9 నెలల్లో 52 లక్షల మంది చేరారు
ఈ పెన్షన్ పథకాన్ని ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్) పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్డిఎ) నిర్వహిస్తుంది
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్డిఎ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఈ పెన్షన్ పథకంలో 2020 డిసెంబర్ 31 వరకు 52 లక్షలకు పైగా కొత్త చందాదారులు చేరారు. దీనితో మొత్తం నమోదు 2.75 కోట్ల మైలురాయిని దాటింది. 2020-21 మధ్యకాలంలో కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ద్వారా 15 లక్షలకు పైగా కొత్త చందాదారులు అటల్ పెన్షన్ యోజన (ఎపివై) లో చేరారు.
భారత పౌరులు, 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న ఏ వ్యక్తి అయినా అటల్ పెన్షన్ యోజనకు అర్హులు. అటల్ పెన్షన్ పథకం ఐదు స్థిర నెలవారీ పెన్షన్ ఎంపికలను అందిస్తుంది. వెయ్యి రూపాయల నుంచి రూ.5 వేల వరకు డిపాజిట్ చేయవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా సవాళ్లు ఎదురైనప్పటికీ, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 52 లక్షలకు పైగా కొత్త చందాదారులను చేరడం విశేషం.
అటల్ పెన్షన్ యోజన ప్రభుత్వ హామీ పెన్షన్ పథకం. ఇందులో చేరితే 60 ఏళ్ల వయసు తర్వాత చందాదారులకు మూడు రెట్ల ప్రయోజనాలను అందిస్తుంది. చందాదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి అదే హామీ పెన్ష్ లభిస్తుంది, వారి నామినీలకు 60 సంవత్సరాల వయస్సు వరకు జమ చేసిన పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్ పథకాన్ని ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్) పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్డిఎ) నిర్వహిస్తుంది.
జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రచారాలు, బ్యాంకర్లతో నిరంతరం పాల్గొనడం, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బిసి) సమావేశాల్లో పాల్గొనడం, మీడియా ద్వారా ప్రచారం , ఎపివై డిజిటల్ ఆన్-బోర్డింగ్ను ప్రవేశపెట్టడం ద్వారా ఈ పథకాన్ని ప్రాచుర్యం పొందే ప్రయత్నాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామని పిఎఫ్ఆర్డిఏ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!