Apple: ఐఫోన్ల తయారీకి భారత్లో పెగట్రాన్ మరో ఫ్యాక్టరీ!
Pegatron to open second factory: భారత్లో మరో ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు యాపిల్ ఫోన్లను తయారుచేసే సంస్థ పెగట్రాన్ కార్పొరేషన్ ప్రయత్నిస్తోంది. ఆ కంపెనీకిది భారత్లో రెండో ఫ్యాక్టరీ.
ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ ఫోన్లు (Apple) తయారు చేసే కంపెనీలు ఒక్కొక్కటిగా చైనా నుంచి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ సంస్థ భారత్లో తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తుండగా.. అదే దేశానికి చెందిన మరో సంస్థ పెగట్రాన్ కార్పొరేషన్ (Pegatron) సైతం భారత్లో తన రెండో ప్లాంట్ను తెరవాలని చూస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తమ ఉత్పత్తుల తయారీని చైనా వెలుపలికి తరలించాలన్న యాపిల్ భావిస్తున్న వేళ పెగట్రాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
పెగట్రాన్ (Pegatron) 150 మిలియన్ డాలర్లతో తమిళనాడులోని చెన్నైకి సమీపంలో తొలి యాపిల్ ఫోన్ల (Apple iphones) తయారీ కేంద్రాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసింది. గతేడాది సెప్టెంబర్లో తొలి ప్లాంట్ను నెలకొల్పింది. ఇక్కడే మరో ప్లాంట్ను నెలకొల్పి కొత్త ఐఫోన్లను అసెంబుల్ చేయనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలి ప్లాంట్కు దగ్గర్లోనే రెండో ప్లాంట్ నెలకొల్పేందుకు చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. అయితే, ఎంత మొత్తంతో చేపట్టేదీ తెలియనప్పటికీ.. మొదటి ఫ్యాక్టరీతో పోలిస్తే కాస్త చిన్న ప్లాంట్నే పెగట్రాన్ ఏర్పాటు చేయబోతోందని తెలిసింది. దీనిపై పెగట్రాన్ గానీ, యాపిల్ గానీ స్పందించలేదు.
భారత్లో గత కొన్నేళ్లుగా యాపిల్ ఉత్పత్తుల తయారీలో వేగం పుంజుకుంది. 2002 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య దాదాపు 9 బిలియన్ డాలర్ల స్మార్ట్ఫోన్లు మన నుంచి ఎగుమతి అయ్యాయి. మొత్తం ఐఫోన్లలో ఈ వాటా 50 శాతంతో సమానమని ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ తెలిపింది. భారత్లో యాపిల్ చేపడుతున్న తయారీలో 10 శాతం ఫోన్లను పెగట్రాన్ ఉత్పత్తి చేస్తోందని రీసెర్చి సంస్థ కౌంటర్పాయింట్ తెలిపింది. యాపిల్తో పాటు విస్ట్రన్, ఫాక్స్కాన్ సంస్థలు దేశంలో ఐఫోన్ల తయారీ చేపడుతున్నాయి. భారత్లో ఐప్యాడ్ ట్యాబ్లెట్లతో పాటు ఎయిర్పాడ్స్ను సైతం తయారు చేయాలని యాపిల్ భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య