పెట్టుబడి చేయడంలో ఇదొక పద్ధతి
పెట్టుబడులు చేసే విషయంలో వారెన్ బఫెట్ అనుసరించే పద్ధతి దీర్ఘాకాల వ్యూహం.....
పెట్టుబడులు చేసే విషయంలో వారెన్ బఫెట్ అనుసరించే పద్ధతి దీర్ఘాకాల వ్యూహం.
మదుపర్లు క్రియాశీలకంగా (యాక్టివ్) చేసే పెట్టుబడులు, నిష్ర్కియగా (ప్యాసివ్) చేసే పెట్టుబడులు రెండు మార్గాల్లో పెట్టుబడులు చేయవచ్చు. సాధారణంగా నిష్ర్కియ అనగానే గుర్తొచ్చేది ఈటీఎఫ్ లు, ఇండెక్స్ ఫండ్లు. వీటి పెట్టుబడి విధానంలో ఏవిధమైన షేర్లను ఎంపిక చేసుకోకుండా ఏదైనా ఒక ఇండెక్స్ అనుకరించి పెట్టుబడులు చేయడం. అయితే మదుపర్లు లావాదేవీలు తరచూ చేయకుండా ఒక సారి పెట్టుబడి చేసి దీర్ఘకాలం పాటు కొనసాగించే పెట్టుబడి శైలి గురించి తెలుసుకుందాం. దీర్ఘకాలం పెట్టుబడులు చేసే విషయంలో వారెన్ బఫెట్ అనుసరించే పద్ధతి దీర్ఘకాల వ్యూహం. ఆయన తన పెట్టుబడులను దీర్ఘకాలంపాటు కొనసాగించడం ద్వారా ఎక్కువ రాబడి పొందవచ్చని విశ్వసిస్తారు. దీని వల్ల పెట్టుబడుల లావాదేవీలు చేసేందుకు అయ్యే ట్రాన్సాక్షన్ ఛార్జీలు తగ్గుతాయి. ఎక్కువ మంది తక్కువ నష్టభయం తీసుకునే మదుపర్లు ఈ విధంగా పెట్టుబడులు చేసేందుకు మొగ్గు చూపుతారు.
నిష్ర్కియ విధానం ద్వారా మదుపర్లకు కలిగే ప్రయోజనాలు:
- అంచనా వేయవచ్చు
ఈ విధానంలో మార్కెట్ సూచీలు నిఫ్టీ లేదా సెన్సెక్స్ ఆధారంగా ఉంటుంది కాబట్టి వీటి ద్వారా రాబడిని అంచనా వేయడం కుదురుతుంది. ప్యాసివ్ ఫండ్ల ఉద్దేశం మార్కెట్ సూచీ కంటే ఎక్కువ రాబడి ని పొందడం కాదు ఆ సూచీకి దగ్గరగా రాబడి పొందడమే లక్ష్యం. ఫండ్ మేనేజర్లు చేసే క్రియాశీలక ఫండ్ల కంటే కూడా గత కొన్నేళ్లుగా మార్కెట్ స్థితిని గమనించి సూచీలను అంచనా వేయడం సాధ్యమవుతుంది.
- బెంచ్ మార్క్ను దాటినవే
మదుపర్లు ఎక్కువ శాతం రాబడి పొందాలని ఉద్దేశ్యంతో తరచూ షేర్లు కొనుగోలు, అమ్మకం చేస్తుంటారు. అయితే దీని మూలంగా కచ్చితంగా మంచి రాబడి వస్తుందనేది చెప్పలేం. దీంతో కొంత నష్టభయం ఉంటుంది. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ల ప్రధాన ఉద్దేశం ఇండెక్స్ ను మించి రాబడి సాధించడమే. అయితే కొన్ని యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లు ఇండెక్స్ ను మించి రాబడి సాధించలేకపోవడం మనం చూస్తున్నాం.
- నిర్వహణ వ్యయం తక్కువ
నిష్ర్కియ ఫండ్ల నిర్వహణ రుసుం యాక్టివ్ ఫండ్ల కంటే తక్కువగా ఉంటుంది. పెట్టుబడి విధానంలో ఏవిధమైన షేర్లను ఎంపిక చేసుకోకుండా ఏదైనా ఒక ఇండెక్స్ అనుకరించి పెట్టుబడులు చేయడంతో నిర్వహణ రుసుం బాగా తగ్గుతుంది.
- నిర్ణయం సులభంగా తీసుకోవచ్చు
ఇవి మార్కెట్ సూచీ లేదా ఏదైనా రంగానికి చెందిన సూచీని అనుకరిస్తుంటాయి. యాక్టివ్ ఫండ్లలా వీటిలో పోల్చిచూసుకోవడానికి ఏమీ ఉండదు. ఏ సూచీలో పెట్టుబడి చేద్దామనేది నిర్ణయించుకుంటే సరిపోతుంది.
- ఆర్థిక ప్రణాళికకు సరిపోతుంది
నిష్ర్కియ పెట్టుబడి విధానంలో క్రయవిక్రయాలు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలం పాటు కొనసాగించే పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది కాబట్టి ఆర్థిక ప్రణాళికలో దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుకూలంగా ఉంటాయి.
మదుపర్లు తమ నష్టభయం, లక్ష్యం ఆధారంగా ఈ విధానంలో పెట్టుబడులు ఎంచుకోవాలి. ఈ విధానంలో పెట్టుబడికి నష్టభయం తక్కువగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో రాబడి సాధించే ఉద్దేశంతో కాకుండా దీర్ఘకాలంలో స్థిరంగా ఉండి మంచి రాబడి అందించేలా ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్