వారంలో రెండోసారి తగ్గిన ఇంధన ధరలు!

దేశంలో ఇంధన ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోవడంతో దేశీయ

Published : 30 Mar 2021 10:46 IST

దిల్లీ: దేశంలో ఇంధన ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను స్వల్పంగా తగ్గించాయి.దేశవ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌పై 19-22 పైసలు, డీజిల్‌పై 21-23 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయించాయి.  కాగా, గత ఆరు రోజుల వ్యవధిలో దేశంలో ఇంధన ధరలు తగ్గించడం ఇది రెండోసారి. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 22 పైసలు తగ్గి రూ.90.56కు చేరగా.. డీజిల్‌ ధర 23 పైసలు తగ్గి రూ.80.87కు చేరింది. 

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.16 నమోదు కాగా, డీజిల్‌ ధర రూ.88.20కి చేరింది. ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.96.98, డీజిల్‌ ధర రూ.87.96 నమోదు కాగా.. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.66, డీజిల్‌ ధర రూ.85.96కు తగ్గాయి. సూయిజ్‌ కాలువలో వారం రోజులుగా నిలిచిపోయిన ఓడ సోమవారం తిరిగి కదలడంతో ముడిచమురు ధరలు 1శాతం తగ్గాయి. అంతేకాకుండా కొత్తగా కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్ల కారణంగా యూరప్‌లో లాక్‌డౌన్‌ పునరుద్ధరించడంతో అక్కడ ఇంధనానికి డిమాండ్‌ పడిపోవడమూ ఇంధన ధరల తగ్గుదలకు ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని