Russian crude: 50 డాలర్లకే పాక్కు రష్యా చమురు?
Russian crude: బ్యారెల్ ముడి చమురును 50 డాలర్లకే కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ (Pakistan) చర్చలు జరుపుతున్నట్లు ఇరు దేశాల్లోని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ (Pakistan).. రష్యా నుంచి చాలా తక్కువ ధరకే చమురును కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రష్యా చమురు (Russian Oil)పై జీ7 దేశాలు విధించిన పరిమితి కంటే కూడా తక్కువకే కొనేందుకు చర్చలు జరుపుతోందని సమాచారం. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాకు వ్యతిరేకంగా ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే చమురుపై జీ7 దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో తక్కువ ధరకే చమురును విక్రయించేందుకు రష్యా ముందుకు వచ్చింది. భారత్ సైతం రాయితీ ధరకు రష్యా (Russia) నుంచి భారీ ఎత్తున చమురును దిగుమతి చేసుకుంటోంది.
బ్యారెల్ ముడి చమురును 50 డాలర్లకే కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ (Pakistan) చర్చలు జరుపుతున్నట్లు ఇరు దేశాల్లోని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. జీ7 దేశాలు విధించిన పరిమితి కంటే ఇది 10 డాలర్లు తక్కువ. అధిక మొత్తంలో విదేశీ అప్పులు, మారక నిల్వల కొరత, దేశీయ కరెన్సీ విలువ పతనం వంటి ఆర్థిక సమస్యలతో పాక్ సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చమురు దిగుమతి ఆ దేశానికి పెద్ద భారంగా పరిణమించింది. దాన్ని తగ్గించుకోవడానికి వీలైనంత తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
నిజానికి పాక్ చాలా కాలం క్రితమే రష్యా (Russia)తో చర్చలు జరుపుతోంది. కానీ, పాక్ ఆర్థిక పరిస్థితిని గమనించిన రష్యా.. చెల్లింపులపై కచ్చితమైన హామీ వచ్చే వరకు ఒప్పందం ఖరారుకు ముందుకు రాలేదు. కానీ, పాక్కు ఇప్పుడు గత్యంతరం లేకపోవడంతో రష్యా కోరిన షరతులన్నింటినీ సంతృప్తి పరిచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా ముందు ఒక చమురు నౌకను పాక్కు పంపాలని రష్యా నిర్ణయించింది. చెల్లింపులు, ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులన్నింటి విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకపోతే పూర్తి స్థాయి ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ మేరకు రష్యా నుంచి బయలుదేరనున్న తొలి చమురు నౌక వచ్చే నెలాఖరుకు పాకిస్థాన్ చేరే అవకాశం ఉంది. అది సజావుగా సాగితే దీర్ఘకాల ఒప్పందం ఖరారు కావొచ్చు. రష్యా నౌకాశ్రయాల నుంచి పాక్కు చమురును చేర్చడానికి కనీసం 30 రోజుల సమయం పడుతుంది. దీంతో రవాణా ఖర్చుల రూపంలో ఒక్కో బ్యారెల్పై అదనంగా 10-15 డాలర్లు పెరుగుతుంది. పాకిస్థాన్ యూఎస్ డాలర్ల కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. రష్యాకు మిత్రదేశాల కరెన్సీల్లో చెల్లింపులు చేసే అవకాశం ఉందని సమాచారం. సౌదీ అరేబియా, చైనా, యూఏఈ కరెన్సీల్లో చెల్లింపులు ఉండొచ్చని తెలుస్తోంది.
కొన్ని వారాల క్రితం పాకిస్థాన్ మారక నిల్వలు 2.9 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇటీవల అవి తిరిగి 4 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఐఎంఎఫ్ నుంచి 1.1 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ కోసం పాక్ వేచిచూస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పలు దఫాల్లో చర్చలు జరిగాయి. ఐఎంఎఫ్ విధించిన పలు షరతులను సైతం పాకిస్థాన్ ఇప్పటికే అమలు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?