప్రస్తుతం 6,53,000 యూనిట్లకు ఆర్డర్లు రెడీగా ఉన్నాయి. ఇది నెలవారీ సగటు విక్రయాలతో పోలిస్తే 2-2.5 రెట్లు అధికం.
- అత్యధికంగా మారుతీ సుజుకీ వద్ద 3.22 లక్షల కార్లకు ఆర్డర్లు ఉన్నాయని ఆ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. వచ్చే రెండున్నర నెలల్లో వీటన్నింటినీ వినియోగదారులకు డెలివరీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. అయితే, కొత్తగా వచ్చే ఆర్డర్ల మీద కూడా ఇది ఆధారపడి ఉంటుందని తెలిపారు.
- ఇతర కార్ల కంపెనీలకు కూడా భారీ స్థాయిలోనే బుకింగ్లు అందాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా 1.30 లక్షల కార్లను డెలివరీ చేయాల్సి ఉందని ఆ సంస్థ డైరెక్టర్ తరుణ్ గార్గ్ వెల్లడించారు.
- మహీంద్రా అండ్ మహీంద్రా 1.46 లక్షల యూనిట్లను వినియోగదారులకు అందించాల్సి ఉందని ఆ కంపెనీ ఈ నెలారంభంలో పేర్కొంది.
- లగ్జరీ కార్లకు సైతం డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. మెర్సిడెజ్ బెంజ్ తమ ఆర్డర్ బుక్ 5000 యూనిట్లుగా ఉందని గతవారం ప్రకటించింది. ఇతర కంపెనీలు ఆర్డర్ల వివరాలు వెల్లడించనప్పటికీ.. వాటి వద్ద కూడా 50 వేల కార్లకు ఆర్డర్లు ఉండి ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
- ప్రపంచ వాహన మార్కెట్లో భారత్ది ఐదో స్థానం. కొవిడ్ తర్వాత వ్యక్తిగత ప్రయాణాలకు ప్రజలు మొగ్గుచూపుతుండడంతో ప్యాసెంజర్ వెహికల్స్కు డిమాండ్ పెరిగింది. కానీ, తయారీ సంస్థలు మాత్రం డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయలేకపోతున్నాయి. సెమీకండక్టర్ల కొరత, సరఫరా వ్యవస్థల్లో లోపాలు, కమొడిటీ ధరల పెరుగుదల అడ్డంకిగా మారాయి.
- ఇటీవల పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. సెమీకండక్టర్ల సరఫరాలో ఇబ్బందులు క్రమంగా గాడినపడుతున్నాయి. దీంతో వాహన తయారీ సంస్థలు ఉత్పత్తిలో వేగం పెంచాయి. తయారీ కేంద్రాల సామర్థ్యాన్ని ప్రస్తుతానికి 95 శాతానికి పెంచడం విశేషం. డిమాండ్కు అనుగుణంగా ఆయా మోడళ్లు, వేరియంట్ల ముందస్తు తయారీకి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
- బ్యాలెనో, బ్రెజా.. వంటి డిమాండ్ అధికంగా ఉండే కార్లను తయారు చేస్తోన్న మారుతీసుజుకీ ఈ నెల 1.88 లక్షల కార్ల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 2018-19 తర్వాత ఇదే అత్యధికం. సెమీకండక్టర్ల లభ్యత పెరుగుతున్న కొద్దీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నామని శ్రీవాస్తవ తెలిపారు. గత సెప్టెంబరులో మారుతీ తయారీ సామర్థ్యం 40 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే.
- కార్లు సహా ఇతర వాహనాల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ చిప్ల తయారీలో పెట్టుబడులు భారీగా పెంచనున్నట్లు ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ల తయారీ సంస్థ టీఎస్ఎంసీ వెల్లడించింది. సాధారణంగా ఈ కంపెనీ అత్యాధునిక చిప్స్ తయారీకి అధిక ప్రాధాన్యమిస్తుంది.
- కొత్త మోడళ్ల రాక, పండగ సీజన్, ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల వినియోగదారుల కొనుగోలు ప్రాధాన్యాలు మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొన్ని ప్రత్యేక మోడళ్ల కోసం ఏకంగా 18 నెలల పాటు వేచి చూడాల్సి వస్తోంది. దీంతో ఇప్పుడు కొనుగోళ్ల ప్రాథమ్యాల్లో రంగు, వేరియంట్, ఫీచర్లతో పాటు లభ్యత కూడా చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. -
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) క్రెటా ఎన్లైన్ను హ్యుందాయ్ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించారు. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
Automobile Sales: ఫిబ్రవరి వాహన విక్రయాల్లో 13% వృద్ధి
Automobile Sales: ఫిబ్రవరిలో వాహన విక్రయ గణాంకాలను ఫాడా గురువారం వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన గత నెలలో 13 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు