OYO: ఓయోకు తొలిసారి త్రైమాసిక లాభాలు.. సీఈఓ రితేశ్
OYO భవిష్యత్ వృద్ధి సైతం మెరుగ్గా కనిపిస్తోందని ఓయో సీఈఓ రితేశ్ అగర్వాల్ తెలిపారు. యూఎస్, యూకేలో సరికొత్త సాంకేతికతల అమలు ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు వెల్లడించారు.
దిల్లీ: ఓయో (OYO) పేరిట హోటల్స్ను నిర్వహిస్తున్న ‘ఒరావెల్ స్టేస్ లిమిటెడ్’ తొలిసారి లాభాలను నివేదించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరుతో ముగియనున్న త్రైమాసికంలో సంస్థ పన్నేతర లాభాలు రూ.16 కోట్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ రితేశ్ అగర్వాల్ స్వయంగా ఉన్నతోద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు ఈ విషయంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.
ఓయో (OYO) ఈ ఏడాది పదో వసంతంలోకి అడుగుపెట్టిందని రితేశ్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ శుభ సందర్భానికి అనుగుణంగానే కంపెనీ తొలిసారి త్రైమాసిక లాభాలను నమోదు చేయబోతుందని వెల్లడించారు. అలాగే భవిష్యత్ వృద్ధి సైతం మెరుగ్గా కనిపిస్తోందని తెలిపారు. యూఎస్, యూకేలో సరికొత్త సాంకేతికతల అమలు ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల విడుదలైన వార్షిక నివేదిక ప్రకారం.. కంపెనీ కార్యకలాపాల ఆదాయం 2022- 23లో రూ.5,463 కోట్లకు చేరినట్లు తెలిపారు. క్రితం సంవత్సరం నమోదైన రూ.4,781 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధి రికార్డయినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 పైన నిఫ్టీ
Stock Market Opening bell | ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 217 పాయింట్లు పెరిగి 69,513 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 20,936 వద్ద ట్రేడవుతోంది. -
Rapido: క్యాబ్ సేవల విభాగంలోకి ర్యాపిడో
రైడ్ సేవలు అందించే ర్యాపిడో, క్యాబ్ సేవల విభాగంలోకి అడుగుపెట్టినట్లు ప్రకటించింది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్ వంటి సంస్థలతో ర్యాపిడో పోటీపడనుంది. -
Gold: తనఖా బంగారం పోతే బ్యాంకుదే బాధ్యత
ఆర్థిక అవసరాలు వస్తే ఇంట్లోని బంగారు ఆభరణాలను తనఖా పెట్టి, నగదు అప్పు తెచ్చుకోవడం సులభమైన మార్గం. -
టెక్ ప్రపంచానికి హైదరాబాదీ ఉత్పత్తులు
ఇంటర్నెట్ కూడా సరిగా లేని రోజుల్లో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్, మనదేశంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం నిజంగా సాహసమే. అప్పటికి, వేరే ప్రాంతం నుంచి సాఫ్ట్వేర్ ఉత్పత్తి ప్రక్రియను అమెరికాలోని ప్రధాన కార్యాలయంతో ఎలా అనుసంధానించాలనే విషయంపైనా స్పష్టత లేదు. -
ఈడీ చర్యలతో ప్రభుత్వ బ్యాంకులకు రూ.15,183 కోట్లు వెనక్కి
మనీ లాండరింగ్ నిరోధక చట్టాల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసిన రూ.15,186.64 కోట్లలో దాదాపు అంతా ప్రభుత్వ రంగ బ్యాంకులకు వెనక్కి ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు. -
21,791 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు గుర్తించాం
జీఎస్టీ అధికారులు రెండు నెలల పాటు (ఈ ఏడది మే 16 నుంచి జులై 15 వరకు) నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 21,791 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు గుర్తించారని, రూ.24,000 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లుగా తేల్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
69,000 శిఖరంపై సెన్సెక్స్
వరుసగా ఆరో రోజూ లాభపడిన సెన్సెక్స్, నిఫ్టీ కొత్త గరిష్ఠాలకు చేరాయి. విద్యుత్, బ్యాంకింగ్, యుటిలిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్ 69,000 పాయింట్ల ఎగువన ముగిసింది. -
2030కి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
భారత్ 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. 2023-24లో దేశ జీడీపీ వృద్ధి 6.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. -
ఏఏఏఐ అధ్యక్షుడిగా ప్రశాంత్ కుమార్ మళ్లీ ఎన్నిక
2023-24 ఏడాదికి అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) అధ్యక్షుడిగా గ్రూప్ ఎం మీడియా (ఇండియా) ప్రై.లి. దక్షిణాసియా సీఈఓ ప్రశాంత్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. -
అదానీ గ్రూపు చేతికి సంఘీ ఇండస్ట్రీస్
సంఘీ ఇండస్ట్రీస్ను గౌతమ్ అదానీకి చెందిన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ స్వాధీనం చేసుకుంది. ఒక్కో షేరుకు రూ.121.90 చొప్పున చెల్లించి, ఈ లావాదేవీని పూర్తి చేసింది. -
వినియోగ బైక్ల వ్యాపారంలోకి రాయల్ ఎన్ఫీల్డ్
మోటార్సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా వినియోగ (ప్రీ-ఓన్డ్) బైక్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘రీఓన్’ పేరుతో ఈ వ్యాపారాన్ని నిర్వహించనుంది. -
ఎన్ఎస్ఈ నుంచి మరో కొత్త సూచీ
ఎన్ఎస్ఈకి చెందిన సూచీల సేవల అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండిసెస్.. నిఫ్టీ 50 సూచీలో కొత్త రకం సూచీని తీసుకొచ్చింది. ‘నిఫ్టీ 50 నెట్ టోటల్ రిటర్న్ సూచీ’గా దీనిని వ్యవహరిస్తారు. -
యూకో బ్యాంక్ ఖాతాదారుల్లో డబ్బుల జమ కేసులో సీబీఐ తనిఖీలు
యూకో బ్యాంకుకు చెందిన 41,000 మంది ఖాతాదార్ల ఖాతాల్లోకి మొత్తంగా రూ.820 కోట్లు జమ అయిన వ్యవహారంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. -
సంక్షిప్త వార్తలు(7)
గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే సంస్థ గ్రాఫైట్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గోడి ఇండియా అనే సంస్థలో 31% వాటా కొనుగోలు చేస్తోంది. -
Steve Jobs: స్టీవ్ జాబ్స్ సంతకం.. రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు..!
Steve Jobs: యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన 47 ఏళ్ల నాటి చెక్కు రూ.20లక్షలకు పైగా అమ్ముడుపోయే అవకాశం ఉందని ‘ఆర్ఆర్ ఆక్షన్స్’ సంస్థ వెల్లడించింది.


తాజా వార్తలు (Latest News)
-
Mahadev app: మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి
-
Revanth Reddy: ఖర్గే, కేసీ వేణుగోపాల్తో రేవంత్ భేటీ
-
Rains: తుపాను ప్రభావం.. ఏపీలో కొనసాగుతున్న వర్షాలు
-
Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 పైన నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Vo5G: ఫోన్లో వో5జీ ఉందా?