మళ్లీ పెరిగిన పెట్రో ధరలు!
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు విక్రయ కంపెనీలు నేడు నిర్ణయం తీసుకున్నాయి...
దిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు విక్రయ కంపెనీలు నేడు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం 25 పైసల మేర పెరిగాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.45కు చేరింది. డీజిల్ ధర రూ.74.38 నుంచి రూ.74.63కు పెరిగింది. ఈ పెంపుతో జయపురలో పెట్రో, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.91.85, డీజిల్ రూ.83.87గా ఉన్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.91.07కు చేరగా, డీజిల్ ధర రూ.81.34గా ఉన్నది. 2017, జూన్ 15 నుంచి చమురు కంపెనీలు పెట్రో ధరలను ప్రతి రోజు సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే దేశంలో ఇంధన ధరల పెంపునకు కారణమని చమురు విక్రయ సంస్థలు వెల్లడించాయి. 2020 మే నుంచి లీటర్ పెట్రోల్ ధర రూ.14.79, డీజిల్ రూ.12.34 పెరిగింది.
వివిధ నగరాల్లో పెట్రో ధరలు..
చెన్నైలో- పెట్రోల్ రూ.87.18, డీజిల్ రూ.79.95
కోల్కతా- పెట్రోల్ రూ.85.92, డీజిల్ రూ.78.22
హైదరాబాద్- పెట్రోల్ రూ.87.85, డీజిల్ రూ.81.45
బెంగళూరు- పెట్రోల్రూ.87.30, డీజిల్ రూ.79.14
జైపూర్- పెట్రోల్ రూ.91.85, డీజిల్ రూ.83.87
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!