Petrol Diesel Price: మళ్లీ పెరిగిన చమురు ధరలు.. హైదరాబాద్‌లో ‘వంద’ దాటిన డీజిల్‌

సామాన్యులపై పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉంది. దేశీయ చమురు కంపెనీలు తొమ్మిది రోజుల్లో ఎనిమిదో సారి పెట్రో ధరలను పెంచాయి. తెలంగాణలో

Published : 30 Mar 2022 08:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాన్యులపై పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉంది. దేశీయ చమురు కంపెనీలు తొమ్మిది రోజుల్లో ఎనిమిదో సారి పెట్రో ధరలను పెంచాయి. తెలంగాణలో లీటర్‌ పెట్రోల్‌పై మరో 90 పైసలు, డీజిల్‌పై 87పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.114.51, డీజిల్‌ రూ.100.70కి చేరింది. ఏపీలో లీటర్‌ పెట్రోల్‌పై 88పైసలు, డీజిల్‌పై 84పైసలు పెరిగింది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.116.25, డీజిల్‌ రూ.102.07, గుంటూరులో పెట్రోల్‌ రూ.116.45, డీజిల్‌ రూ.102.27కి చేరింది. వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని