పేమెంటు బ్యాంకులు.. చిటికెలో చెల్లింపులు
బ్యాంకింగ్ రంగానికి సాంకేతికను జోడించి తీర్చిదిద్దిన వినూత్నమైన బ్యాంకింగ్ విధానాలను పేమెంట్ బ్యాంకుతో వినియోగదారులు పొందవచ్చు..
ప్రతీ ఒక్కరికీ బ్యాంకు సేవలను అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో చెల్లింపుల (పేమెంట్స్) బ్యాంకులను రూపొందించారు. చిన్న మొత్తాల్లో లావాదేవీలు చేసేందుకు వీలుగా ఉంటాయి. పేమెంట్ బ్యాంకులలో చెల్లింపుల సదుపాయంతో పాటు పొదుపు సంబంధిత అంశాలు కూడా ఉంటాయి. వీటితో సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని పరిమితమైన సదుపాయాలు మాత్రమే ఉంటాయి. ఖాతాదార్లకు రుణాలు, క్రెడిట్ కార్డు సదుపాయం ఉండదు. కాబట్టి ఈ బ్యాంకులకు క్రెడిట్ రిస్కు బెడద ఉండదు. సాధారణ బ్యాంకులానే ఇవి కూడా రిజర్వుబ్యాంకు పర్యవేక్షణలో ఉంటాయి.
లక్షిత ప్రజలు ఎవరంటే
ప్రత్యేకంగా చిరు వ్యాపారాలు, తక్కువ ఆదాయం వర్గానికి చెందిన ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించేందుకు రిజర్వుబ్యాంకు చెల్లింపుల బ్యాంకులను వీటిని రూపొందించింది. బ్యాంకు సదుపాయం లేని మారుమూల ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించేందుకు చెల్లింపు బ్యాంకులు ఉపకరిస్తాయి. ఇంటర్నెట్ సదుపాయం ఉన్నమొబైల్ తో సులభంగా లావాదేవీలు చేయవచ్చు.
పేమెంటు బ్యాంకులతో కలిగే ప్రయోజనాలు
- మదుపర్ల సేవింగ్సు ఖాతాలో సొమ్ముకు వడ్డీ ఉంటుంది. చెక్కు బుక్, ఏటీఎమ్ సదుపాయం ఉంటుంది.
- లావాదేవీలు రూ.1,00,000 వరకూ చేసే అవకాశం ఉంటుంది. వినియోగదారుల నగదుకు వడ్డీ ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యాంకులు వినియోగదార్ల సేవింగ్సు ఖాతాలో ఉండే నగదుపై మంచి వడ్డీరేటు ను అందిస్తున్నాయి.
- ఇటు ఆన్లైన్ కొనుగోళ్లు డిజిటల్ చెల్లింపులుకు వీలుగానూ, అటు బ్యాంకు ఖాతాలానూ ఉపయోగించుకోవచ్చు.
- బ్యాంకులలానే వీటి కార్యాలయాలు పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి.
- కొన్ని పేమెంటు బ్యాంకులైతే వినియోగదార్లకు ఉచితంగా వ్యక్తిగత బీమా సదుపాయం కల్సిస్తున్నాయి.
- సులభంగా లావాదేవీలు చేసుకోవడంతో పాటు పేమెంటు బ్యాంకులు వినియోగదార్లకు కొన్ని రాయితీలు, రివార్డు పాయింట్లు ఇస్తున్నాయి. ఇది వినియోగదారులు చేసే లావాదేవీల ఆధారంగా ఉంటుంది. రివార్డు పాయింట్లను నగదుగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
- సాధారణ బ్యాంకుల లానే నగదు డిపాజిట్, విత్డ్రా చేసుకోవచ్చు.
- ప్రస్తుతం పేమెంటు బ్యాంకులు కొన్నివాణిజ్య సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీంతో ఆయా సంస్థలు వినియోగదార్లకు సంస్థలు కొన్నిప్రత్యేక రాయితీలు ఇస్తుంటాయి.
ఇతర బ్యాంకులతో అనుసంధానం
బ్యాంకింగ్ రంగానికి సాంకేతికను జోడించి తీర్చిదిద్దిన వినూత్నమైన ఈ పేమెంట్ బ్యాంకు ఖాతాను సాధారణ బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవచ్చు. దీంతో సులభంగా ఈ ఖాతాల మధ్య నగదు బదిలీ చేసుకోవచ్చు. పేమెంటు బ్యాంకులు సేవింగ్సు ఖాతాలో ఉండే నగదుకు మంచి వడ్డీని అందించడం ద్వారా వాణిజ్య బ్యాంకులకు పోటీగా నిలుస్తున్నాయి. అయితే పేమెంటు బ్యాంకులకు లావాదేవీల విషయంలో పరిమితులు ఉంటాయి.
పెరుగుతున్న పోటీ
రిజర్వుబ్యాంకు అనుమతితో ఇటీవలె ఎయిర్టెల్ , పేటీఎమ్ తదితర పేమెంటు బ్యాంకులు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఎక్కువ మంది ఖాతాదార్లను చేర్చుకునేందుకు వీటి మధ్య పోటీ పెరుగుతోంది. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు ఈ రంగలోకి ప్రవేశించే అవకాశం లేకపోలేదు. ఈ పరిమాణం వినియోగదార్లకు అనుకూలమనే చెప్పాలి. పేమెంటు బ్యాంకుల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో వినియోగదారులు మరిన్ని రాయితీలు పొందొచ్చు.
చివరగా…
చెల్లింపుల బ్యాంకులతో స్వల్ప ఆదాయం పొందే ప్రజలు, చిరు వ్యాపారులు సులభంగా లావాదేవీలు చేసుకునే సౌలభ్యం ఉంటుంది. వీటిని వినియోగించడం కూడా సులభం. సాధారణ ప్రజానికానికి అర్థమయ్యే విధంగానే ఉంటాయి. లావాదేవీలు చేసేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఖాతాకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచాలి. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్