పాక్షిక లాక్డౌన్ : వాటిపై ప్రభావం
పాక్షిక లాక్డౌన్ చర్యల వల్ల కూలీలు, వస్తువుల రవాణాపై ప్రభావం ఉంటుందని సీఐఐ సర్వేలో తెలిపింది....
న్యూదిల్లీ: పాక్షిక లాక్డౌన్ చర్యల వల్ల కూలీలు, వస్తువుల రవాణాపై ప్రభావం ఉంటుందని సీఐఐ సర్వేలో తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు నివారణ చర్యలకు ఉపక్రమించాయి. ఇందులో భాగంగా పలు ఆంక్షలు విధించాయి. రాత్రి కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్, మాస్క్ లేకుండా తిరిగే వారికి భారీ జరిమానా విధించడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. పలు రాష్ట్రాలు పాక్షిక లాక్డౌన్వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే, ఇలాంటి చర్యల వల్ల కూలీలను తరలించడం, వస్తు రవాణాపై ప్రభావం పడుతుందని అత్యధికమంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. దీని వల్ల పారిశ్రామికోత్పత్తిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పాక్షిక లాక్డౌన్ కారణంగా కూలీలను సమకూర్చుకోవడం ఇబ్బందిగా మారుతుందని ఇది తమ సంస్థల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని సగానికి పైగా సీఈవోలు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. దీని వల్ల సగానికి పైగా ఉత్పత్తి పడిపోతుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు